breaking news
ranigunj
-
‘జగ్జీవన్రామ్ బాటలో నడుద్దాం’
సాక్షి, హైదరాబాద్: బాబు జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం రాణిగంజ్ డీపో వన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీపో మేనేజర్ పొన్నగంటి మల్లేశం మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రామ్ చూపిన బాటలో నడవాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటు పడిన బాబు జగ్జీవన్రామ్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి మల్లేశంతో పాటు సుద్దాల సురేశ్, పీవీరావు, గోపీ, సీఎస్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, రమేశ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ రాణిగంజ్లో భారీ అగ్నిప్రమాదం
-
తలసాని బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్పై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరం సనత్ నగర్ పరిధిలోని రాణీగంజ్ బస్తీవాసులను ఖాళీ చేయాలని తలసాని బెదిరిస్తున్నట్టు మర్రి శశిధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మర్రి శశిధర్తో పాటు రాణీగంజ్ బస్తీవాసులు కూడా తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు.