-
మేడ్చల్ ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీంద్రకుమార్ ఆత్మహత్య
-
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?
కాంగ్రెస్పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు నాడు మా 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకోలేదా? రాష్ట్రం వ చ్చాక కూడా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి బెర్లిన్ గోడ బద్దలైనట్టు మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయన్నాడు చంద్రబాబు.. ఈ ప్రభుత్వం ఎల్లుండే పడిపోతుందన్నడు భట్టి తెలంగాణకు నీళ్లు వద్దన్న తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం ఏం నీతో జానారెడ్డి చెప్పాలి రాష్ట్రం రాజకీ య, ఆర్థిక సుస్థిరత సాధించాలి.. తెలంగాణకు టీఆర్ఎస్సే రక్షణ కవచం మేం పిలవడం లేదు.. అభివృద్ధిని చూసి వారే వస్తున్నారు టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు వివేక్, వినోద్ సాక్షి, హైదరాబాద్: ‘‘నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం కోసం గెలిచిన 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకున్నారు. ఆనాడు లేని నీతి ఇప్పుడెలా గుర్తుకొచ్చింది? సరిగ్గా ఎన్నికల ముందు మా ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని చేర్చుకోలేదా..? మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా..?’’ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రం రాజకీయ, ఆర్థిక సుస్థిరత సాధించాలని, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. బుధవారం కాంగ్రెస్కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, దేవరకొండ నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ గుత్తా మాత్రం టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఒక జెడ్పీ వైస్ చైర్మన్, ముగ్గురు ఎంపీపీలు, ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఒక మున్సిపల్ చైర్పర్సన్, ఐదుగురు కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ నేతల తీరును తూర్పారబట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. నేను బతికా.. ప్రజలు ఆనందపడ్డరు.. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 14ఎఫ్ మార్పిడికి నిరసనగా ఆమరణ దీక్షకు దిగా. కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది. దీక్ష సమయంలో నేను చావాల్సింది.. కానీ చావలేదు. ప్రజలు ఆనందపడ్డరు. అంతకుముందు ఎన్నోసార్లు తెలంగాణ కోసం మేం మూకుమ్మడి రాజీనామాలు చేసి పోటీకి వెళ్తే మాపై పోటీకి వచ్చారు. కానీ ప్రజలు మమ్ముల్నే గెలిపించారు. రాష్ట్రం వచ్చాక కూడా అనేక చర్యలకు పాల్పడ్డరు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే 63 సీట్లలో గెలిచినం. మరో 14 సీట్లలో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయినం. బాబు మామూలు కుట్రలు చేయలే.. తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మామూలు కుట్రలు చేయలేదు. బెర్లిన్ గోడ బద్దలై జర్మనీ ప్రజలు కలసిపోయినట్లు ఏపీ, తెలంగాణ మళ్లీ కలసిపోతయని మాట్లాడిండు. కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అయితే.. ఎల్లుండే ప్రభుత్వం పడిపోతదన్నడు. నేను సీఎంగా బాధ్యతలు తీసుకోక ముందే కుట్రలు చేసిండ్రు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నాకు ఫోన్ చేసి ఇంటికొచ్చిండు. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా కుట్రలు చేస్తున్నయని చెప్పిండు. రాష్ట్రపతి పాలన తెచ్చే కుట్రలు చేస్తున్నరని చెప్పిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదేందన్నడు. టీఆర్ఎస్కు మద్దతిస్తామని తెల్లారే ప్రకటించిండు. కాంగ్రెస్, టీడీపీ నేతల లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ రాష్ర్టం ఏర్పడొద్దు. ఏర్పడితే బతకొద్దు. జానారెడ్డి రాష్ట్రం భ్రష్టు పడుతోందని అంటున్నడు. కాదు కాదు.. కాంగ్రెస్ భ్రష్టు పడుతోంది. కేసీఆర్కు ఒక్కటే నీతి.. తెలంగాణ రాష్ట్రం తన శక్తి మీద తాను నిలబడాలి. రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించాలి. సమైక్యవాదుల కుట్రలకు బలికావొద్దు. బలంగా ఉండాలి. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2019 కంటే ముందే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అంటడు. చంద్రబాబూ.. ప్రభుత్వం కూలిపోతుందని అనడం ఏం నీతి? అది సక్రమమైన ఆలోచనా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగానే అట్లెట్ల అంటడు? తెలంగాణకు నీళ్లు వద్దంటడు. పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టడం ఏ రకమైన నీతో జానారెడ్డి చెప్పాలి. అచ్చంపేట ఎన్నికల్లో అందరూ కలసి కూటమి కడతరు. ఇదేం నీతి? మీరు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా? అభివృద్ధిని చూసే వస్తున్నారు.. టీఆర్ఎస్లోకి వలస వస్తున్న వారిని మేం పిలవడం లేదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి వస్తున్నరు. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావు. వీటిని అలా చూడటం లేదు. చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సొంత నిర్ణయంతో వచ్చారు. మేం రమ్మన లేదు. ఎమ్మెల్యే భాస్కర్రావు కూడా ఏడాదిన్నరగా మాతో టచ్లో ఉన్నారు. అమ్ముడుపోయారని, కేసీఆర్ కొన్నాడని అంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ కేవలం తన తండ్రి కోరిక మేరకే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్లారు. మీ పాలనలో మంచి పనులు జరుగుతున్నాయి. కలసి పనిచేస్తానని, మళ్లీ పార్టీలోకి వస్తానన్నారు. సుఖేందర్రెడ్డి, నేనూ ఆప్త మిత్రులం. 1996లోనే శ్రీరాంసాగర్ డ్యామ్పై కూర్చుని తెలంగాణ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివాలయంలా ఉందన్న. ఏపీలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు న్యాయం జరగద ని ఆ రోజే చెప్పిన. 2001లో నేనే ఉద్యమం మొదలు పెట్టా. తెలంగాణది వందేళ్ల దుఃఖం. సమైక్య రాష్ట్రంలో చేరి కష్టాలు పడ్డాం. ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తాం. పేదరికాన్ని రూపుమాపుతం. 2019లోగానే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం. సాదా బైనామాల రిజిస్ట్రేషన్కు గడువు పొడిగింపు ఈ సమావేశానికి వచ్చే ముందే సీసీఎల్ఎతో మాట్లాడా. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామాలకు సంబంధించి 6 లక్షల మంది ఆర్వోఆర్ పట్టాలు పొందారు. మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నాం. చరిత్రలో ఎవరూ ఈ ఆలోచన చేయలేదు. దీంతోపాటు హైదరాబాద్లో పేదలకు ఇప్పటికే లక్ష మందికి పట్టాలిచ్చాం. తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. నేను మళ్లీ చెబుతున్నా.. టీఆర్ఎస్కు ప్రజలే బాసులు. సొల్లు కబుర్లు వద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి. కేసీఆర్ను తిడితే ఏం జరగదు. 2019లోనూ గెలిచేది కూడా టీఆర్ఎస్సే. -
వారి చర్య మాతృద్రోహం
గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావులపై వీహెచ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నంతకాలం పదవులను అనుభవించి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీపై నిందలు వేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్న గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావులది మాతృద్రోహమని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం కాంగ్రెస్ లోనే ఉందని, టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎంతుందో త్వరలోనే వారికి తెలుస్తుందన్నా రు. పార్క్ హయత్ పక్కన ఉన్న స్థలాన్ని దక్కించుకోవడానికి వివేక్, వినోద్, సాగునీటి పనుల కాంట్రాక్టుల కోసం గుత్తా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గుత్తా విలువ లు, ఆత్మను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకు న్నా ఎంపీ టికెట్ వచ్చే లా సహకరించిన జైపాల్రెడ్డి, జానారెడ్డిలకు ద్రోహం చేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారడం వ్యభిచారంతో సమానమని చెప్పిన గుత్తా ఇప్పుడు ఎలా మారుతున్నారన్నారు. దమ్ముంటే ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేసి పోటీ చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు. పార్టీ మారే నాయకులు పందికొక్కులకన్నా ప్రమాదకరమని, వారి అసలు స్వరూపం కేసీఆర్కు కూడా త్వరలోనే తెలుస్తుందని వీహెచ్ హెచ్చరించారు. పదవులకు రాజీనామా చేయాలి... కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి టీఆర్ఎస్లో చేరనున్న ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్రావు, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్యగౌడ్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, పదవుల కోసమే వారు పార్టీలు మారుతూ బంగారు తెలంగాణ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మారడం అంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మోసం చేయడమేనన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నా రు. మిషన్ భగీరథ అక్రమాలపై 120 కిలోల పేపర్లను సేకరించిన గుత్తా టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. -
బంగారు తెలంగాణ కోసమే...
టీఆర్ఎస్లోకి వెళుతున్నామన్న గుత్తా, వివేక్, భాస్కర్రావు, రవీంద్రకుమార్ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు సహకరించాలనే టీఆర్ఎస్లో చేరుతున్నామని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్రావు, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్నాయక్ ప్రకటించారు. హైదరాబాద్లోని వివేక్ నివాసంలో సోమవారం విలేకరులతో వారు మాట్లాడారు. బుధవారం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. ఓటర్లు ఒత్తిడి తెచ్చారు: గుత్తా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం బాధాకరంగానే ఉందని గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావు పేర్కొన్నారు. అయితే పార్టీలోని అంతర్గత కలహాలు, నాయకుల మధ్య విబేధాలతో తాము తీవ్రంగా కలత చెందామన్నారు. సీనియర్ల మధ్య అంతర్గత విభేదాలు నాయకులను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని గుత్తా ఆరోపించా రు. వీటి వల్ల పార్టీ బలహీనపడుతోందన్నా రు. షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీని కాపాడుకునే పరిస్థితి కాంగ్రెస్కు వచ్చిందన్నారు. టీఆర్ఎస్లో చేరాలంటూ తన ఓటర్లు ఒత్తిడి తెచ్చారని గుత్తా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించానని...ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ దేవతగా గుత్తా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. సమయం, సందర్భాన్ని బట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పదవులు ఇస్తామని టీఆర్ఎస్ ఇప్పటిదాకా తనకు కమిట్మెంట్ ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఏర్పాటవుతున్న యాదాద్రి పవర్ప్లాంటు, నల్లగొండ జిల్లా అభివృద్ధికోసం సీఎం కేసీఆర్తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. పథకాలు ఆకర్షించాయి: వివేక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ వంటి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. పార్టీలోకి వస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అడిగారని వెల్లడించారు. పార్టీలో ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటిదాకా కేసీఆర్ను తాను కలవలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. -
అసైన్ మెంట్ కమిటీలను పునరుద్ధరించాలి
సీఎంకు ఎమ్మెల్యే రవీంద్ర విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: భూ పంపిణీ కార్యక్రమాలను చేపట్టేందుకు అసెంబ్లీ ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటుచేయాలని సీఎం కే సీఆర్కు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్కు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లేఖను రాశారు. దీర్ఘకాలంగా సాగులో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలన్నారు. అసెంబ్లీ ల్యాండ్ అసైన్మెంట్ కమిటీల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని, ఇందుకవసరమైన అధికారాలను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అధీనంలోని భూములను అర్హులకు పంచడంతో పా టు, ప్రభుత్వ భూములు పొంది సాగు చేసుకుంటున్న పేదరైతులకు ఆయా భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement