-
Ranji Trophy-2022: ఆంధ్రాపై ముంబై ఘన విజయం..
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సీజన్ను 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు ఘనవిజయంతో శుభారంభం చేసింది. ఆంధ్ర జట్టుతో ఇక్కడ జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఓవర్నైట్ స్కోరు 290/6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన ముంబై మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 331 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ అర్మాన్ జాఫర్ (116; 16 ఫోర్లు, 1 సిక్స్) అదే స్కోరు వద్ద అవుటవ్వగా... తనుష్ కొటియన్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ నాలుగు వికెట్లు తీయగా... శశికాంత్, లలిత్ మోహన్లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. 93 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 47 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఉప్పర గిరినాథ్ (27; 6 ఫోర్లు), రికీ భుయ్ (16; 2 ఫోర్లు), కెప్టెన్ విహారి (14), నితీశ్ రెడ్డి (15; 3 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ముంబై బౌలర్లలో తుషార్ (3/34), తనుష్ (2/18), సిద్ధార్థ్ (2/26) రాణించారు. 39 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై 6.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. చదవండి: PKL 2022: ఫైనల్కు దూసుకెళ్లిన పింక్ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ -
వేణుగోపాలరావు దూరం
సాక్షి, విజయవాడ: ప్రస్తుత రంజీ సీజన్లోని మిగతా మ్యాచ్లకు తాను అందుబాటులో ఉండటం లేదని ఆంధ్ర క్రికెట్ జట్టు సభ్యుడు వై. వేణుగోపాలరావు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని భారత వన్డే జట్టు మాజీ సభ్యుడైన వేణు వివరించాడు. ఈ సీజన్లో ఆంధ్ర జట్టు తమిళనాడు, బరోడా జట్లతో మ్యాచ్లు ఆడి రెండింటిలోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. వేణు మాత్రం తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో తుది జట్టులో ఆడి కేవలం మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. 1998లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల వేణు తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 121 మ్యాచ్లు ఆడి 7,081 పరుగులు చేయడంతోపాటు 66 వికెట్లు పడగొట్టాడు. ‘జట్టులో వేణుగోపాలరావు లేని లోటు కనిపిస్తుంది. అయితే అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. వేణు స్థానంలో జ్యోతి సాయికృష్ణను జట్టులో ఎంపిక చేశాం’ అని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. -
ఆంధ్రకు రెండో విజయం
ముంబై: ఈ ఏడాది రంజీ సీజన్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. గత మ్యాచ్లో జమ్మూ కశ్మీర్పై నాలుగు వికెట్లతో నెగ్గిన ఆంధ్ర... తాజాగా హరియాణాపై 77 పరుగులతో నెగ్గింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స ప్రారంభించిన హరియాణా 123.2 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటరుుంది. రోహిల్లా (118) సెంచరీ చేసినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. ఆంధ్ర బౌలర్లలో శివకుమార్ నాలుగు, భార్గవ్ భట్ మూడు వికెట్లు తీశారు. హైదరాబాద్కు ‘డ్రా’ గౌహతిలో హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. హిమాచల్ రెండో ఇన్నింగ్సలో 301 పరుగులు చేసి ఆలౌట్ అరుుంది. దీంతో హైదరాబాద్కు 212 పరుగుల లక్ష్యం ఎదురరుుంది. ఆదివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 54 ఓవర్లలో ఆరు వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
జట్టు నుంచి వెళ్లాక బ్యాట్ ముట్టలేదు
రంజీ సీజన్కు ముందే ప్రాక్టీస్కు దిగా.. * ఆల్రౌండర్ రవీంద్ర జడేజా న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో ఓసారి చోటు కోల్పోయాక ఏ క్రికెటర్ అయినా పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తూ కిందా మీదా పడుతుంటారు. అయితే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఈ విషయంలో బేఫికర్గా ఉన్నానంటున్నాడు. గత జూన్లో ఈ సౌరాష్ట్ర ఆటగాడు బంగ్లాదేశ్తో తన చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ కాదు కదా కనీసం బ్యాట్ను కానీ బంతిని కానీ టచ్ చేయలేదంటున్నాడు. ఈ సమయమంతా పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యానని చెప్పాడు. తనకిష్టమైన గుర్రపు స్వారీతో పాటు స్నేహితులతో సరదాగా గడిపానని అన్నాడు. కేవలం రంజీ సీజన్కు ముందే ప్రాక్టీస్పై దృష్టి సారించానని, నిజానికి తన శరీరం విశ్రాంతి కోరుకుందని తెలిపాడు. ఈ సీజన్లో తను సౌరాష్ట్ర తరఫున ఆడిన రెండు మ్యాచ్ల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. ‘బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయాను. అప్పుడు కొద్ది సమయం క్రికెట్కు దూరంగా ఉండాలనిపించింది. అందుకే ఆటకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కనీసం బ్యాట్, బంతిని కూడా పట్టుకోలేదు. క్రికెట్ బటన్ను స్విచాఫ్ చేసి ఇతర వ్యాపకాల్లో మునిగాను. ఫాంహౌస్లో గుర్రాలతోనూ, స్నేహితులతోనూ ఎక్కువ సమయం గడిపాను. రంజీ సీజన్కు నెల రోజుల ముందు ప్రాక్టీస్ ప్రారంభిస్తూ నా బలంపై దృష్టి పెట్టాలనుకున్నాను. కొన్ని జిల్లా స్థాయి మ్యాచ్లు కూడా ఆడాను. ఇలాంటి ప్రాక్టీస్తో సీజన్లో రాణించాను’ అని 26 ఏళ్ల జడేజా పేర్కొన్నాడు. -
బౌలర్లపైనే భారం
అగర్తలా: హైదరాబాద్ బౌలర్లు రాణిస్తేనే ఈ రంజీ సీజన్లో జట్టు బోణీ చేస్తుంది. రెండో ఇన్నింగ్స్లో త్రిపుర బ్యాట్స్మెన్ కుదురుగా ఆడటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. గ్రూప్-సిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆఖరి రోజు హైదరాబాద్ ఆటగాళ్లు ఏమాత్రం అలసత్వం వహించిన మరో డ్రాకు సిద్ధపడాలి. తొలి ఇన్నింగ్స్ను 491/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన హైదరాబాద్కు త్రిపుర రెండో ఇన్నింగ్స్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 81 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. త్రిపుర ఇంకా 67 పరుగులు వెనుకంజలో ఉంది. పూర్తయిన రవితేజ సెంచరీ మూడో రోజు 487/9 ఓవర్నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో నాలుగు పరుగులు జోడించి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ నాలుగు పరుగులు కెప్టెన్ రవితేజ (128 బంతుల్లో 100 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్స్) చేయడంతో అతని సెంచరీ పూర్తయింది. మూడో రోజు ఉదయం హైదరాబాద్ కేవలం పది బంతులే ఆడి మొత్తానికి తొలి ఇన్నింగ్స్లో 307 పరుగుల భారీ ఆధిక్యం పొందింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన త్రిపుర... బ్యాట్స్మెన్ పోరాటంతో ఎదురీదుతోంది. రాణించిన బోస్, సోలంకి ఓపెనర్ బిశాల్ ఘోష్ (28 బంతుల్లో 18, 4 ఫోర్లు) తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, కెప్టెన్ అభిజిత్ డే (123 బంతుల్లో 47, 7 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ ఉదియన్ బోస్ (139 బంతుల్లో 63, 10 ఫోర్లు, 1 సిక్స్) జట్టును నడిపించాడు. ఇద్దరు రెండో వికెట్కు 105 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 133 పరుగులకు చేరింది. ఈ దశలో సి.వి.మిలింద్ స్వల్ప వ్యవధిలో 3 టాపార్డర్ వికెట్లు కూల్చి హైదరాబాద్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. కానీ రాకేశ్ సోలంకి (99 బంతుల్లో 71 బ్యా టింగ్, 10 ఫోర్లు), రాజేశ్ బాణిక్ (94 బంతుల్లో 31 బ్యాటింగ్, 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఇద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్కు 106 పరుగులు జోడించారు. కెప్టెన్ రవితేజ 8 మంది బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించిన ఈ జోడీని విడదీయలేకపోయారు. స్కోరు వివరాలు త్రిపుర తొలి ఇన్నింగ్స్: 184 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 491/9 డిక్లేర్డ్ త్రిపుర రెండో ఇన్నింగ్స్: బిశాల్ ఘోష్ (సి) ఖలీల్ (బి) ఆశిష్ రెడ్డి 18; ఉదియన్ బోస్ (సి) ఖలీల్ (బి) మిలింద్ 63; అభిజిత్ డే (సి) భండారి (బి) మిలింద్ 47; సోలంకి బ్యాటింగ్ 71; తకవాలే (సి) భండారి (బి) మిలింద్ 0; రాజేశ్ బాణిక్ బ్యాటింగ్ 31; ఎక్స్ట్రాలు 10; మొత్తం (81 ఓవర్లలో 4 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1-28, 2-133, 3-134, 4-134 బౌలింగ్: సి.వి.మిలింద్ 16-5-48-3, అన్వర్ 11-2-25-0; ఆశిష్ రెడ్డి 11-2-46-1, రవికిరణ్ 16-5-40-0, భండారి 16-1-39-0, రవితేజ 1-0-5-0, ఖాద్రి 9-2-25-0, తన్మయ్ 1-0-3-0
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement