-
విదేశీ గుప్పిట్లో... భారత కంపెనీలు!!
న్యూఢిల్లీ: అననుకూల పరిస్థితులతో ప్రమోటర్లు కఠిన నిర్ణయాలకు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితులను అధిగమించేందుకు కంపెనీల్లో తమ వాటాలను పూర్తిగా విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. నిధుల పరంగా తీవ్ర ఒత్తిళ్లు, అదే సమయంలో బ్యాంకులు పటిష్ట ఎన్పీఏ నిబంధనల కారణంగా కఠినంగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలతో... ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవడం లేదా తమ వాటాలను పూర్తిగా అమ్మేసి బయటకు వెళ్లిపోయేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. బ్లూంబర్గ్ డేటా ప్రకారం గతేడాది (2018) విదేశీ వ్యూహాత్మక కొనుగోలుదారులు (కంపెనీలు, పీఈ ఫండ్స్) భారత్లో 23.45 బిలియన్ డాలర్ల(రూ.1.64 లక్షల కోట్లు)ను ఇన్వెస్ట్ చేశారు. తద్వారా ఇక్కడి కంపెనీల్లో నియంత్రిత వాటాను సొంతం చేసుకున్నారు. విలీనాలు, కొనుగోళ్ల పరంగా మన దేశానికి 2018 రికార్డు సంవత్సరంగా నిలుస్తుంది. గత మూడేళ్లలో (2016, 17, 18) విదేశీ ఇన్వెస్టర్లు 52.6 బిలియన్ డాలర్ల నిధులతో భారత కంపెనీల్లో నియంత్రిత వాటాలను దక్కించుకోవడం గమనార్హం. 2013–15 కాలంలో వచ్చిన 25.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. సంక్షోభంలో పడకుండా... ప్రమోటర్లు తమ వాటాలను అమ్మేసుకోవడం వెనుక ఉన్న కారణాల్లో ప్రధానంగా తమ గ్రూపు రుణాలను తగ్గించుకోవడమే. దివాలా ప్రక్రియ కిందకు వెళితే తాము పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందన్న భయం వారిని ఈ నిర్ణయాల దిశగా నడిపిస్తోంది. ఉదాహరణకు... అనిల్ అంబానీ గ్రూపులోని రిలయన్స్ క్యాపిటల్ తన అనుబంధ రిలయన్స్ నిప్పన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఆర్నామ్)లో తనకున్న 42.88 శాతం వాటాను పూర్తిగా అమ్మేయాలని నిర్ణయించడమే. రిలయన్స్ క్యాపిటల్కు ఉన్న రూ.18,000 కోట్ల అప్పుల్లో సగం వరకు అయినా తగ్గించుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది. తన వాటాను మరో భాగస్వామి నిప్పన్ లైఫ్కు విక్రయించేందుకు ఆసక్తి కూడా తెలియజేసింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రమోటర్లు కూడా గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు తమ వాటాల్లో సగం మేర వ్యూహాత్మక ఇన్వెస్టర్కు విక్రయించనున్నట్టు ప్రకటించారు. కంపెనీల్లో తమ వాటాలను తనఖా పెట్టి మరీ వీరు భారీగా రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. తీసుకున్న రుణాలన్నీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వెచ్చించి సంక్షోభంలో చిక్కుకున్నారు. దీంతో దీన్నుంచి బయటపడేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. విలువైన ఆస్తులు... విదేశీ ఇన్వెస్టర్లు ఇంత భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత కంపెనీలను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం వెనుక... ఆ వ్యాపారాలను విలువైన ఆస్తులుగా ప్రమోటర్లు తీర్చిదిద్దడమే కారణమంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఒక నిదర్శనం ఈ కామర్స్ దేశీయ అగ్రగామి కంపెనీ ఫ్లిప్కార్ట్. దీన్ని 16 బిలియన్ డాలర్లు వెచ్చించి మరీ వాల్మార్ట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు వ్యవస్థాపకులు తమ వాటాలు వాల్మార్ట్కు విక్రయించి రూ.5,000 కోట్లకు పైగా సంపదతో బయటకు వెళ్లిపోవడం గమనార్హం. అంతకుముందు ఎన్నో విడతలుగా వీరు విదేశీ నిధుల సేకరణతో వ్యాపారాన్ని విస్తరించుకుంటూ తమ వాటాలను తగ్గించుకుంటూ వచ్చినవారే. 2016లో రష్యా ఇంధన దిగ్గజం రోజ్నెఫ్ట్, దాని భాగస్వాములు కలసి ఎస్సార్ ఆయిల్ను 13 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాయి. తద్వారా ప్రమోటర్లు రుయాలు గ్రూపు రుణ భారంలో పెద్ద మొత్తాన్ని చెల్లించేశారు. దేశంలో మరిన్ని కంపెనీల ప్రమోటర్లు తమ నియంత్రిత వాటాలను విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్న వాతావరణం నెలకొంది. ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ (పీఈ) డేటా ప్రకారం... ఐదు టాప్ పీఈ డీల్స్ విలువ 2017లో 700 మిలియన్ డాలర్లుగా ఉంది. 2018లో కేకేఆర్ ఒక్కటే 1.2 బిలియన్ డాలర్లతో భారత కంపెనీల్లో వాటాలను సొంతం చేసుకుంది. ఇందులో మ్యాక్స్ ఇండియాలో మెజారిటీ వాటా, రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్లో 60 శాతం వాటా కూడా ఉన్నాయి. -
రిలయన్స్ క్యాపిటల్ లాభం రూ.417 కోట్లు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.417 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో రూ.415 కోట్ల నికర లాభం వచ్చిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,828 కోట్ల నుంచి 80 శాతం వృద్ధి చెంది రూ.5,086 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్కు రూ.10.50 డివిడెండ్ను ఇవ్వనున్నట్లు తెలియజేసింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.1,101 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,086 కోట్లు చొప్పున నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.9,9998 కోట్ల నుంచి రూ.17,640 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ 4.5 శాతం లాభంతో రూ.670 వద్ద ముగిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement