breaking news
Ranjit Ranjan
-
‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’
పట్నా: వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయని బిహార్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రంజిత్ రంజన్ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంజిత్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మధుబని, సుపాల్, దర్భాంగా, ముజఫర్పూర్, మాధేపురా క్వారంటైన్ కేంద్రాల్లో సరైన వసతులు లేవు. దీని గురించి ప్రశ్నిస్తే.. 9 మంది వలస కార్మికుల మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. బిహార్లోని క్వారంటైన్ కేంద్రాలు నరకం కంటే దారుణంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సరైన వసతులు లేవని అడిగితే వారి మీద కేసు నమోదు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ప్రభుత్వ చర్యలు చూస్తే.. వలస కార్మికులు ఈ దేశ పౌరులు కారు.. వారికి ఎలాంటి హక్కులు లేవన్నట్లు తోస్తుంది’ అన్నారు.(క్వారంటైన్లో 23 లక్షల మంది) -
లోక్సభలో భార్యాభర్తల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం దాదాపుగా ముగిసింది. నిన్న ఒక్కరోజే 510 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులు నేడు ప్రమాణం స్వీకారం చేశారు. రాజేష్ రాజన్ అలియాస్ పప్పు యాదవ్(ఆర్జేడీ), ఆయన భార్య రంజిత రాజన్(కాంగ్రెస్) నేడు పమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్, తెలంగాణ నుంచి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(టీఆర్ఎస్) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం సాఫీగా సాగడానికి సహకరించిన ప్రొటెం స్పీకర్ కమల్ నాథన్, లోక్సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు ధన్యవాదాలు తెలిపారు.