కాకతీయ శకటానికి నోచాన్స్ | Kakatiya carriages nocans | Sakshi
Sakshi News home page

కాకతీయ శకటానికి నోచాన్స్

Jan 27 2014 3:22 AM | Updated on Sep 2 2017 3:02 AM

కాకతీయుల చరిత్రను చాటిచెప్పే సువర్ణావకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని...

వరంగల్, న్యూస్‌లైన్ : కాకతీయుల చరిత్రను చాటిచెప్పే సువర్ణావకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే పరేడ్‌లో కాకతీయ శకట  ప్రదర్శనకు అవకాశం రాలేదు. అసలు రాష్ట్రం నుంచే ఏ శకట ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ‘కాకతీయ శకటాన్ని’ ప్రదర్శించాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చాలా రోజుల క్రితమే పంపించారు.

ఇందుకు రక్షణ శాఖ చివరి నిమిషంలో నో చెప్పిం ది. ఈ చర్య ఓరుగల్లు వాసులను తీవ్రంగా నిరాశ పరిచింది. రాష్ట్రానికి 2009 నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌లో శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం లభించక పోవడం గమనార్హం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement