breaking news
Rajasekhar (25)
-
హీరోయిన్ని టచ్ చేస్తానంటే నో చెప్పా.. జీవిత ఏం అన్నారంటే..: డైరెక్టర్
రాజశేఖర్( Rajasekhar) పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిత్రాల్లో అంకుశం, సింహారాశి కచ్చితంగా ఉంటాయి. నైంటీస్ జనరేషన్కి అంకుశం ఫేవరేట్ అయితే.. ఆ తర్వాతి తరానికి ‘సింహారాశి’ మాత్రమే గుర్తుంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఉన్నప్పటికీ.. హీరో మాత్రం ఆమెను టచ్ కూడా చేయడు. కథ ప్రకారం ఆయన ఆడవాళ్లను ముట్టుకోవద్దు. అయితే పాటల్లో మాత్రం ముట్టుకోవడానికి రాజశేఖర్ ట్రై చేశాడట. కానీ డైరెక్టర్ వద్దని చెప్పడంతో పాటల్లో కూడా హీరోయిన్ని టచ్ చేయలేదట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా దర్శకుడు సముద్ర చెప్పాడు.‘మా కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం సింహారాశి. అందులో రాజశేఖర్ అద్భుతంగా నటించాడు. కథ ప్రకారం ఆయన అమ్మాయిలను టచ్ చేయొద్దు. ఎందుకంటే ప్లాష్ బ్యాక్లో తల్లి తనను పట్టుకోకుండా పెంచి పెద్ద చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. తన తల్లి తాకని ఈ శరీరాన్ని ఎవరూ తాకొద్దని హీరో ఒక సన్యాసిలా బతుకుతాడు. అటువంటి వాడిని ఒక హీరోయిన్ వచ్చి ప్రేమించి, అతన్ని మార్చి ఎలా పెళ్లి చేసుకుంది’ అన్నది సింహారాశి కథ.సినిమా అన్నాక సాంగ్స్ కచ్చితంగా ఉంటాయి. పాటలన్నీ బాగా వచ్చాయి. అవి చూసి రాజశేఖర్ ఆనందంతో డ్యాన్స్ చేసేవాడు. ఓ సాంగ్ కోసం ఊటీకి వెళ్లాం. షూటింగ్ చేస్తుంటే.. హీరోయిన్(సాక్షి శివానంద్)ని పట్టుకోవాలని కొరియోగ్రాఫర్ చెప్పాడు. నేను మాత్రం హీరోయిన్ని టచ్ చేయొద్దని చెప్పా. అప్పుడు రాజశేఖర్ వచ్చి ‘అదేంటి? ఇది డ్రీమ్ కదా.. డ్రీమ్లో కూడా అమ్మాయిని పట్టుకోవద్దా?’ అని అడిగాడు. డ్రీమ్ అయినా..లైవ్ అయినా.. అసలు అమ్మాయినే పట్టుకోవద్దని చెప్పా. ‘లేదు సముద్ర, ఫ్యాన్స్ గోల చేస్తారు. నేను పట్టుకుంటా’ అని రాజశేఖర్ అన్నారు. ‘సార్.. మీకు దండం పెడతా..వద్దు వదిలేయండి’ అని చెప్పా. జీవిత కూడా నాకే సపోర్ట్ చేసింది. ‘అన్ని చేశారు కదా బంగారం.. డైరెక్టర్ ఏదో కుతూహల పడుతున్నాడు విను’ అని చెప్పింది. జీవిత చెప్పడంతో రాజశేఖర్ హీరోయిన్ని పట్టుకోకుండానే పాటను పూర్తి చేశాడు’ అని సముద్ర చెప్పుకొచ్చాడు. -
సోషల్ మీడియాలో పోస్టింగ్లతో కలత
గల్ఫ్లో జగిత్యాల జిల్లా యువకుడి ఆత్మహత్య మేడిపెల్లి (వేములవాడ: ప్రియురాలి ఆత్మహత్యకు కారణం నువ్వేనంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూసి ఓ యువకుడు సౌదీలో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం పోరు మల్లకి చెందిన కుంట రాజశేఖర్(25) మంగళ వారం సౌదీ అరేబియాలో ఉరేసుకున్నట్లు గ్రామస్తులు చెప్పారు. రాజశేఖర్ ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. సౌదీ వెళ్లడానికి ముందు ఇదే మండలంలోని కట్లకుంటకు చెందిన ఓ యువతిని ప్రేమించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రియురాలు ఈనెల 25న ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి చావుకు కారణం రాజశేఖరే అని, అతడ్ని కఠినంగా శిక్షించాలంటూ ఫేస్బుక్, వాట్సాప్లలో కొందరు పోస్టింగ్లు చేసినట్లు సమాచారం. దీంతో కలత చెందిన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజశేఖర్ తల్లిదండ్రులు రాజన్న, రాధ కోరుతున్నారు.


