breaking news
rajarajeshwari
-
‘నాకు, నా ఆస్తులకు రక్షణ కల్పించాలి’
కృష్ణా జిల్లా: తనకు, తన ఆస్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని దివంగత పారిశ్రామికవేత్త యెర్నేని జానకిరామయ్య పెద్ద కుమార్తె శ్రీరాజరాజేశ్వరి కోరారు. శనివారం కృష్ణా జిల్లా గంగూరులో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి యెర్నేని జానకిరామయ్య నుంచి తనకు గోడౌన్లు, ఇతర ఆస్తులు సంక్రమించాయని చెప్పారు. గంగూరులో 1988 నుంచి ఆస్తులు తన స్వాధీనంలో ఉన్నాయని, ప్లాన్లు, విద్యుత్ బిల్లులు కూడా తన పేరుతోనే ఉన్నాయని తెలిపారు. తన సోదరీమణులు అమరేశ్వరి, విజయేశ్వరి (ఈనాడు రామోజీరావు కోడలు) తన ఆస్తులు కాజేయాలని దౌర్జన్యం చేయిస్తున్నారన్నారు. గోడౌన్లు పగులగొడుతున్నారని తెలియటంతో తాను ఈ నెల 14న వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు అసలు పట్టించుకోలేదని తెలిపారు. పైగా తనతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. బంధువైన బీజేపీ నాయకుడు దిలీప్ కొందరిని తీసుకొచ్చి తన మనుషులపై దాడులు చేయించాడని, తనను బెదిరిస్తున్నాడని అన్నారు. గంగూరులోని స్థలంలో ఈనాడు, ప్రియా ఫుడ్స్ పెట్టడానికి యత్నిస్తున్నారని చెప్పారు. ఫిలింసిటీ నుంచి 70 మందిని తీసుకు వచ్చి పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. తాను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. తాను క్యాన్సర్తో బాధపడుతున్నానని, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని శ్రీరాజరాజేశ్వరి కోరారు. -
బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు. -
నకిలీ ఓటరు కార్డుల కలకలం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కుతోంది. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో దాదాపు 10వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు దొరకటం సంచలనం సృష్టించింది. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న అపార్ట్మెంట్లో జరుగుతున్న నకిలీ కార్డుల ప్రింటింగ్ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా, ఇవి అసలైన కార్డుల్లాగే కనబడుతున్నాయని అయితే విచారణలోనే అసలు విషయాలు వెల్లడవుతాయని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ఇదే కాంగ్రెస్ సిద్ధాంతం. ఓటర్లు వారికి ఓటేయకపోతే.. నకిలీ ఓటర్లను సృష్టిస్తారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడే ఈ రాకెట్ వెనక ఉన్నారు’ అని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఇక్కడి ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ఖండించారు. ఆ ఫ్లాట్ యజమాని మంజుల నంజమారి, పట్టుబడిన రాకేశ్లకు బీజేపీతో సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. అటు కాంగ్రెస్ బృందం ఈ ఘటనపై ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వి వాదంలో కాంగ్రెస్ను క్షమించొద్దని మోదీ అన్నారు. -
‘తీర్ధ’మూవీ స్టిల్స్


