-
కలిగిన పీడ పోయినది
ప్రతాపరుద్రీయం అన్న అలంకార శాస్త్ర రచయిత విద్యానాథకవి కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్ర మహారాజు దర్శనానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అసూయాగ్రస్తులైన రాజాశ్రితులు అతనికి అడ్డుపడి రాజదర్శనం కలగనీయకుండా చేస్తూ ఉంటారు. ఒకరోజు రాజు నగరంలో తన గుర్రం మీద సంచరిస్తుండగా జనం మధ్యలో నిలిచి విద్యానాథుడు ఈ అసంపూర్ణ శ్లోకం గట్టిగా చదివి వినిపిస్తాడట. ‘నవలక్ష ధనుర్ధరాధినాథే, పృథివీం శాసతి వీరరుద్రదేవే, అభవత్ పరమగ్రహార పీడాం’. అంటే తొమ్మిది లక్షల ధనుర్ధారుల సైన్యానికి అధిపతి అయిన వీర రుద్రదేవుడు పరిపాలిస్తుండగా అగ్రహారములకు గొప్ప పీడ కలిగినది అని భావము. బ్రాహ్మణ భక్తి కలిగిన ప్రతాపరుద్రుడు, ‘నా పాలనలో అగ్రహారములకు పీడన కలుగుటయా’ అని ఉలిక్కిపడి ఆ వ్యక్తిని తనముందు హాజరు పెట్టవలసినదని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు విద్యానాథకవి ముందుకు వచ్చి శ్లోకాన్ని ఇలా పూరిస్తాడు. ‘కుచ కుంభేషు కురంగ లోచనాం’ అని. అంటే తొమ్మిది లక్షల ధనుర్ధారుల సైన్యానికి అధిపతి అయిన వీర రుద్రదేవుడు పరిపాలిస్తుండగా లేడికన్నుల వంటి కన్నులు కలిగిన వనితల కుచాగ్రములకు హారముల పీడ కలిగినది అని. పీడ అంటే ఒత్తిడి, ఒరిపిడి అని అర్థం వచ్చేలా శ్లోకభావాన్ని మార్చి వినిపిస్తాడు విద్యానాథుడు. ఈ పాదము చేర్చడంతో శ్లోకానికి ‘కుచాగ్రముల వరకూ హారములను ధరించేటంతటి సంపద కలిగి ఉన్నారు ప్రజలు’ అన్న అర్థం వచ్చింది. ఈ పూరణకు ముగ్ధుడైన ప్రతాపరుద్రుడు అతనిని తన ఆస్థానానికి ఆహ్వానించి, సత్కరించి, తన ఆస్థానంలో నియమించుకొన్నాడట. ఈ కథలో చారిత్రక సత్యమెంతో తెలియదు గానీ ఒక రమణీయమైన కథ ఈ శ్లోకం ద్వారా ఆవిష్కృతమౌతున్నది. ఈ ఉదంతం మనకు వేదం వేంకటరాయశాస్త్రి నాటకం ‘ప్రతాపరుద్రీయం’లో కనిపిస్తుంది. -ఆర్.ఎ.ఎస్.శాస్త్రి -
మహావీరుడు ఏమి జయించాడు?
ఏప్రిల్ 20 మహావీర్ జయంతి జైన సంప్రదాయానికి మూలమైన సిద్ధాంతాన్ని ఆత్మవాదమని అనేకాంత వాదమని అంటారు. బాహ్యాభ్యంతరాలైన (అంటే బయటవీ, లోపలివీ) వికారాలను... అంటే క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించినవానికి జిన, జినుడు అని పేరు. ‘జినుడు’ అన్నమాట నుంచి వచ్చిన పదం జైనం. జినుడు అంటే జయించినవాడు అని అర్థం. జినుడు అయిన వ్యక్తి స్థాపించిన మతం కనుక దీనిని జైన సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు. తీర్థంకరులంటే పూర్ణ పురుషులు. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు. ఇరవై నాలుగవ మరియు ఆఖరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. మహావీరుడు బీహార్లోని వైశాలీ నగరం సమీపంలోని కుందల్పూర్లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు కాశ్యప గోత్రానికి చెందిన క్షత్రియుడు. తల్లి... వజ్జీ రాజ్యాధిపతి, ఇక్ష్వాకు వంశ క్షత్రియుడైన చేతకుని కుమార్తె ప్రియకరణి లేక త్రిశల. బాల్యం నుంచీ రాజకుమారునిగా సకల సౌఖ్యాలూ అందుబాటులో ఉన్నప్పటికీ నిర్లిప్తుడుగా ఉండేవాడు మహావీరుడు. శ్వేతాంబర సంప్రదాయానికి చెందిన అచరంగ సూత్ర అనే గ్రంథం ద్వితీయ అధ్యాయంలో వర్ధమానుని తల్లిదండ్రులు పార్శ్వనాథుని భక్తులని ఉంటుంది. వర్ధమానుని వివాహ విషయంలో శ్వేతాంబర, దిగంబర సంప్రదాయాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని అనుసరించి వర్ధమానుడు వివాహం చేసుకోకుండానే ఉండిపోయాడని దిగంబర సంప్రదాయం చెబుతుంటే శ్వేతాంబర సంప్రదాయానుసారం వర్ధమానునికి వివాహం అయ్యింది. భార్య పేరు యశోద. వీరికి ‘ప్రియదర్శి’ అనే పుత్రిక ఉండేది. వర్ధమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. పాఠశాల, అధ్యాపకుల అవసరం తనకు లేదన్న వివేకాన్ని వర్ధమానుడు మనసులోనే నెల కొల్పుకున్నాడు. మహావీరుని అసలు పేరు వర్ధ మానుడు. జ్ఞానోదయమైన తరువాత ‘మహా వీరుడు’ అని పేరు పొందాడు. ఈ సార్థకనామం అతనికి ఎలా వచ్చిందనేందుకు ఒక కథ ఉంది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఆటలాడు తున్నప్పుడు, ఒక నల్లని పాము పడగ పైన తన పాదం మోపి దాన్ని అణచివేశాడు. ఈ విధంగా మోహం అనే సర్పాన్ని అణచటం జరిగింది. బుద్ధునిలాగే మహావీరుడు కూడా ప్రపంచ పరిత్యాగం చేయాలనే ఆశతో కొట్టుమిట్టాడాడు. కుటుంబంతో కలిసి 28 ఏళ్ల వయసు వరకు గడి పాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. ఇక తాను సర్వసంగ పరి త్యాగం చేయాలని, యోగ్యమైన, ఉపయోగకరమైన కార్యం నెరవేర్చాలని భావించాడు. సంపదను పేదలకు పంచాడు. కుటుంబాన్ని విడనాడిన రోజే రాజ్యాన్ని సోదరునికప్పగించాడు. అప్పుడు ముప్పది ఏళ్ల వయసులో ఉన్నాడు. తపస్సు, ప్రార్థనలతో నిండిన జీవితంలోకి ప్రవేశించాడు. గృహస్థ జీవితాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలుడి వద్ద శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత జృంబిక గ్రామం దగ్గర పన్నెండు సంవత్సరాల ధ్యానం, తపస్సుల తర్వాత మహావీరునికి వెలుగు కనిపించింది, ఆత్మ వివేకం (జ్ఞానం) కలిగింది. తీర్థంకరుడయ్యాడు. ఈ స్థితిని కైవల్యం అనీ ఈ స్థితిని పొందినవారిని కేవలి అనీ అంటారు. తదనంతరం వర్ధమానుడు తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఆనందానికి సంతోషానికి సంబంధించిన తన గొప్ప శుభ సందేశాన్ని ప్రబోధించాడు. వర్ధమానుని బోధనల్లో ప్రధానమైనవి అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం. వీటిని పంచ వ్రతాలు అంటారు. బ్రహ్మచర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధమాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా ఉండాలి. జైన మతానుసారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలను త్రిరత్నాలంటారు. వీటిని పాటిస్తూ పంచవ్రతాలతో జీవించేవారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించేవాడు. అవే జైనులకు మార్గదర్శకాలు. సన్యాసి అయినవాడు శాకాహారాన్ని తీసుకోవాలి. అహింసను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ప్రాణికి, వస్తువుకి, నిర్జీవులు అయినవాటికి కూడా చైతన్యం వుంటుందని వాటికి గాయాలైతే అవి బాధపడతాయని అంటారు. చివరికి భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని భూమినే దున్నొద్దు అంటారు. అందుకే చాలామంది జైనులు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుని తిరుగుతారు. నీళ్లు వడకట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన చీపురుతో నేలను ఊడుస్తారు. నేల కింద పండే దుంపలు, ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజలు వంటివి కూడా తినరు. తన సిద్ధాంతాలను ప్రబోధించేందుకు ఆయన ఒకచోటి నుండి మరోచోటికి నిరంతరమూ ప్రయాణం చేశాడు. ఎందరో అతణ్ని పరిహసించారు. సమావేశాలు జరుగు తున్నప్పుడు ఆయన్ని కలతబెట్టి బాధించేవారు, అవమానపర్చేవారు. ఒక అడవిలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక ముఠా మనుషులు అతణ్ని కొట్టారు కూడా. అయినా మౌనంగానే ఉన్నాడు. ఆయన మహావీరుడు. గొప్ప విజేత. చివరికి తన 72వ యేట దీపావళి రోజున కాలధర్మం చెందాడు వర్ధమాన మహావీరుడు. ఆయన మోక్షాన్ని పొందిన చోట నేడు జలమందిరం పేరుతో జైన మందిరం ఉంది. దేశమంతా ఆయన పేరు మీద మహిళా విద్యాలయాలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలు వెలిశాయి. ఆయన నిజంగానే వీరుడు. యుద్ధాల్లో గెలిచిన క్షత్రియ వీరుడు కాదు. సకల సౌకర్యాలనూ వదిలి సామాన్యునిగా జీవించిన వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రతి ఒక్కరి హృదయాలయంలో కొలువైన దేవుడు! - ఆర్ఏఎస్ శాస్త్రి
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- 100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement