breaking news
ramanji
-
పసికందు కిడ్నాప్
గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయం వద్ద ఆరు నెలల బాలుణ్ణి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పట్టణానికి చెందిన ఎర్రదేశి రామాంజి, మన్నెమ్మ అనే దంపతులు బంధువులతో కలిసి తమ కుమారుడికి అన్నప్రాశన చేసేందుకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయానికి శనివారం రాత్రి 8 గంటలకు వచ్చారు. రాత్రి పొద్దుపోయాక ఆలయం బయట అడుకుంటున్న అరవింద్(6 నెలలు) అనే పిల్లవాణ్ణి గుర్తుతెయని వ్యక్తులు ఎత్తుకుని పిల్లవాడు ముద్దుగా ఉన్నాడని ముద్దాడుతూ పిల్లవాడితో సహా ఉడాయించారు. ఈ హటాత్ సంఘటనతో ఖంగుతున్న పిల్లవాని తల్లిదండ్రులు మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లవాని ఆచూకి కోసం గాలిస్తున్నారు. -
బైకు, లారీ ఢీ: ఒకరి మృతి
సండేపల్లి(వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న బైకు ను ఓ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా సండేపల్లి మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని కర్నూలు - చిత్తూరు రహదారిపై దేవపట్ల వద్ద బైకును లారీ ఢీకొట్టింది. దీంతో బైకు పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు.. పుత్తూరు రామంజిగా పోలీసులు నిర్ధరించారు.