breaking news
Rameshwar Rao
-
సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ
శంషాబాద్ రూరల్: శ్రీ భగవద్రామానుజుల సమతాస్ఫూర్తి సిద్ధాంతాన్ని సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో సమతాస్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి తెలిపారు. శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భగవద్రామానుజుల వారు కూర్చున్న భంగిమలోని 216 అడుగుల పంచలోహా విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సోమవారం చినజీయర్స్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. చరిత్రకు వన్నె తీసుకురాగల ఓ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విగ్రహం చూసిన ప్రతి ఒక్కరిలో ఓ జిజ్ఞాస కలిగించి సమతాస్ఫూర్తి పొందేలా భారీ మూర్తిని నెలకొల్పుతున్నట్లు చెప్పారు. స్ఫూర్తి కేంద్రం రెండో అంతస్తులో ప్రతిష్టించే శ్రీ భగవద్రామానుజుల వారి 120 కిలోల బంగారు విగ్రహానికి నిత్యారాధన ఉంటుందన్నారు. ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. వంద ఎక రాల విస్తీర్ణం, రూ. 1,200 కోట్ల వ్యయంతో నిర్మి స్తున్న ఈ కేంద్రంలో సహస్రాబ్ది పారాయణ సమా రోహం గురించి భక్తులకు తెలియజేసేందుకు సెల్ఫ్ గైడెడ్ టూర్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. స్ఫూర్తి కేంద్రంలో 12 రోజులపాటు 2 లక్షల కిలోల ఆవు నెయ్యితో 1,035 కుండాలతో హోమాలు నిర్వహిం చనున్నట్లు చినజీయర్స్వామి తెలిపారు. వ్యక్తిలో మానసిక స్థైర్యం, ధైర్యం కల్పించేందుకు 12 రోజులపాటు çపంచ సంస్కార దీక్షదారులతో ప్రతిరోజూ కనీసం కోటిసార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపింపజేయనున్నట్లు వివరించారు. కోటి అవణ క్రతువు కూడా నిర్వహిస్తామన్నారు. దసరా రోజున యాగశాలలకు భూమిపూజ స్ఫూర్తి కేంద్రంలో దసరా రోజున 128 యాగశాలల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఒక్కో యాగశాల వద్ద 8 కుండాలతో ఆగమశాస్త్రం ప్రకారం హోమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం 5 వేల మంది రుత్వికుల సేవలు వినియోగిస్తామన్నారు. విగ్రహావిష్కరణకు 135 రోజుల కౌంట్డౌన్ మొదలైందని, నేటి నుంచి విగ్రహావిష్కరణ వరకు ప్రపంచం నలుమూలలా ఉన్న వారు వందే గురు పరంపరా మంత్రాన్ని జపించాలని జీయర్స్వామి పిలుపునిచ్చారు. ఇది ఓ ఉద్యమంలా సాగాలన్నారు. రెండు నెలలపాటు నిర్వహించనున్న చాతుర్మాస దీక్షను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో శ్రీ అహోబిల జీయర్స్వామి, శ్రీ దేవనాథ జీయర్స్వామి, మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు పాల్గొన్నారు. -
ప్రాణహాని ఉంది.. కేంద్ర భద్రత కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: తన ప్రాణాలకు ముప్పు ఉందని, 4ప్లస్4 గన్మెన్లతోపాటు ఎస్కార్ట్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి హైకోర్టును ఆ శ్రయించారు. తనకు వ్యక్తిగత, రాజకీయ వ్యతిరేకులుగా ఉన్న వారు సీఎం, మంత్రులు వంటి పద వులను అధిష్టించారని, సీఎంకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచీ ప్రాణహాని ఉందని పిటిషన్లో ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో తనకు 3ప్లస్3 భద్రత ఉండేదని, దీనిని 2ప్లస్2కు తగ్గించారని, 2018 ఎన్నికల సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు 4ప్లస్4కు పెంచినా తర్వాత తగ్గించారని తెలిపారు. తనకు కేంద్ర ప్రభుత్వ భద్రత కల్పించాల ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు గతేడాది ఆగస్టు 28న చేసుకున్న దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లుగా తనకు జవాబు వచ్చిందని,దాన్ని ఆమోదించి తనకు భద్రత కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హైటెక్ సిటీ సమీపంలో రూ.కోట్ల విలువైన భూములను చట్ట వ్యతిరేకంగా జూపల్లి రామేశ్వరరావుకు ధారాదత్తం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ‘పిల్’ వేశానని తెలిపారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జూపల్లి రామేశ్వరరావులను ప్రతివాదులుగా చేశారు. -
జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవ సందడి
కేపీహెచ్బీకాలనీ/ సనత్నగర్, న్యూస్లైన్ : డాక్టరేట్ పట్టాను అందుకుని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న వేళ... కన్న బిడ్డల అభినందనలు అందుకున్నవారు కొందరు... తమ చిరంజీవులు యూనివర్సిటీకే టాపర్లుగా నిలిచిన క్షణాన... గుండెలకు హత్తుకుని కళ్లల్లో ఆనంద భాష్పాలు రాల్చినవారు మరికొందరు... వెరసి స్నాతకోత్సవ వేళ జేఎన్టీయూహెచ్ ఆడిటోరియం శుభాభినందనలతో పులకించిపోయింది. జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం శనివారం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పద్మవిభూషణ్ డాక్టర్ అనిల్ కకోద్కర్ చేతుల మీదుగా 197 మంది రీసెర్చ్ స్కాలర్స్కు పీహెచ్డీ పట్టాలు, 52 మంది టాపర్స్కు బంగారు పతకాలను అందజేశారు. ఇందులో వర్సిటీ టాపర్స్ 11 మంది బంగారు పతకాలు, 23 మంది ఎండోమెంట్ బంగారు పతకాలు, వర్సిటీ అనుబంధకళాశాలల టాపర్స్ 18 మంది గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. వర్సిటీ వీసీ రామేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్వీ.రమణారావు, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వినయ్బాబు, డెరైక్టర్ ఎవాల్యుయేషన్ ఈశ్వర్ప్రసాద్, వివిధ విభాగాల డెరైక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. మరపురాని అనుభూతి బీటెక్ ఈసీఈ బ్రాంచ్లో బంగారు పతకం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీంతో పాటు జి.పురుషోత్తం, బూరుగుల రామకృష్ణ, పిసుపాటి సుప్రియ దేశయ్ అనే మూడు ఎండోమెంట్ బంగారు పతకాలు అందుకోవడం మరుపురాని అనుభూతి. ఈ విజయం వెనుక తల్లిదండ్రులు, అధ్యాపక బృందం ప్రోత్సాహం ఎంతో ఉంది. - కె.కావ్య, ఈసీఈ విభాగం టాపర్, నాలుగు బంగారు పతకాల విజేత. మరిచిపోలేని సంఘటన నా ఆనందానికి అవధుల్లేవు. యూనివర్సిటీ క్యాంపస్లోనే విద్యాభ్యాసం చేశాను. ప్రస్తుతం బెంగుళూరులో లెక్చరర్గా పనిచేస్తున్నాను. బంగారు పతకం అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. భవిష్యత్తులో జర్మనీలో మ్యాథ్స్లో ఏదో ఒక అంశంపై పీహెచ్డీ పూర్తిచేయాలన్నదే నా లక్ష్యం. - జ్యోతిర్మయి, ఎమ్మెస్సీ టాపర్ ఫార్మా రంగంలో పరిశోధనలు చేస్తా యూనివర్సిటీ టాపర్గా బంగారు పతకంతో పాటు షాదన్ అండ్ ఉమెన్, డాక్టర్ ఆంధ్రానాయుడు ఎండోమెంట్ బంగారు పతకాలు అందుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ప్రస్తుతం బాలానగర్లోని నైపర్ ఇనిస్టిట్యూట్లో ఎంఎస్ ఫార్మా ఎనాలిసిస్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఫార్మా రంగంలో పరిశోధనలు చేస్తా. - పి.కావ్య, బి.ఫార్మసి టాపర్, మూడు బంగారు పతకాల విజేత కొత్త ఆవిష్కరణలకు కృషి యూనివర్సిటీ టాపర్గా గోల్డ్మెడల్తో పాటు వెల్లంకి రామారావు, ఎంసీ కన్సల్టింగ్ అనే మరో రెండు ఎండోమెంట్ బంగారు పతకాలు అందుకోవడం మరపురాని అనుభూతి. సివిల్ రంగంలో నూతన ఆవిష్కరణల దిశగా పరిశోధనలు చేసేందుకు కృషి చేస్తా. - మందీప్సింగ్, సివిల్ టాపర్, మూడు బంగారు పతకాల విజేత పరిశోధన రంగంలో ఫలితాలు సాధిస్తా సీఎస్ఈ విభాగంలో యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచాను. నేను కీసరలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసించా. యూనివర్సిటీ టాపర్గా నిలిచినందుకు గాను బంగారు పతకంతో పాటు డాక్టర్ ఎండీ.విజరత్ రసూల్ఖాన్ ఎండోమెంట్ బంగారు పతకం రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో పరిశోధనల రంగం వైపు వెళ్ళాలనుకుంటున్నా. - నవీన, సీఎస్ఈ టాపర్ ఫైబర్ ఆప్టిక్పై పరిశోధనలు చేస్తా అరుదైన పైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ పీహెచ్డీ సాధించినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని సైంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను. మొబైల్ కమ్యూనికేషన్లో ఫైబర్ ఆప్టిక్ సబ్జెక్టుపై మరిన్ని పరిశోధనలు చేస్తాను. - డాక్టర్ కేవీఎస్ఎస్ఎస్ఎస్ సాయిరాం, పీహెచ్డీ పట్టభద్రులు డాక్టరేట్ గౌరవప్రదమైంది తల్లిదండ్రులు పెట్టిన పేరుకు ముందు పరిశోధనాపరంగా ఇచ్చే డిగ్రీ అయిన డాక్టర్ అనే పదం ఎంతో గౌరవమైనది. ఏపీ జెన్కో విభాగంలో ఎలక్ట్రానిక్స్లో నేను చేసిన అంశంపై మొట్టమొదటగా పీహెచ్డీ అందుకున్నాను. - డాక్టర్ కె.వి.ఎన్.ఎమ్. ప్రసాద్ శ్రీమతి సమక్షంలో అవార్డు నా శ్రీమతి ఆచార్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న విశ్వ విద్యాలయం నుంచి నా కుటుంబ సభ్యుల సమక్షంలో అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. - డాక్టర్ బి. అనంతరెడ్డి, సుఖిల పవర్ ఎలక్ట్రానిక్స్ అధినేత తీరిన స్వప్నం పీహెచ్డీ పట్టా అందుకోవడమనేది నా చిన్నప్పటి కల. అది నేటికి నెరవేరింది. ఇమేజ్ ప్రాసెసింగ్ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. - డాక్టర్ జి. వెంకటరామిరెడ్డి, జేఎన్టీయూహెచ్ అసోసియేట్ ప్రొఫెసర్ పేరెంట్స్ కోరిక నెరవేరింది చదువు ప్రాముఖ్యతను చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు చెబుతుండేవారు. డాక్టర్ను చేయాలని వారి కోరిక. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల డాక్టర్ను కాలేకపోయాను. నేడు డాక్టర్ ఇందిరారాణి అని నాపేరు చూసిన నా తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. - డాక్టర్ ఇందిరారాణి, జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ ఆర్అండ్బీ మహిళా ఇంజనీర్లలో తొలి డాక్టరేట్ ‘హైవేల నిర్మాణంలో పర్యావరణ ప్రమాణాలు’ అనే అంశంపై చేసిన పరిశోధనకు రోడ్లు భవనాల శాఖలో ఈఈగా పనిచేస్తున్న చిల్క వసంతకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో జన్మించిన వసంత ఆర్అండ్బీలో పనిచేసే మహిళా ఇంజినీర్లలో డాక్టరేట్ అందుకున్న తొలి మహిళ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈమె భువనగిరిలో ఈఈగా పనిచేస్తున్నారు.