breaking news
reward in lakhs
-
పారా షట్లర్లకు రూ. 50 లక్షలు నజరానా
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్లో పతకాలు సాధించిన ఐదుగురు పారా షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల జరిగిన దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత షట్లర్లు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) సాధించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో స్వర్ణం గెలిచిన నితీశ్ కుమార్కు రూ. 15 లక్షలు, రజత పతకాలు గెలిచిన సుహాస్ యతిరాజ్ (పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4), తులసిమతి మురుగేశన్ (మహిళల సింగిల్స్ ఎస్యూ5)లకు రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. మహిళల సింగిల్స్ ఎస్యూ5లో కాంస్యం నెగ్గిన మనీషా రామదాస్, ఎస్యూ5లో కాంస్యం సాధించిన నిత్యశ్రీకి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ‘అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత పారా షట్లర్లకు నగదు బహుమతి అందించాలని నిర్ణయించాం. పారాలింపిక్స్లో సాధించిన పతకాలకు ఇది గుర్తింపు లాంటిది. మరిన్ని పతకాలు సాధించేందుకు పారా షట్లర్లకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’ అని బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి సంజయ్ మిశ్రా పేర్కొన్నాడు. -
భారత్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్లో సినీ ఫక్కీలో అరెస్ట్
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ నేపాల్లో తలదాచుకున్న మావోయిస్టు నేత దినేష్ గోపే అరెస్ట్ అయ్యాడు. ఇక, అంతకుముందు గోపే ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, ఝార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. వివరాల ప్రకారం.. మావోయిస్టు నేత దినేష్ గోపే మారు వేషంతో నేపాల్లో తలదాచుకుంటున్నాడు. మూడు రాష్ట్రాల్లో 100కుపైగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న గోపేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. కాగా, నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన దినేష్ గోపే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సిక్కు వ్యక్తిలా నటిస్తూ 13 నెలలుగా నేపాల్లో దాబా నడుపుతున్నాడు. అయితే, ఇటీవల ఆయన.. జార్ఖండ్లోని బీజేపీ నేతలకు ఫోన్ కాల్ చేయడంతో ఎన్ఐఏకు చిక్కాడు. అతడి ఫోన్కాల్ను ట్రేస్ చేసిన అధికారులు.. గోపే నేపాల్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు ఎంతో చాకచక్యంగా గోపేను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. గతేడాది జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భమ్లో గోపే నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) సభ్యులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నుంచి గోపే చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నేపాల్ పారిపోయి అంతర్జాతీయ సరిహద్దులోని బిరత్నగర్లో ధాబా నడుపుతున్నాడు. అయితే, నిరుద్యోగులైన యువకులకు ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మోటార్ బైక్స్ ఇచ్చి హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేలా చేశాడు దినేష్ గోపే. కాగా, గత 15 ఏళ్లుగా భారతీయ భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్ ఫోర్స్ నక్సలైట్ దినేష్ గోపే కోసం వెతుకుతున్నాయి. మరోవైపు.. జార్ఖండ్, బీహార్, ఒడిశాలలో హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులు, దోపిడీలు, నిధుల సేకరణ వంటి వాటికి సంబంధించి గోపేపై 102 కేసులు నమోదయ్యాయి. అతడి ఆచూకీ తెలిపిన వారికి ఎన్ఐఏ రూ. 5 లక్షలు, జార్ఖండ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు రివార్డు ప్రకటించాయి. Most wanted Naxal Commander Dinesh Gope was living in Delhi arrested in Joint op by NIA & JH Police. He is wanted by JH, Odisha, Bihar in 100+ cases & had ₹30L reward. Has 100's of pockets all around the borders of Delhi where u have Illegal Immigrants staying in millions. pic.twitter.com/F35UuJVs0R — Kavi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@kavita_tewari) May 22, 2023 ఇది కూడా చదవండి: 'మా స్టాండ్ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్ పవార్ -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: ప్లాటూన్ నెంబర్ 26 క్రియాశీల పాత్ర పోషించిన ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం సీఆర్పీఎఫ్ డీఐజీ, సుకుమా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల సమక్షంలో ఇద్దరు మావోలు లోంగిపోయారు. లొంగిపోయిన వారిలో అశోక్ తాతి అలియాస్ రోషన్ పేరిట రూ. 2 లక్షల రివార్డ్ ఉండగా.. మరో మావో సుశిల్ కోర్సా అలియాస్ దేవ పేరిట రూ. లక్ష రివార్డ్ ఉన్నట్లు సీఆర్పీఎఫ్ డీఐజీ తెలిపారు. వీరిద్దరు పలు విద్రోహ చర్లల లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.