పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించాలి
రాజమహేంద్రవరం సిటీ :
ఉద్యోగ భవిష్యనిధి (పీఎఫ్)కి చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించాలని రికవరీ అధికారి పి.డి.ఎల్.ఎన్.వి.ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లేనిపక్షంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ బకాయిపడ్డ యజయానులంతా తక్షణమే రాజమహేంద్రవరం కమిషనర్ కార్యాలయంలో చెల్లించాలన్నారు. చెల్లించని బకాయిదారులపై ప్రాసిక్యూషన్ ^è ర్యలు చేపడతామని హె చ్చరించారు.