-
గాలోడు సక్సెస్తో గాల్లో తేలిపోతున్న నటుడు
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా... ఒకే ఒక్క సినిమా అతడి కెరీర్నే మార్చేసింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. మంచి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తనకు "గాలోడు" రూపంలో ఘన విజయం లభించిందంటున్నాడు నటుడు రవిరెడ్డి. "గాలోడు" సక్సెస్ తనను గాల్లో విహరించేలా చేస్తోందంటున్నాడు. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసిన రవిరెడ్డి ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని, మోడలింగ్ సైతం చేశాడు. "ఇంటిలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాఫ్ట్వేర్ సుధీర్" తదితర చిత్రాలతో నటుడిగా ఇప్పటికే తన సత్తాను చాటుకున్నాడు. "గాలోడు" చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి తన నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత "రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల"కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు రవిరెడ్డి. చదవండి: ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి? స్పందించిన నటుడి కూతురు -
రవిరెడ్డి.. అమెరికా టు హైదరాబాద్
బంజారాహిల్స్: సినిమాల మీద మక్కువతో అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చాడో ఔత్సాహిక యువకుడు. గతంలో అమెరికానుంచి టాలీవుడ్కు వచ్చి హ్యాపీ డేస్ సినిమాతో అందరినీ అలరించిన వరుణ్ సందేశ్ దారిలోనే ఇప్పుడు అమెరికా రిటర్న్డ్ బిజినెస్మన్ రవిరెడ్డి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. సినిమాలపై ఇష్టంతో టాలీవుడ్కు వచ్చిన రవిరెడ్డి చూడగానే ఆకట్టుకునే రూపం, అసలు, సిసలు తెలుగుదనం ఉట్టిపడే తీరుతో ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. అమెరికా నుంచి వెండితెరపై వెలిగిపోవాలని ఇటీవల చాలా మంది ఔత్సాహిక నటులు హైదరాబాద్కు వస్తున్న తరుణంలో రవిరెడ్డి వచ్చీ రావడంతోనే సరైన అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. మోడలింగ్లో తనదైన ముద్ర.. పక్కా తెలంగాణ యువకుడైన రవిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఏదో అల్లాటప్పాగా కాకుండా అమెరికాలో మోడలింగ్ చేసి అంతటితో ఊర్కోకుండా న్యూయార్క్ ఫిలిం అకాడమీలో కోర్సు కూడా పూర్తి చేశాడు. నటించాలనే తపనతో ఆయన శిక్షణ తీసుకున్న తీరు కూడా సినిమాలపై ఆయనకున్న మక్కువ అర్థమవుతుంది. స్వతహాగా ఫిట్నెస్ నిపుణుడు కూడా. ఒకవైపు అమెరికాలో జాబ్ చేస్తూనే చదువుకుంటూ ఆ తర్వాత యాక్టింగ్లో కోర్సు చేస్తూ మోడలింగ్లోనూ తనదైన ముద్ర వేశాడు. సినిమాలపై దృష్టి పెట్టిన ఆయన తన దేహాకృతిని అందంగా మలుచుకున్నాడు. నటనలో నిష్ణాతుడై ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ను తన స్నేహితుడి ద్వారా కలిసిన క్షణమే తనకు టర్నింగ్పాయింట్ అయిందని చెబుతున్నాడితను. అప్పటికే ఆయన దర్శకత్వం వహిస్తున్న ఇంటిలిజెంట్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక సాఫ్ట్వేర్ సుధీర్, దర్పణం వంటి సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, జీవిత, రాజశేఖర్ల కూతురు హీరో హీరోయిన్లుగా వచ్చిన దొరసాని లోనూ మంచి చాన్స్ కొట్టేశాడు రవిరెడ్డి. ఇందులో అతని నటనను తిలకించిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన తాజా చిత్రం ‘వి’లో మంచి పాత్రను ఇవ్వడం గమనార్హం. రానా దగ్గుబాటి, సాయి పల్లవిలతో వేణు ఊడుగుల రూపొందిస్తున్న విరాటపర్వంలోనూ రవిరెడ్డి చక్కని పాత్ర దక్కించుకున్నాడు. ఇక నర్సింహ నంది దర్శకత్వంలో రూపొంది ఇటీవలే విడుదలైన డిగ్రీ కాలేజ్లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో ఆయన పోషించిన పోలీసు ఆఫీసర్ సురేందర్రెడ్డి పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అవకాశాలవెల్లువ 1997లో అమెరికా వెళ్లిన రవిరెడ్డి అక్కడ ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకోవైపు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చదివాడు. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే మోజు పెరిగింది. ఏదో నటించాంలే అని కాకుండా చక్కగా శిక్షణ తీసుకొని తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని ముఖ్య పాత్రల్లో రాణిస్తున్నాడు. మంచి ఆఫర్లు వస్తున్నాయని రవిరెడ్డి పేర్కొన్నాడు. చాలా ఇష్టమైన పాత్రల్ని చేస్తున్నానని, వాటివల్ల మంచి గుర్తింపు లభిస్తోందని చెబుతున్నాడు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికా నుంచి తిరిగి వచ్చి టాలీవుడ్లోనిలదొక్కుకోవడం విశేషం. -
అనుమతి ఉన్న హేచరీల్లోనూ నాసిరకం సీడ్
కావలి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీల్లో చాలా వరకు నాణ్యమైన సీడ్ లభించడం లేదు. హేచరీలు సంబంధిత టెక్నీషియన్లను నియమించకోకుండా నాసిరకం సీడ్ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం తోటల్లో ఉన్న పశువుల పాకల్లో సైతం రొయ్యల పిల్లల హేచరీలు పెడుతున్నారని సీఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డీబీ రవిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జేబీ డిగ్రీ కళాశాలలో తీర ప్రాంతంలోని ‘రొయ్యలు, చేపల సాగులో వినియోగించే రసాయనాలు, వ్యాధి నిరోధకాలు, వాటి ప్రభావం’ అనే అంశంపై నాక్ సహకారంతో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తం గా 180 హేచరీలకు గుర్తింపు ఉందన్నారు. ఇందులో 50 హేచరీలే నాణ్యమైన సీడ్ అమ్మకాలు సాగిస్తున్నాయన్నారు. సీఫుడ్స్ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి రూ.11 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం అందుతుందన్నారు. రొయ్యల సాగుపై అవగాహన లేకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారన్నారు. అవగాహన లేకుండా ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ను వాడడం, మేతను వేయడం రైతుల నష్టాలకు కారణమని వివరించారు. రాష్ట్రంలో మత్స్యశాఖ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, రొయ్యల సాగుపై రైతులకు ఆ శాఖ అధికారులు అవగాహన కల్పించకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగం ఎంపెడా నుంచి మాత్రమే కాస్త సహకారం ఉందన్నారు. మత్స్యశాఖలో సిబ్బంది కొరతతో అనధికార హేచరీలు, నాణ్యతను పాటించని హేచరీలపై చర్యలు తీసుకోలేక పోతున్నారన్నారు. హేచరీల నిర్వాహకులు సేకరించిన తల్లి రొయ్యలు పదిసార్లు మాత్రమే నాణ్యమైన రొయ్య పిల్లలను అందిస్తాయన్నారు. ఆ తరువాత అవి నాసిరకమైన సీడ్ ను ఉత్పత్తి చేస్తాయన్నారు. అమెరికా, యూరోపియన్ దేశాలు, జపాన్ల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలు రొయ్యలను తిరస్కరిస్తున్నాయన్నా రు. ఏ దేశం నుంచి అయినా యాంటీబయాటిక్స్ ఆవశేషాలు ఉన్న రొయ్యలను క్రమే ణా వస్తుంటే ఆ దేశం నుంచి ఉత్పత్తులను నిషేధిస్తాయన్నారు. నిషేధం విధిస్తే రొయ్యల వ్యాపారంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యల్లో అలాంటి అవశేషాలు ఉన్నాయని తిరస్కరించడంతో పశ్చిమబెంగాల్లోని రైతులు తీరని నష్టాన్ని పొందాల్సి వచ్చిందన్నారు. వైరస్ వ్యాధి వ్యాపిస్తే నియంత్రించడం సాధ్యం కాదు : ప్రొఫెసర్ హరిబాబు రొయ్యలకు వైరస్ వ్యాధి వస్తే నియంత్రించడం సాధ్యం కాదని ముత్తుకూరు మత్స్యకళాశాల ప్రొఫెసర్ పీ హరిబాబు అన్నారు. రొయ్యలకు 22 రకాల వైరస్ల వల్ల వ్యాధులు వస్తాయని, వాటికి మందులు లేవన్నారు. వైరస్ వ్యాధులకు మందులు ఉన్నాయని కొందరు వ్యాపారులు, కంపెనీలు చెబుతూ రొయ్య రైతులను మోసం చేస్తున్నాయన్నారు. మన దేశంలో 4 రకాల రొయ్యల వ్యాధులు మాత్రమే ఇప్పటి వరకు బయట పడ్డాయన్నారు. రొయ్యల సాగులో నష్టం వస్తే 60 శాతం వైరస్ వల్ల, 20 శాతం బాక్టీరియా వల్ల, 20 శాతం రైతులు అవగాహనా లోపంతో వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఎక్కడా రొయ్యలకు వచ్చే వ్యాధులను పరీక్ష చేసేందుకు ల్యాబ్లు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేదన్నారు. బాహ్యంగా పెరిగే జీవుల్లో అనారోగ్యాన్ని గుర్తించ వచ్చునని, నీటిలో పెరిగే జీవుల్లో కనుక్కొవడం కష్టమన్నారు. రొయ్యలు తమ శరీరంపై ఉండే మాలిన్యాన్ని తమంతట తామే శుభ్రం చేసుకుంటాయని, వాటికి ఆ శక్తి ఉందన్నారు. ఏదైనా రొయ్య శుభ్రంగా లేక మట్టి పేరుకుపోయి గుంతలో కనపడితే అవి వ్యాధికి గురవుతాయని, అలాంటి వాటిని గుర్తించి వెంటే పరీక్షల కోసం ల్యాబ్లకు పంపాలన్నారు. రొయ్యల వ్యాధుల పరీక్ష కేంద్రాలు ప్రస్తుతం చెన్నైలో మాత్రమే ఉన్నాయన్నారు. రొయ్యలు సైన్స్ పరిజ్ఞానంలో ఇన్ వర్టిబ్రెట్స్ అని, వాటికి వ్యాధి నిరోధక శక్తి ఉండదన్నారు. అందు వల్ల వైరస్ వ్యాధి వ్యాపిస్తే దాన్ని నియంత్రించడం సాధ్యంకాదన్నారు. ఎవరైనా మందులు కంపెనీల నిర్వాహకులు వైరస్ను నియంత్రించేందుకు మందులు ఉన్నాయంటే నమ్మరాదన్నారు. 20 శాతం బాక్టీరియా సోకిన రొయ్యలను మందులు వాడడం ద్వారా వ్యాధిని నివారించవచ్చన్నారు. రొయ్యల సాగులో ఎక్కువగా ఫీడ్ వేయడం, యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదన్నారు. రైతులకు రొయ్యల సాగుపై పరిజ్ఞానం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. నాణ్యమైన రొయ్యల సీడ్ను గుర్తింపు ఉన్న నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న హేచరీల నుంచి మాత్రమే రైతులు సీడ్ కొనుగోలు చేయాలన్నారు. గతంలో వ్యాధుల బారిన పడి టైగర్ రొయ్యల పెంపకం కనమరుగైందన్నారు. ఇప్పుడు వెనామీ రొయ్యల సాగులో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన కోరారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, తర్వాత సదస్సుకు సంబంధించిన సావనీర్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రొజెక్టర్తో రొయ్యల సాగుపై అవగాహన కల్పించారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్కుమార్రెడ్డి, జేబీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్రెడ్డి, సదస్సు చైర్మన్, జేబీ ప్రిన్సిపల్ మేజర్ పాల్మనోహర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ ఎం.వీ.భాస్కర్, వివిధ యూనివర్సిల నుంచి అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, రైతులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement