-
అప్పులు చెల్లించలేను.. వైరాగ్యంలో అనిల్
లండన్: దేశంలోనే సంపన్నుడు, ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో కొనసాగిన రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గత కొద్ది కాలంగా వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఓ దావాను ఎదుర్కొంటున్న అనిల్, తాజాగా తన ఆస్తులు సున్నాకు పడిపోయాయని లండన్ కోర్టుకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణాన్ని తీసుకున్నారు. తీవ్ర నష్టాలతో ఆర్కామ్ దివాలా తీసి, చైనా బ్యాంకులకు రుణాన్ని చెల్లించలేకపోయారు. ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు తమకు రావాల్సిన 4,800 కోట్లు చెల్లించాలని కోర్టుకు వెళ్లాయి. రుణ ఒప్పందం కింద రూ.4,800 కోట్లు చెల్లించాలని బ్యాంకులు కోర్టులో దావా వేశాయి. వాదనలు విన్న జడ్జి రూ.700 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే అనిల్ అంబానీ చెల్లించాల్సిన అప్పులను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడాయన ఆస్తులు విలువ పూర్తిగా పడిపోయిందని, అనిల్ తరఫు న్యాయవాది రాబర్ట్ హోవే కోర్టుకు తెలిపారు. తండ్రి చనిపోయాక ముకేశ్ వ్యాపారంలో దూసుకెళ్తుంటే అనిల్ వ్యాపారాలు మాత్రం తీవ్ర నష్టాలను చవిచూశాయి. ముఖేశ్ చమురు, సహజ వాయువులకు సంబంధించిన వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ -
అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ
ముంబయి : రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) డైరక్టర్స్ పదవికి అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాలను రుణ సంస్థల కమిటీ తిరస్కరించినట్లు ఆర్కామ్ తెలిపింది. ' సీవోసీ కమిటీ అంబానీతో పాటు మిగతావారి రాజీనామాలను తిరస్కరించింది. రాజీనామా చేసిన వారందరూ ఆర్కామ్లో యధావిధిగా తమ విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది. దివాల ప్రక్రియలో ఉన్న కంపెనీకి పరిష్కారమార్గం చూపించాలని' ఆర్కామ్ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ జులై-సెప్టెంబర్ కాలానికి రూ 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్టెల్ రూ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది. (చదవండి : ఆర్కామ్కు అనిల్ అంబానీ రాజీనామా) -
ఆర్కామ్కు అనిల్ అంబానీ రాజీనామా
ముంబై : సంక్షోభం అంచున నిలిచిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా అనిల్ అంబానీ శనివారం వైదొలిగారు. అనిల్ సహా నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన ఆర్ కామ్ నుంచి అనిల్ అంబానీతో పాటు ఛాయా విరాని, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచార్లు డైరెక్టర్లుగా వైదొలిగారు. బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో ఈ మేరకు కంపెనీ పేర్కొంది. కాగా గతంలో కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వీ మణికంఠన్ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్ కామ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ర్టం బకాయిలకు కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు రూ 30,142 కోట్లకు చేరిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం గుబులు రేపుతోంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం వొడాఫోన్ జులై-సెప్టెంబర్ కాలానికి రూ 50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతి ఎయిర్టెల్ రూ 23,000 కోట్ల నష్టాలను నమోదు చేసింది. -
మరింత కష్టాల్లోకి అంబానీ : మునగడమా? ఈదడమా?
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ మరింత కష్టాల్లోకి కూరుకుపోతున్నారు. ఇప్పటికే అప్పుల కుప్పలో కొట్టుమిట్టాడుతున్న ఆయనకు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నోటీసులు జారీ చేసింది. రాబోయే స్పెక్ట్రం చెల్లింపు బకాయిల కింద బ్యాంకు హామీలలో భాగంగా 774 కోట్ల రూపాయలు చెల్లించకపోతే లైసెన్సు రద్దు చేస్తామని డీఓటీ హెచ్చరించింది. ఈ నెల చివరి వరకు వీటిని చెల్లించాలని ఆదేశించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు తన ఆస్తులు అమ్మి రుణాలు తీర్చుకోవాలని భావిస్తున్న అనిల్ అంబానీ కంపెనీకి, డీఓటీ ఈ నోటీసులు జారీచేయడం మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం అంబానీ పరిస్థితి సముద్రంలో మునగడమా? ఈదడమా? అనే రీతిలో ఉందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఉన్న రూ.46వేల కోట్ల అప్పులను తీర్చేందుకు తన వైర్లెస్ ఆస్తులను అన్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియోకు విక్రయిస్తోంది. దీంతో రూ.18వేల కోట్ల మేర రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్జిస్తోంది. జూన్ చివరి వారంలోనే ఆర్కామ్కు డీఓటీ ఈ షోకాజు నోటీసు జారీచేసినట్టు తెలిసింది. ఈ నెల ప్రారంభంలోనే తాము నోటీసులు అందుకున్నామని, దానికి సమాధానం కూడా ఇచ్చినట్టు కంపెనీకి చెందిన అధికారులు చెప్పారు. బ్యాంకు గ్యారెంటీల కింద రూ.774కోట్లను చెల్లిస్తామని తెలిపారు. అయితే టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెట్ ట్రైబ్యునల్(టీడీశాట్) ఆదేశాల ప్రకారం బ్యాంక్ గ్యారెంటీల మొత్తాన్ని డీఓటీ తిరిగి ఇచ్చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే తాము బ్యాంక్ గ్యారెంటీలు వెంటనే చెల్లించకపోతే, డీఓటీకి ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా ఆర్కామ్ తన లేఖలో పేర్కొంది. అయితే ఈ ఫండ్స్ను ఆర్కామ్ సమకూర్చుతుందో లేదో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలను నిర్దేశించిన సమయం లోపల చెల్లించకపోతే, కంపెనీని స్పెక్ట్రమ్ సేల్లో అనుమతించేందుకు డీఓటీ సమ్మతించకపోవచ్చని తెలుస్తోంది. దీంతో జియోతో డీల్ జాప్యమవుతుంది. ఒకవేళ అన్నట్టే లైసెన్స్లను రద్దు చేస్తే, లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా డీఓటీ హెచ్చరించినట్టు అవుతోంది. -
రుణాలపై ఆర్కామ్ కొత్త ప్రణాళిక
ముంబై: భారీగా పేరుకుపోయిన రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్కామ్) మరో కొత్త ప్రణాళికను రూపొందించింది. మార్చి నాటికల్లా మొత్తం రుణ సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని కంపెనీ యోచిస్తోంది. బాకీలకు బదులుగా వాటాలిచ్చే ప్రసక్తి లేకుండా రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) ప్రణాళిక నుంచి వైదొలగడం, వ్యూహాత్మక ఇన్వెస్టరుతో జట్టు కట్టడం మొదలైన అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. ఆర్కామ్ చైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఈ విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుమారు 1.8 బిలియన్ డాలర్ల బాకీని రాబట్టుకునేందుకు ఆర్కామ్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించిన చైనా సంస్థ కూడా తాజా ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనతో రుణభారం రూ. 25,000 కోట్ల మేర తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం ఆర్కామ్ రుణభారం రూ. 44,000 కోట్ల మేర ఉంది. కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకటనతో ఆర్కామ్ షేర్లు మంగళవారం దూసుకెళ్లాయి. ఏకంగా 32 శాతం మేర లాభపడ్డాయి. సంస్థ మార్కెట్ విలువ ఒకేరోజు రూ.1,389 కోట్లు పెరిగి రూ. 5,899 కోట్లకు చేరింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement