breaking news
Renault Nissan
-
భారత్కు బై చెప్పం..!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్స్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తోందంటూ వస్తున్న వార్తలను కంపెనీ ఇండియా ఎండీ సౌరభ్ వత్స ఖండించారు. అలాంటి యోచనేదీ లేదని స్పష్టం చేశారు. అంతేగాకుండా 2027 నాటికి మరో మూడు కొత్త కార్లను ప్రవేశపెట్టబోతున్నామని, ఈ ఏడాది ఇంకో 20 డీలర్లను నియమించుకోబోతున్నామని వత్స తెలిపారు. భారత్లో జాయింట్ వెంచర్ సంస్థ రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా (ఆర్ఎన్ఏఐపీఎల్)లో నిస్సాన్కి ఉన్న 51 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు రెనో మార్చి 31న ప్రకటించింది. దీంతో నిస్సాన్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వత్స వివరణ ఇచ్చారు. గత 60 ఏళ్లుగా తాము దేశీ మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, తమ తయారీ, కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు మొదలైనవన్నీ యథాప్రకారంగానే అమలవుతాయని తెప్పారు. 2026 మొదటి త్రైమాసికంలో సెవెన్ సీటర్ బీ–సెగ్మెంట్ ఎంపీవీని, ఆ తర్వాత 2027 తొలి నాళ్లలో ఫైవ్.. సెవెన్ సీటర్ సీ–ఎస్యూవీని ప్రవేశపెట్టనున్నట్లు వత్స తెలిపారు. కొందరు డీలర్లు తప్పుకోవడంతో ప్రస్తుతం డీలర్íÙప్ల సంఖ్య 160కి పరిమితమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి దీన్ని 180కి పెంచుకోనున్నామని వత్స వివరించారు. మరోవైపు, ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్తో కూడా తమ మాగ్నైట్ ఎస్యూవీ లభిస్తుందని చెప్పారు. అదనంగా రూ. 74,999 చెల్లిస్తే ఈ సదుపాయాన్ని పొందవచ్చన్నారు. తొలి దశలో ఢిల్లీ–ఎన్సీఆర్, మహారాష్ట్ర, కేరళ తదితర 7 రాష్ట్రాల్లోని ఆథరైజ్డ్ డీలర్íÙప్ల ద్వారా సీఎన్జీ కిట్ ఇన్స్టాలేషన్ను ఆర్డరు చేయొచ్చని, రెండో దశలో దీన్ని మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. -
దుమ్ము రేపిన రెనో-నిస్సాన్ , సరికొత్త రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో-నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా 25 లక్షల యూనిట్ల తయారీ పూర్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. 600 ఎకరాల్లోని చెన్నై ప్లాంటు నుంచి విదేశాలకూ కార్లు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా 108 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు కార్లు విదేశీ గడ్డపై అడుగు పెట్టాయి. 13 ఏళ్లుగా ఈ కేంద్రం ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్లలో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లో ప్రవేశించాయి. -
రెనో క్విడ్, డాట్సన్ రెడీ గో కార్ల రీకాల్
• ఇంధన వ్యవస్థలో లోపాలు • సరిదిద్దడానికి చర్యలు... • 51 వేల కార్లను రీకాల్ చేస్తున్న • రెనో నిస్సాన్... 932 కార్లు న్యూఢిల్లీ: వాహన కంపెనీ భారత్లో 50 వేలకు పైగా రెనో క్విడ్ కార్లను రీకాల్ చేస్తోంది. మరో వాహన కంపెనీ నిస్సాన్ డాట్సన్ రెడీ గో మోడల్లో 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఇంధన వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి, హోస్ క్లిప్ను జత చేయడానికి ఈ కార్లను రీకాల్ చేస్తున్నామని రెండు కంపెనీలు పేర్కొన్నాయి. 2015, అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే 18 వరకూ తయారైన క్విడ్ (800 సీసీ) ఎల్ వేరియంట్లలో స్వచ్ఛంద తనిఖీలు నిర్వహిస్తున్నామని రెనో కంపెనీ తెలిపింది. ఇంధన వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంధన వ్యవస్థను తనిఖీ చేస్తున్నామని, ఫ్యూయల్ హోస్ క్లిప్ను జత చేస్తున్నామని వివరించింది. ఈ సమస్యలున్న కార్లను ఉచితంగా తనిఖీ చేస్తామని, ఏమైనా అవసరమైన చర్యలుంటే తీసుకుంటామని పేర్కొంది. ఈ కార్లను కొనుగోలు చేసిన యజమానులను సంప్రదిస్తున్నామని, తనిఖీ కోసం కార్లను డీలర్ల వద్దకు తీసుకురావలసిందిగా కోరుతున్నామని వివరించింది. కాగా రీకాల్ కార్లలో 10 శాతం కార్లలో మాత్రమే ఈ సమస్యలున్నట్లు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చిన క్విడ్ 800 సీసీ కార్లను రూ.2.64-3.95 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో విక్రయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 56 వేల క్విడ్ కార్లను రెనో విక్రయించింది. మరోవైపు నిస్సాన్ కంపెనీ డాట్సన్ రెడీ గో మోడల్లో లోపాలున్న ఇంధన వ్యవస్థను సరిదిద్దడానికి 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఈ ఏడాది మే 18 వరకూ తయారైన కొన్ని కార్లలో ఈ లోపాలున్న కార్లను గుర్తించామని తెలిపింది. ఈ మోడల్ కార్లు ఇప్పటివరకూ 14వేలు అమ్ముడయ్యాయి. క్విడ్, డాట్సన్ రెడీ గో కార్లు సీఎంఎఫ్ఏ ప్లాట్ఫార్మ్పై చెన్నై ప్లాంట్లోనే తయారయ్యాయి. -
రెనో 800 సీసీ కారు వస్తోంది..
2 నెలల్లో భారత్లో విడుదల! - ధర రూ.2.5-4 లక్షల మధ్య - ఈ నెలలోనే లాడ్జీ ఎంపీవీ మార్కెట్లోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న ఫ్రాన్స్ కంపెనీ రెనో.. భారత్లో సామాన్యుడికీ దగ్గరయ్యేందుకు రెడీ అవుతోంది. 800 సీసీ కారును ఈ ఏడాది మే నాటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. చైన్నై సమీపంలోని ఒరగడం వద్ద ఉన్న రెనో నిస్సాన్ల సంయుక్త ప్లాంటులో ఎక్స్బీఏ కోడ్ పేరుతో ఈ ఎంట్రీ లెవెల్ మోడల్ సిద్ధమవుతోంది. చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్ఫామ్పై ఇది రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే భారతీయ రోడ్లపై దీనిని పరీక్షిస్తున్నారు కూడా. ఇక కారు ధర వేరియంట్నుబట్టి రూ.2.5-4 లక్షల మధ్య ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా రెనో నుంచి తక్కువ ఖరీదున్న కారు ఇదే కావడం విశేషం. రెనో ఎక్స్బీఏ గ్లోబల్ ప్రొడక్ట్గా రూపుదిద్దుకుంటోంది. తొలుత ఈ మోడల్ను భారత్లో ప్రవేశపెట్టనున్నారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియాలోని ఇతర దేశాల్లోనూ దీనిని పరిచయం చేయనున్నారు. నిస్సాన్ సైతం.. రెనో ఎక్స్బీఏ కోడ్ కారు 800 సీసీ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్తో రూపొందుతోంది. నిస్సాన్ సైతం ఇదే ఇంజన్పై భవిష్యత్లో తన అనుబంధ బ్రాండ్ అయిన డాట్సన్ ద్వారా చిన్న కారును ప్రవేశపెట్టనుంది. అయితే రెండు కార్ల మధ్య డిజైన్లో చాలా తేడాలుంటాయని ఇరు కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం డాట్సన్ విక్రయిస్తున్న డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ మోడళ్లు రెండూ కూడా 1,198 సీసీ ఇంజన్ సామర్థ్యం గలవి. డాట్సన్ గో ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో వేరియంట్నుబట్టి రూ.3.29 లక్షల నుంచి ప్రారంభం. కాగా, రూ.4 లక్షలలోపు ఖరీదున్న కారును ఆవిష్కరించేందుకు రెనో నిస్సాన్ అలయన్స్ చైర్మన్, సీఈవో కార్లోస్ గోసన్ మే నెలలో భారత్కు వస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. మే నెలలో విడుదలయ్యే మోడల్, అలాగే 800 సీసీ కారు ఒకటేనా అన్నది కంపెనీ ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం కొసమెరుపు. ఎంపీవీ ఈ నెలలోనే.. మల్టీ పర్పస్ వెహికిల్ ‘లాడ్జీ’ మార్చి చివరికల్లా భారత్లో అడుగు పెడుతోంది. ఆ తర్వాత రూ.4 లక్షలలోపు ధర గల కారును తీసుకొస్తున్నట్టు రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమీత్ సాహ్నే తెలిపారు. ఈ రెండు కార్లతో కంపెనీ మార్కెట్ వాటా రెండేళ్లలో రెండింతలై 5 శాతంపైగా నమోదు చేస్తుందని కంపెనీ ఆశాభావంతో ఉంది. పాత కార్ల విక్రయ విభాగంలోకి రెనో ప్రవేశిస్తోంది. అన్ని కంపెనీల పాత కార్లను విక్రయించనున్నారు.