breaking news
rice waste
-
Rice Water రైస్ వాటర్ మ్యాజిక్ నిజమేనా? లేక జిమ్మిక్కా?
ఆధునిక కాలంలో అందమైన ముఖం, చక్కటి జుట్టు, గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ఉత్పత్తులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీనికి తోడు అనేక గృహచిట్కాలు కూడా తరచూ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో రైస్ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి కాన్సెప్ట్తో వస్తున్న వీడియోలకు కొదవలేదు. మరి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..! సోషల్ మీడియా ప్రకారం రైస్ వాటర్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలంటే.. బియ్యాన్ని నీటిలో శుభ్రంగా, మూడుసార్లు కడిగి మూడోసారి నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంటెడ్ వాటర్తో ముఖాన్ని మృదువుగా కడుక్కోవాలి. అలాగే బియ్యం వాటర్తో కడిగిన తరువాత మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే ముఖం డ్రైగా మారే అవకాశం ఉంది. ♦ ఈ బియ్యం నీటిని దాదాపు 2 వారాల పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకొని, సాధారణ ఉష్టోగ్రతకు వచ్చిన తరువాత జుట్టుకు కూడా అప్లయ్ చేసుకొని, తరువాత కెమికల్స్లేని షాంపూతో తలంటుకోవాలి. దీని తరువాత కండీషన్ అప్లై చేయాలి. ♦ రైస్ వాటర్ చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా చర్మం నూతనంగా ఉంటుంది. ముఖంపై మచ్చలను తొలగించడం, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించడం వంటి ఉపయోగాలను అందిస్తుంది. నిపుణులు ఏమంటున్నారు? జపాన్, చైనా కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతారు. ఇందులో రైస్ వాటర్ టోనర్, ఫేస్ వాష్, రైస్ ఫ్లోర్ ఫేస్ మాస్క్, క్రీమ్ ప్రధానంగా ఉన్నాయి. అయితే బియ్యం కడిగిన నీటిని ముఖానికి జుట్టుకు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు వరిలో పోషకాలు పుష్కలంగాఉన్నప్పటికీ,చర్మం, జుట్టుకు ఉపయోగపడుతుందనడానికి పరిశోధన, ఆధారాలు లేవని ఆడుబాన్ డెర్మటాలజీ బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ డియర్డ్రే హూపర్ చెప్పారు. అయితే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి జుట్టుకు ట్రీట్మెంట్గా ఉపయోగించడం కొత్తది కాదు. వేలాది సంవత్సరాలుగా అనేక ఆసియా దేశాలలో నివసిస్తున్న ప్రజలు బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు. వారి పొడవాటి జుట్టుకి కారణం పులియబెట్టిన బియ్యం నీరే అని చెబుతారు. 1000 సంవత్సరంలో జపనీస్ మహిళలు యు-సు-రు లేదా కడిగిన బియ్యం నీళ్లతో జుట్టును వాష్ చేసుకునేవారట. బియ్యంలో మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ , నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే బియ్యం నీటిలో ఫినాల్స్ ఉంటాయి. ఇది అలోపేసియా అరేటా చికిత్సలో సహాయపడుతుంది. కానీ కొంతమందిలోమాత్రం పరిస్థితిని మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు బియ్యం నిల్వ ఉండేందుకు కొన్ని రకాల పౌడర్లు కలుపుతారు. ఇవి చర్మానికి హాని కరం హానికరం. రైస్ వాటర్లోని స్టార్చ్తో జుట్టు పెళుసుబారుతుంది వెంట్రుకలను బియ్యం నీటిలో కడుక్కోవడం వల్ల చిక్కు జుట్టు సులభంగా విరిగిపోయే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ స్కూల్లోని డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రోండా ఫరా చెప్పారు. రైస్ వాటర్లో ఉంటే స్టార్చ్, తేమను పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు పెళుసుగా మారుతుందట. అలాగే ప్రాసెస్ చేసిన బియ్యంతో తయారు చేసిన బియ్యం నీరు ఏ మేరకు ఉపయోపడుతుందో తేల్చ లేమన్నారు. సిల్కీ జుట్టు కారణాలు పలు అంశాలపై అధారపడి ఉంటాయని అంతేకాదు ఒక్కో మనిషి జుట్టు రకం భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే వైద్య చిట్కాలు పనిచేయని కూడా నిపుణులు చెబుతున్నారు. నోట్: ఇంటర్నెట్లో దొరికే సమాచారం అంతా నిజమని నమ్మలేం. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలనుకుంటే, ఒత్తైన జుట్టు కావాలనుకుంటే (ఇది వారి జీన్స్ ఆధారితమైంది కూడా అనేది గమనించాలి) జీవన శైలి మార్పులు అవసరం. ఒత్తిడికి దూరంగా ఉంటూ, చుండ్రుకు చికిత్స చేయడం, హెయిర్ డ్రైయ్యర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. సురక్షితమైన, సహజమైన రైస్ బ్రాన్ మినరల్ ఎక్స్ట్రాక్ట్ ఉత్పత్తులను వాడుకోవచ్చు. -
వరి ఊకతో గ్రీన్ వుడ్
అమృత్సర్: సృజనాత్మకంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది. ఆ పరిష్కారంలో కొత్త ఆవిష్కరణలు కూడా పుట్టుకొస్తాయి. అమృత్సర్కు చెందిన 15 ఏళ్ల బిస్మన్ డెయూ విషయంలోనూ అదే జరిగింది. బిస్మన్ ప్రతిరోజు సాయంత్రం తన తండ్రితో కలసి పొలానికి వాకింగ్కు వెళ్లేది. సమీప పొలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి దుబ్బను పోగేసి తగులబెట్టడం చూసేది. అందులో నుంచి వెలువడే దట్టమైన పొగ ఊపిరాడనిచ్చేది కాదు. కాలుష్యానికి కూడా కారణమవుతున్న వరి దుబ్బను తగులబెట్టే సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనుకుంది. ఎలా దీనికి పరిష్కారం కనుగొనడం ఎలా? అంటూ ఆలోచిస్తూ పోయింది. ఓ రోజు వరి ఊకను చేతుల్లోకి తీసుకొని పరిశీలించింది. అందులో ఏ పదార్థం ఉంటుందో కనుక్కోవాలనుకుంది. తనకు తెలిసిన ప్రయోగాల ద్వారా అందులో వాటర్ప్రూఫ్గా పనిచేసే సిలికాన్ పదార్థం ఉన్నట్లు కనుగొన్నది. ఈ సిలికాన్ పదార్థానికి చెదలుపట్టే గుణం కూడా లేదని గ్రహించింది. వెంటనే వరి ఊకను ఇంటికి తీసుకెళ్లి వంటింటినే తన ప్రయోగశాలగా చేసుకొంది. ఊకను జిగురుతో కలిపి ముద్దు చేసింది. దాన్ని పలక మాదిరిగాచేసి పొయ్యిపై వేడి చేసింది. ఆశ్చర్యంగా అది బలమైన చెక్క పలకగా మారిపోయింది. ఇలాంటి పలకలను పెద్ద ఎత్తున తయారుచేసి ఇంటి నిర్మాణంలో ఉపయోగించుకోవచ్చని గుర్తించింది. మరో ఇద్దరు స్నేహితురాళ్ల సహాయంలో మరిన్ని పలకలు తయారు చేసింది. ఆ పలకలకు ‘గ్రీన్ వుడ్’ అని పేరు కూడా పెట్టింది. హైస్కూల్ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించే 2013-సోషల్ ఇన్నోవేషన్ పోటీ’లకు వెళ్లింది. ఆక్కడ 42 వేల మంది విద్యార్థులతో పోటీ పడి తన గ్రీన్ వుడ్కు బహుమతి గెలుచుకుంది. ఆ మరుసటి సంవత్సరం న్యూయార్క్లో జరిగిన ఓ చిల్డ్రన్ ఈవెంట్కు యూనిసెఫ్ ఆహ్వానాన్ని అందుకుంది. అక్కడ ఇన్నోవేటివ్ ఆలోచనలపై ప్రసంగించి ప్రశంసలు అందుకున్నది. బిస్మన్కు ఇప్పుడు 18 ఏళ్లు. చండీగఢ్ స్కూల్లో చదువుకుంటోంది. తన గ్రీన్ ఉడ్ను మరింత పాపులర్ చేసేందుకు కృషి చేస్తోంది. తన గ్రీన్ ఉడ్ను మార్కెట్ పరంగా ఉత్పత్తి చేసి విక్రయించేందుకు దేశం నుంచే కాకుండా ఈక్వెడార్ నుంచి కూడా కంపెనీలు వస్తున్నాయని ఆమె చెబుతోంది.