-
రెనాల్ట్ : 15 వేల మంది తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ చేరింది. అమ్మకాలు మందగించడంతో 15 వేల మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే కొన్ని ప్లాంట్లను పునర్వవస్థీకరణ చేయనున్నామనీ, ఇందుకు యూనియన్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. వీరిలో ప్రధానంగా ఫ్రాన్స్కు చెందిన 4,600 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో 10 వేల మందికి పైగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా1.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చేమూడేళ్లలో దాదాపు రూ.16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుత 40 లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2024 నాటికి 33 లక్షలకు తగ్గించే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఉత్పత్తిలో కోత విధించి, మరింత లాభదాయకమైన మోడళ్లపై దృష్టిపెట్టనుంది. (12 వేల మందిని తొలగించనున్న బోయింగ్) కాగా కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్ద వ్యాపార సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో జీతాలలో కోత ఉద్యోగులను తొలగించడం చేస్తున్న సంగతి తెలిసిందే. (కోవిడ్-19: రోల్స్ రాయిస్లో వేలాదిమందికి ఉద్వాసన) -
రెండు నెలల్లో పునర్వవస్థీకరణ
హైదరాబాద్: రెండు నెలల్లో ఏపీ కాంగ్రెస్ను పునర్ వ్యవస్థీకరిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. మండల, జిల్లా అనుబంధ విభాగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఆహ్వానించి, రెండు రోజుల వర్క్ షాపు నిర్వహిస్తామని చెప్పారు. ఇందిరాభవన్లో ఈ రోజు జరిగిన ఏపీసీసీ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త రుణాలు ఇప్పించాలన్నారు. గత ఏడాది 1314 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని తక్షణమే విడుదల చేయాల డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న అంశాలన్నీ అమలు జరపాలన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు ఇప్పుడున్న ఆదర్శ రైతులను, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం సరికాదని చెప్పారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసే ఆలోచనను కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఉపసంహరించుకోవాలని కోరారు. శ్వేత పత్రాల పేరిట చంద్రబాబు విడుదల చేస్తున్న అవాస్తవ పచ్చ పత్రాల బండారాన్ని ప్రజల్లోనే బయటపెడతామన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని రఘువీరా అన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement