పోలీసులమంటూ వచ్చి..
హైదరాబాద్: పోలీసులమని చెప్పి సీపీఎం పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తపై దాడికి దిగారు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురిలోని మున్సిపల్ కాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
పార్టీ కార్యాలయంలో ఉన్న రామాచారిపై పోలీసులమంటూ లోపలికి వచ్చిన కొందరు దుండగులు దాడి చేశారు. దీంతో బాధితుడు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.