breaking news
rolla mandal
-
ఒక ఊరి కథ: పిల్లా జెల్లా రోజంతా బయటే!
సాక్షి, బెంగళూరు: సుభిక్షంగా ఉండాలనుకుంటూ ఆ ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఒక్కరోజంతా పిల్లా జెల్లా గోడ్డుతో బయటే గడుపుతుంది. వన భోజనాల సమయంలో మండలంలోనే ఆ ఊరు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. రోళ్ల మండల పరిధిలోని దొమ్మరహట్టి గ్రామంలోని ప్రజలు ఏటా సంప్రదాయం ప్రకారం.. ఊరి నుంచి పిల్లాపాపలు, జంతువులతో ఊరిబయటకు తరలిపోతారు. సమీపాన గుడారాలు వేసుకున్నారు. ముందుగా ఊరి చుట్టు ముళ్ల కంపల కంచెను వేశారు. చెట్టు దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది ఒకసారి ఆషాఢ మాసంలో గ్రామాన్ని బహిష్కరించి చెట్టు దేవునికి వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించడం అనవాయితీ. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని, ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని గ్రామస్తుల నమ్మకం. రకరకాల వంటకాలు చేసి బంధుమిత్రులతో ఆరగించారు. గురువారం నాడు వనభోజనం నిర్వహించి.. సాయంత్రం వరకు ఊరి బయటనే ఆటపాటలతో గడిపారు. -
బస్సులో పరిచయమైన అమ్మాయితో ప్రేమ.. ఆమె నిరాకరించడంతో..
సాక్షి, అనంతపురం: ప్రేమ విఫలం కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం జీజీ హట్టి గ్రామానికి చెందిన వరుణ్యాదవ్ (17).. మడకశిరలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న తల్లి అమ్మజక్క అతి కష్టంపై కుమారుడిని చదివించుకుంటోంది. రోజూ బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో పరిచయమైన విద్యార్థిని పట్ల ప్రేమ పెంచుకున్న అతను.. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..) గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని తల్లితో చెప్పి బయలుదేరిన వరుణ్ యాదవ్.. రొళ్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గోవిందప్ప బావి వద్ద చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మడకశిర సీఐ శ్రీరామ్, గుడిబండ ఎస్ఐ సురేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, భర్త నిరాదరణకు గురై ఉన్న ఒక్కగానొక్క కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం పరితపించిన తల్లి విలపించిన తీరు అందరి చేత కన్నీరు పెట్టించింది. చదవండి: (డ్యూటీకని వెళ్లి.. జీతం తీసుకొని వెళ్లిపోయి.. ఫోన్ చేస్తే..) -
తవ్వేకొద్దీ అవినీతి
రత్నగిరి వాటర్షెడ్లో అక్రమాలు ఎన్నెన్నో రూ.79 లక్షల అవినీతి జరిగిందని మొదట్లో ఫిర్యాదు ప్రాజెక్ట్ అధికారులపై క్రిమినల్ కేసులు..అరెస్ట్ మొత్తం రూ.2.02 కోట్లు దుర్వినియోగమైనట్లు తాజాగా బహిర్గతం గుడ్డగుర్కి పంచాయతీలోనే రూ.1.67 కోట్ల అవినీతి అనంతపురం టౌన్ : రొళ్ల మండలంలోని రత్నగిరి మెగా వాటర్షెడ్లో తవ్వేకొద్దీ అవినీతి బయటపడుతోంది. సామాజిక తనిఖీల్లో వెల్లడైన అవినీతి మొత్తం రూ.1.80 కోట్లు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి రికవరీ చేసేందుకు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న మొత్తం రూ.79 లక్షలు. తాజాగా ఈ ‘లెక్క’ మారింది. ఏకంగా రూ.2.02 కోట్లు దుర్వినియోగమైనట్లు డ్వామా అధికారులు రొళ్ల పోలీస్స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. 2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్ కింద రత్నగిరి మెగా వాటర్షెడ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దీన్ని ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. ప్రాజెక్టు కాల వ్యవధి ఏడేళ్లు. గత ఏడాది సెప్టెంబర్లో ముగిసింది. ఈ ప్రాజెక్టు కింద రత్నగిరి, కాకి, దొడ్డేరి, గుడ్డగుర్కి పంచాయతీల్లో మైక్రో వాటర్షెడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రూ.10.52 కోట్లు ఖర్చు చేశారు. పనుల్లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. కూలీలతో చేయించాల్సిన ఫారంపాండ్లను యంత్రాలతో తవ్వించారు. చెక్డ్యాంలకు మరమ్మతు చేసినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు దిగమించారు. పండ్లతోటల పెంపకం చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాటర్షెడ్ కమిటీల ముసుగులో తెలుగు తమ్ముళ్లు అందినకాడికి దోచుకున్నారు. ఇందుకు అధికారులు సైతం ‘మామూలు’గా సహకరించారు. 2014–16 మధ్యకాలంలో ప్రాజెక్టు పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. గుడ్డగుర్కి పంచాయతీలో రూ.60 లక్షలు, రత్నగిరి రూ.60 లక్షలు, దొడ్డేరి రూ.30 లక్షలు, కాకి పంచాయతీలో రూ.30 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. దీనిపై నివేదిక అప్పటి కలెక్టర్ కోన శశిధర్ వద్దకు చేరగా ఆయన సీరియస్గా పరిగణించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రాజెక్ట్ ఆఫీసర్ బదరీష్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్షెడ్ సిబ్బంది మహాలింగప్ప, బాలాజీ, నరసింహమూర్తిపై రొళ్ల పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. రూ.1.80 కోట్ల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలో తేలినా.. ఫిర్యాదులో మాత్రం రూ.79 లక్షలు పేర్కొన్నారు. అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చాక నిందితులు పరారయ్యారు. వారిని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. తాజాగా రూ.2.2 కోట్లు.. రత్నగిరి వాటర్షెడ్ పరిధిలో అవినీతిపై సమగ్ర విచారణ చేస్తే పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం వెలుగులోకి వస్తుందని పేర్కొంటూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఫారంపాండ్లు, కొత్త చెక్డ్యాంలు, చెక్డ్యాం మరమ్మతులు, టీడీపీ నేతలు చేపట్టిన పనులపై ఇచ్చిన ఈ కథనాలు సంచలనం సృష్టించాయి. నిందితులను కాపాడేందుకు జరుగుతున్న లోగుట్టు వ్యవహారాన్ని కూడా ఎత్తిచూపింది. ఇందుకు స్పందించిన అప్పటి కలెక్టర్ కోన శశిధర్ ఏకంగా సదరు సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 2014–15 బ్యాచ్ కింద ‘ఫోర్డ్’ సంస్థకు అగళి మండలంలో మంజూరైన ‘రావుడి’ వాటర్షెడ్ ప్రాజెక్టును రద్దు చేసి మడకశిర డబ్ల్యూసీసీ (వాటర్షెడ్ కంప్యూటర్ సెంటర్)కు బదలాయించారు. ఈ నేపథ్యంలోనే ‘రత్నగిరి’ అక్రమాలపై ఇంటెలిజెన్స్ సైతం దృష్టి పెట్టింది. కలెక్టర్ ప్రత్యేకంగా విచారణ చేయించారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం అవినీతి ‘లెక్క’ను పెంచారు. గతంలో రూ.79 లక్షలు దుర్వినియోగమైనట్లు పేర్కొన్న అధికారులు దానికి మరింత జోడించి రూ.2.02 కోట్ల అవినీతి జరిగినట్లు ఫిర్యాదు చేశారు. రత్నగిరి మైక్రో వాటర్షెడ్లో రూ.68,683, కాకిలో రూ.20,28,407, దొడ్డేరిలో రూ.14,06,186, గుడ్డగుర్కిలో రూ.1,67,31,170 దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా రూ.2,02,34,446 దుర్వినియోగమైందని తేల్చారు.