breaking news
the Republic Day
-
స్వరాజ్య స్ఫూర్తి..గణతంత్ర దీప్తి
అనంతపురం కల్చరల్ : భారతావని దాస్యశృంఖలాలను ఛేదించి భరతమాతకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దేశానికి దిశాదర్శనం చేసేందుకు జాతీయనాయకులు ఎంతో శ్రమించి సర్వోత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. 1950 జనవరి 26న అధికారికంగా దీనికి శ్రీకారం చుట్టారు. అహింసే నాటి ఆయుధం.. త్యాగం, శాంతి, నిస్వార్థం.. దేశభక్తే ఆనాటి ప్రధాన ఆయుధంగా తెల్లవారిని తరిమికొట్టిన ఆనాటి దేశభక్తులలో అనంత వాసులు తమదైన పాత్రను పోషించి భరతమాత సంకెళను తెంచడంలో తోడ్పడ్డారు. నాటి ఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచినవారి మనోగతాలు ఇలా... అప్పటి నిజాయితీ కనపడదు స్వాతంత్ర పోరాటంలో ప్రతి పౌరుడూ తమ వంతు పాత్ర పోషించారు. ప్రత్యక్షంగా పోరా డి, జైళ్లకు వెళ్ళిన వారిని మాత్రమే స్వాతంత్య్ర సమర యోధులుగా గుర్తిస్తున్నారు. ఆనాడు దేశంలోని ప్రతి వ్యక్తి భరత మాత ధాస్య శృంఖలాలను తెంచడానికి నిరుపమాన త్యా గాన్ని చేశారు. అనంత వాసులు ఆనాటి కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితరులున్నారు. వారిని చూసిన కళ్లతో ఇప్పటి రాజకీయ నాయకులను చూడలేకపోతున్నాం. - పెద్ద కొండప్ప (95), అనంతపురం దేశభక్తిని నింపే కార్యక్రమాలు చేపట్టాలి అనేక మంది త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్రం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 1952లో స్వాతంత్య్రానికి గుర్తుగా నగరంలో ఏర్పాటు చేసిన సభకు విచ్చేసిన అప్పటి ప్రధాని నెహ్రూ కోసం స్వయంగా పీటీసీ స్టేడియం ప్రాంతాన్ని స్వయంగా శుభ్రపరిచారు. కల్లూరు సుబ్బారావు, ఆర్ఎస్ నాగేశ్వరరావు వంటి వారు తమ కుటుంబాలను కాదని దేశం కోసం తమ ఆస్తులను ధారపోశారు. వారి ఆశయాల కోసం ఈతరం వారిలో దేశభక్తిని నింపే కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలి. - అబ్దుల్ సత్తార్ (85), అనంతపురం -
కాకతీయ శకటానికి నోచాన్స్
వరంగల్, న్యూస్లైన్ : కాకతీయుల చరిత్రను చాటిచెప్పే సువర్ణావకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగే పరేడ్లో కాకతీయ శకట ప్రదర్శనకు అవకాశం రాలేదు. అసలు రాష్ట్రం నుంచే ఏ శకట ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ పరేడ్లో ‘కాకతీయ శకటాన్ని’ ప్రదర్శించాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చాలా రోజుల క్రితమే పంపించారు. ఇందుకు రక్షణ శాఖ చివరి నిమిషంలో నో చెప్పిం ది. ఈ చర్య ఓరుగల్లు వాసులను తీవ్రంగా నిరాశ పరిచింది. రాష్ట్రానికి 2009 నుంచి రిపబ్లిక్ డే పరేడ్లో శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం లభించక పోవడం గమనార్హం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.