-
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర!
తమిళ సినిమా: ప్రముఖ సినీ నటి నయనతార, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ వివాదానికి పుల్స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వారు సరోగసీ విధానంలో కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడంపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. నయనతార తన సరోగసీ విధానానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదే విధంగా గత డిసెంబర్లో అద్దె గర్భం కోసం రిజిస్టర్ చేసుకుని.. ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంది. -
బంజారాహిల్స్: పెళ్లి పేరుతో వంచింది..సహజీవనం చేసి...చివరికి
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదు నెలల పాటు సహజీవనం చేసి ఉడాయించిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... జవహర్నగర్ సమీపంలోని ఎస్.కె.నగర్లో నివసించే యువతి(24) ఓ ఆస్పత్రిలో కన్సల్టెంట్గా పని చేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇటీవల ఆమెకు ప్రకాశం జిల్లాకు చెందిన కె.ప్రసాద్(23)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని మెడలో పసుపుతాడు కట్టిన ప్రసాద్ ఆమెతో సహజీవనం చేయసాగాడు. ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది. రెండు నెలల గర్భం కూడా దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ కోరింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లిన ప్రసాద్ తిరిగి రాలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా గర్భానికి కారకుడైన ప్రసాద్పై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 417, 493 కింద కేసులు నమోదు చేశారు. (చదవండి: పేరు మార్చి.. ఏమార్చి!) -
సంప్రదాయ వివాహానికి ముందు..రిజిస్టర్ మ్యారేజ్
Katrina Kaif And Vicky Kaushal Wedding Date: హీరోయిన్ల పెళ్లి కబురంటే ఆ సందడే వేరు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనేది బజింగ్ టాక్. అయితే మీడియాకు దూరంగా ఈ వేడుకనుఎంతో రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు ఈ లవ్బర్డ్స్. కానీ బీటౌన్ ముచ్చట్లకు మాత్రం తెరపడటం లేదు. అతిరథ మహా రథులట, ఎగ్జోటిక్ సెర్మనీ, టైగర్ సఫారీ అట, అంతేకాదండోయ్ ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్కు హాజరయ్యే అతిథులకు బోలెడన్ని కండిషన్లట. 14వ శతాబ్దపు కోటలో సాంప్రదాయ పంజాబీ వివాహంతో ఒక్కటికానున్న ఈ స్టార్ జంట ఈ రోజో రేపో రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకోబోతున్నారట. ప్రత్యేక వివాహ చట్టం (1954 కులాంతర వివాహాల ప్రత్యేక వివాహ చట్టం) కింద తమ పెళ్లిని నమోదు చేసుకోనున్నారు. ఈ వేడుక ముగిసిన అనతరం గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ ఎగిరి పోనున్నారు. హాట్ టాపిక్గా నిలుస్తోన్న క్యాట్-విక్కీ వెడ్డింగ్ అంచనాలపై ఓ లుక్కేద్దాం. View this post on Instagram A post shared by Six Senses Fort Barwara (@sixsensesfortbarwara) -
నేడు ఒక్కటి కానున్న సైనా, కశ్యప్
పదేళ్లుగా ప్రేమించుకుంటున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు జంటగా మారబోతున్నారు. నేడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య శుక్రవారం వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, విమల దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. రిజిస్టర్మ్యారేజ్ చేసుకోనున్న సైనా, కశ్యప్లు రిసెప్షన్ను మాత్రం వైభవంగా జరుపుకోనున్నారు.ఈ నెల 16న హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో జరిగే వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,దగ్గుబాటి సురేష్లతో పాటు ‘అగిలే గ్రూప్ హైదరాబాద్ హంటర్స్’ చీఫ్ ఎండీవీఆర్కే రావు, మంత్రి కేటీఆర్, చాముండేశ్వరీనాథ్, రాజకీయ ప్రముఖులకురిసెప్షన్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. హిమాయత్నగర్: తెలుగువారి కీర్తి, ప్రతిష్టలను, క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటిన బ్యాడ్మింటన్ స్టార్లు జంటగా నేడు ఓ ఇంటివారు కానున్నారు. పదేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఇటీవల ప్రకటించిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఇందుకు రాయదుర్గంలోని సైనా నివాసం వేదిక కానుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరవుతున్న ఈ ‘రాకెట్ స్టార్స్’ వివాహ వేడుక సవ్యసాచి ఔట్ఫిట్లో.. నోవాటెల్లో జరిగే రిసెప్షన్కి సైనా, కశ్యప్ దంపతులు సవ్యసాచి ఔట్ఫిట్తో చేసిన దుస్తులు ధరించనున్నారు. సైనా ‘లెహంగా విత్ వెల్వెట్ దుప్పాట’ దుస్తులు, డైమండ్ జ్యువెలరీతో మెరవనుంది. కశ్యప్ షేర్వానీ విత్ పెన్ జ్యువెలరీలో కనిపించనున్నారు. వీరిస్టైలిష్ట్ని ప్రముఖ డిజైనర్ శ్రావ్యవర్మ చూస్తున్నారు. లెహంగా.. కుర్తీ.. సింప్లిసిటీ.. నేడు జరగనున్న పెళ్లికి మాత్రం సైనా, కశ్యప్ చాలా సింప్లిసిటీ వస్త్రధారణలో కనిపించనున్నారు. సైనా లెహంగాను, కశ్యప్ బేబీ పింక్ కుర్తా అండ్ షేర్వానీ ధరించనున్నారు. 15వ తేదీ రాత్రి 40మంది తోటి క్రీడాకారులకు ‘కాక్టైల్ పార్టీ’ ఇవ్వనున్నారు. ఈ పార్టీలో సైనా గౌన్లో, కశ్యప్ పౌడర్ బ్లూ సూట్లో కనిపించనున్నట్లు స్టైలిస్ట్ శ్రావ్యవర్మ తెలిపారు. కొత్తగా కనిపిస్తారు.. సైనా, కశ్యప్లిద్దరూ పదిహేను రోజులుగా సభ్యసాచి ఔట్ఫిట్ దుస్తులు ధరించనున్నారు. ఇంతకు మునుపెన్నడూ చూడని సైనా, కశ్యప్లను రిసెప్షన్లో చూపించనున్నాను. – శ్రావ్యవర్మ, స్టైలిస్ట్ రిసెప్షన్కు సెలబ్రిటీలు నోవాటెల్లో జరిగే రిసెప్షన్లో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. రణ్వీర్సింగ్, దీపిక, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ధోని, సమంత, రకూల్ప్రీత్ సింగ్, కీర్తిసురేష్, మిథాలీరాజ్, పీవీ సింధు, గోపీచంద్, అశ్విని పొన్నప్ప తదితరులు హాజరు కానున్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- 100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement