breaking news
Raitubharosa yatra
-
21న కలెక్టర్ల కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం కానున్నారు. ఈనెల 21న జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనా విధానాలను స్పష్టం చేయడంతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు గాను ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు సీఎంవో వర్గాలు చెపుతున్నాయి. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ధరణి పోర్టల్పై కీలక సమీక్ష ఉంటుందని, పలు భూ సంబంధిత అంశాలు, జీవో 58, 59 అమలు, ప్రజా వాణి కార్యక్రమం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించడం, గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు కట్టు కునేందుకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాల ఖరారు, రైతు భరోసా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కౌలు రైతుల గుర్తింపు కోసం అనుసరించాల్సిన పద్ధతి.. తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని, వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా నిర్వహించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏయే అధికారులు ప్రజావాణిని ఏయే వారాల్లో నిర్వహించాలనే దానిపై కూడా కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. -
పింఛన్ లేదు.. రేషన్ లేదు
-
పింఛన్ లేదు.. రేషన్ లేదు
ఇదీ శ్రీశైలం చెంచుగూడెం గుండె చప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ప్రజల ఆవేదన మన ప్రభుత్వంతో అందరికీ న్యాయం జరుగుతుందన్న ప్రతిపక్ష నేత పింఛన్ల కోసం కోర్టులో కేసు వేద్దామని స్పష్టీకరణ కర్నూలు జిల్లాలో ఐదో రోజు కొనసాగిన యాత్ర ఇద్దరు రైతు కుటుంబాలకు జగన్ పరామర్శ రైతు భరోసా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: సారూ... నా పేరు సుబ్బమ్మ. ప్రభుత్వం నాకు ముసలోల్ల పింఛను ఇవ్వట్లేదు. ఎట్లాగైనా ఇప్పించండి సారూ! సారూ... నా పేరు బయ్యన్న. మాది ఓంకారం చెంచుగూడెం. మాకు రచ్చబండ రేషన్ కార్డులిచ్చినారు. వాటికి ఏడాది నుంచి రేషన్ ఇస్తలేరు. మేము ఏం తిని బతకాలి? సార్.. నా పేరు శాంతుడు. మాది లింగాపురం. నాకు 80 ఏళ్లు. నాకు పింఛన్ రావడం లేదు. ఎట్టా బతకాలి? ‘రైతు భరోసా యాత్ర’లో సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు విన్నవించిన సమస్యలు ఇలాంటివి ఎన్నెన్నో... చంద్రబా బు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క సమస్యనైనా పరిష్కరించడం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మండి పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. పింఛన్ల కోసం కోర్టులో కేసు వేసి పోరాడుదామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలిసి భరోసానిచ్చేందుకు ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర కర్నూ లు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సోమ వారం ఐదో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు లింగాపురం నుంచి బయలుదేరిన జగన్కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. దారి పొడవునా ఆయనకు ప్రజ లు తమ సమస్యలను విన్నవించారు. జగన్ వారికి ధైర్యం చెబుతూ మన ప్రభుత్వం వచ్చేలా దేవుడిని కోరుకోవాలని అన్నారు. మన ప్రభుత్వంతో అందరికీ మేలు జరుగు తుందని తెలిపారు. లింగాపురం నుంచి బయలుదేరిన ఆయన ఓంకారేశ్వరంలో దేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. అక్క డి నుంచి కడమల కాల్వ మీదుగా వెంగళరెడ్డి పేటకు చేరుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం బి.కోడూరుకు చేరుకుని రైతు దూదేకుల చాంద్బాషా కుటుంబాన్ని కలిసి భరోసానిచ్చారు. అక్కడి నుంచి పుట్టపల్లి, అబ్బీపురం మీదుగా తిమ్మాపురం చేరుకుని రైతు చిన్నస్వామి కుటుంబాన్ని కలసి ధైర్యం చెప్పారు. ఐదో రోజు భరోసా యాత్ర దాదాపు 30 కిలోమీటర్లకు పైగా సాగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే మొత్తం 12 గంటల పాటు యాత్ర కొనసాగింది. ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం భరోసా యాత్రలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో గ్రామంలోని ప్రజలు రోడ్డు మీదకు వచ్చి తమ సమస్యలను వైఎస్ జగన్కు ఏకరువు పెట్టారు. తమకు ఇంతవరకు ఇల్లు కట్టివ్వలేదని ఒకరు... 80 ఏళ్లు వచ్చినా పింఛన్ ఇవ్వట్లేదని మరొకరు... తమ పొలాలకు నీరివ్వడం లేదని ఇంకొందరు ఆయన వద్ద బోరున విలపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏ ఒక్క మేలు చేయడం లేదని, ఆయనది మొదటి నుంచీ అదే తీరని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై గట్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రధానంగా వృద్ధులకు పింఛన్లను కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా కోర్టులో కేసు వేసి మరీ పోరాడి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామన్నారు. తాము నారు పోసుకున్న తర్వాత నీరు ఇవ్వబోమంటూ ప్రభుత్వం దండోరా వేస్తోందని రైతులు వాపోయారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లున్నప్పటికీ రెండో కారు పంటకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మూడో కారు పంటకు నీరిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వస్తోంది.. ప్రజలకు ఒక్క మేలూ చేయని చంద్రబాబు ప్రభుత్వం పోవాలని గట్టిగా దేవుడిని కోరుకోవాలని ప్రజలతో వైఎస్ జగన్ పేర్కొన్నారు. మన ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని హామీనిచ్చారు. జ్వరం వస్తే దవాఖానా లేదు దోమల బెడద ఎక్కువవుతోందని, ప్రభుత్వం తమకు కనీసం దోమతెరలు కూడా పంపిణీ చేయలేదని ఓంకారం చెంచుగూడేనికి చెందిన చెంచులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జ్వరం వస్తే వెళ్లడానికి ప్రభుత్వ దవాఖానా కూడా లేదని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా అందరికీ మేలు జరుగుతుందని వైఎస్ జగన్ అభయమిచ్చారు. -
5వ రోజు రైతు భరోసా యాత్ర ఇలా..
-
5వ రోజు రైతు భరోసా యాత్ర ఇలా..
మహానంది: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర 5వ రోజు సోమవారం బండిఆత్మకూరు మండలంలోని లింగాపురం నుంచి మొదలవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి తెలిపారు. లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకు రోడ్షో నిర్వహిస్తారన్నారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్బాషా కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అక్కడి నుంచి రోడ్షో వెంగళరెడ్డిపేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదుగా మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురానికి చేరుకుంటుందన్నారు. ఆ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అనంతరం బుక్కాపురం, అల్లీనగరం వరకు రోడ్షో చేపడతారన్నారు. -
ఎమ్మెల్యేలను కొనేస్తే సీఎం కాలేరు
ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నవారే అసలైన సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హితవు టీడీపీ పెద్దలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు.. ప్రజలంటే చులకన కర్నూలు జిల్లాలో రెండో రోజు రైతు భరోసా యాత్ర ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చలేదు రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలను మాఫీ చేయలేదు రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: ‘‘ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లినవారు బుద్ధి, జ్ఞానం ఉంటే రాజీనామా చేయాలి. లేదంటే పార్టీలో చేర్చుకున్న బుద్ధి, జ్ఞానం లేని ఆ పెద్ద మనిషి వారిని అనర్హులుగానైనా ప్రకటించాలి. ప్రజా స్వా మ్యంపై వీళ్లకు(టీడీపీ పెద్దలు) గౌరవం లేదు. ప్రజలంటే వీరికి చులకన భావన. రైతులంటే ఇంకా ఇంకా చులకన. సీఎంగా మళ్లీ గెలవాలంటే ఎంపీటీసీలను లాక్కోవడ మో, కార్పొరేటర్లను లాక్కోవడమో, ఎమ్మెల్యే లను లాక్కోవడం వల్లనో అది నెరవేరదు. ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకుం టేనే ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర రెండో రోజు శుక్రవారం శ్రీశైలం నుంచి మొద లై ప్రకాశం జిల్లా దోర్నాల మీదుగా ఆత్మకూ రుకు చేరుకుంది. ఈ సందర్భంగా దోర్నాల, ఆత్మకూరు బహిరంగ సభల్లో కిక్కిరిసిన జనసందోహాన్ని ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. అంతకుముందు ఆయన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. బహిరంగ సభల్లో జగన్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నా రంటూ నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను, వెన్నుపోటు పొడిచే వాళ్లను మనందరం కలిసికట్టుగా ఒక్కటై బంగాళాఖాతంలో కలుపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... రైతన్నల పరిస్థితి దయనీయం ‘‘కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికిపైగా రైతులు ఆత్మహ త్యలు చేసుకున్నారు. అయితే, నష్ట పరిహారం అందించింది అధికారిక లెక్కల ప్రకారమే నలుగురంటే నలుగురికి మాత్రమే. రాష్ట్రంలో రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు. అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిం ది. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా మని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో ఇదే మాట చెప్పారు. ఏ టీవీలో చూసినా ఇదే హామీ. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావా లంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు. చివరకు చదువుకుం టున్న పిల్లలను, చదువులు పూర్తి చేసుకున్న యువతను కూడా వదల్లేదు. జాబు రావాలం టే బాబు ముఖ్యమంత్రి కావాలని ఊదర గొట్టారు. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే ప్రతీ ఇంటికీ నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాటలు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి జాబు తెచ్చుకున్నారు. కుర్చీలో కూర్చున్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇవాళ ఒక్కటే అడుగుతున్నా... రైతన్నల, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలన్నీ నిజంగా మాఫీ అయ్యాయా? రైతన్నల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే... బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు చంద్ర బాబు మాటలు నమ్మి వాటిని తిరిగి చెల్లించ లేదు. రుణాలు కట్టకుండా ఉన్నందుకు ఇవాళ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇంతకుముందు రూ.లక్ష లోపు రుణాలన్నీ వడ్డీ లేకుండా వచ్చేవి. రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు తీసుకుంటే పావలా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇవాళ సున్నా వడ్డీలు, పావలా వడ్డీలు కనిపించకుండా పోయాయి. రైతన్నలు బ్యాంకుల వద్దకు వెళితే రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలేవీ? రైతుల రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో ఇన్సూరెన్సు కూడా రాకుండా పోయింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా రూ.24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, రబీలోనే రూ.9,800 కోట్ల టర్మ్ రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇచ్చింది ఎంతో తెలుసా? కేవలం రూ.4,900 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు 2, 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. రబీలో 24 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా ఈసారి రైతులు కేవలం 11 లక్షల హెక్టార్లల్లో మాత్రమే పంటలు వేశారు. అంటే 48 శాతం కూడా పంటలు వేయలేదు. కర్నూలు జిల్లాలో కిలో ఉల్లిపాయలకు రూ.2కు కూడా రాకపోవడం తో రైతులు పంటను చేనులోనే వదిలేస్తున్నా రు. కేజీ టమోటా రూ.2కు కూడా అమ్ముకోలే ని పరిస్థితులు ఉన్నాయి. మిరప పంటకు మద్దతు ధర రావడం లేదని రైతులు నాతో చెప్పారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. నిన్న శ్రీశైలం డ్యాంకు వెళ్లాను. డ్యాంలో 844 అడుగుల నీరు ఎప్పటి నుంచి ఉందని అని ఇంజనీర్లను అడిగా. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉందని చెప్పారు. అంటే 130 రోజులుగా నీరుంది. అయినా డ్యాం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరివ్వలేదు. బాబు వచ్చారు.. కరువును తీసుకొచ్చారు రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాలో వెయ్యి అడుగుల లోతులో బోర్లు వేస్తే తప్ప నీరు పడని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రై దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడేళ్లలో ఆయనతోపాటు వచ్చినవి ఏమిటంటే.. వరుసగా కరువు కాటకాలు లేదా అకాల వర్షాలే. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2,000 కోట్లు కేటాయించి, యుద్ధప్రాతిపదికన పనులను పరుగెత్తించాల్సింది పోయి ముష్టి వేసినట్లు బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు ఇచ్చాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా 18.82 కిలోమీటర్ల పొడవైన మొదటి సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 13.73 కిలోమీటర్లే తవ్వారు. ఇంకా 5 కిలోమీటర్లు తవ్వాలి. 18.83 కిలోమీటర్ల మేర రెండో సొరంగాన్ని తర్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే తవ్వకాలు జరిపారు. అంటే ఇంకా 8.83 కిలోమీటర్లు తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే రూ.1,000 కోట్లు కేటాయించి వేగంగా పనులు కొనసాగిస్తేనే ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుంది. ముష్టి వేసినట్లు కేవలం రూ.100 కోట్లు ఇస్తే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చంద్రబాబు నాయుడే చెప్పాలి. సొరంగాల తవ్వకం పూర్తయ్యేలోగా హెడ్రెగ్యులేటర్ పనులు పూర్తి చేయాలి. అప్పుడే హెడ్లెగ్యులేటర్ గుండా సొరంగాల్లో కి నీటిని పంపించగలుగుతాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం హెడ్లెగ్యులేటర్ పనులనే ఇంకా ప్రారంభించలేదు. ఆయనకు డబ్బు తప్ప ఇంకేం వద్దు సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు. కారణం ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ఆయనకు లేదు. రైతన్నలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. కాంట్రాక్టర్లపై మాత్రమే ఆయన ప్రేమ ఒలకబోస్తున్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పనులు చేయకపోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. డబ్బు... డబ్బు... డబ్బు తప్ప చంద్రబాబు ఇంకేమీ అవసరం లేదు. చంద్రబాబు ఇవాళ అద్దాల మేడ నుంచి సామాన్య ప్రజల వద్దకు వస్తే వారు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. వచ్చేది రైతుల పరిపాలనే.. దేవుడి దయ వల్ల చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయాయి. ఇక సంవత్సరమో, రెండేళ ్లలోనో ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత మనం దరి ప్రభుత్వమే వస్తుంది. రైతుల పరిపాలన వస్తుంది. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను రెండు మూడేళ్లలోనే పూర్తి చేస్తా మని గట్టిగా చెబుతున్నా.ఈ చంద్రబాబు చేసి నా చేయకపోయినా గట్టిగా మాటిస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఎవరైనా ఏదైనా చేశారూ అంటే అది దివంగత నేత రాజశేఖర్రెడ్డే. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్టును నేను పూర్తిచేస్తా. చంద్రబాబు నైజమంతా ఇవాళ ఎంత డబ్బు సంపాదించాం? ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలను కొనేశాం? ఎంతమంది ఎంపీటీసీలను కొనుగోలు చేశాం? అన్నదే. రాజకీయ వ్యవస్థను ఎట్లా భ్రష్టు పట్టించాలన్నదే ఆయన ఆలోచన. నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఒకమాట చెబుతుండేవారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు... ఎట్లా బతికామన్నదే ముఖ్యం అని అనేవారు. అలాంటి గొప్ప నాయకుడు పరిపాలించిన రాష్ట్రంలో ఈరోజు దిక్కుమాలిన వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ను జోక్గా మార్చారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వాస్తవానికైతే ఉప ఎన్నికలు రావాలి. కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. చంద్రబాబూ! రెప్పొద్దున గెలవాలంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే కాదు. ప్రతీ పేదవాడి ఇంట్లో నీ ఫొటో ఉండేటట్టు చేసుకో.. అప్పుడే గెలుస్తావు. ముఖ్యమంత్రిగా మళ్లీ గెలవాలి అంటే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. ఇవాళ అందరం బతికే ఉన్నాం. రేపోమాపో ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. చనిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి ఇంట్లో ఫొటో ఉండాలని ఆరాటపడే వ్యక్తే అసలైన రాజకీయ నాయకుడు. దివంగత నేత రాజశేఖరరెడ్డి మా నాన్నగారని చెప్పడానికి గర్వపడతాను. ఆయన మా నాయకుడు అని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకుంటారు. చంద్రబాబు గురించి భవిష్యత్తులో ఎవరూ చెప్పుకునే పరిస్థితి ఉండదు. కారణం.. ఆయన ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్షతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశారు. రూ.లక్షకుపైగా అయ్యే చదువులకు రూ.20 వేలో, రూ.30 వేలో ఇస్తామని చెబుతున్నారు. మిగిలిన సొమ్మును అప్పుల పాలై మీరు తెచ్చుకోండి అని అంటున్నారు. ఇవాళ ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలో రూ.లక్ష, మెడికల్ కాలేజీల్లో రూ.11 లక్షలకు పైగా ఉన్నాయి. ఆస్తులు, పొలాలు అమ్ముకుంటే తప్ప పేదవాడు చదువుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక జోక్గా మార్చేశారు. నవ్వుకునేటట్టు చేశారు. దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే... వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంతో పోటీపడి కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. ప్రతీ పేదవాడికి తోడుగా నిలిచారు. ఇవాళ ఇళ్లు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. దాదాపు మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించిన పాపాన పోలేదు. ఇక పెన్షన్ల పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలో ఎవరైనా చనిపోతే తమకు పెన్షన్లు వస్తాయని ఎదురు చూసే పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి. చంద్రబాబు మోసాల గురించి చెప్పిస్తాం.. రైతులు ఎలా బతుకుతున్నారు? వారికి ఏం చేయాలన్న ఆలోచనను కేబినెట్ సమావేశాల్లో చేయరు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు. డయాలసిస్ రోగి కిడ్నీలు చెడిపోయిన ఆసుపత్రికి వెళితే సంవత్సరం తర్వాత రాపో అని అంటున్నారు. రైతుల వద్ద ఎంత భూమి తీసుకోవాలి? కమీషన్లు తీసుకుని ఎవరికి అమ్మాలి? ఎవరికి ఇవ్వాలని మాత్రమే కేబి నెట్ మీటింగుల్లో చర్చిస్తున్నారు. రైతన్నలు, డ్వాక్రా అక్కాచెల్లెమ్మల బాధలు చంద్రబాబు కు అర్థమయ్యే విధంగా వారితోనే చెప్పిస్తాం. చదువుకున్న పిల్లలకు మైక్ ఇచ్చి వారితోనే చంద్రబాబు మోసం గురించి చెప్పిస్తాం. మళ్లీ రాజన్న పాలన రావాలి చంద్రబాబును చూసిన ఇతను మా నాయకుడు అని కార్యకర్తలు చెప్పుకునే పరిస్థితి లేదు. చంద్రబాబును చూపించి ఇలాంటి వెన్నుపోటుదారుడు, ఇలాంటి మోసగాడు, ఇలాంటి దుర్మార్గుడు దేశంలో ఎక్కడా ఉండడని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన రావాలి. ఆ స్వర్ణయుగం మళ్లీ రావాలి. రాజకీయాల్లో అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను, వెన్నుపోటు పొడిచే వాళ్లను మనందరం కలిసికట్టుగా ఒక్కటై బంగాళాఖాతంలో కలపాలి. అప్పటివరకు చేతిలో చెయ్యి వేసి, అడుగులో అడుగు వేసి తోడుగా నిలవాలని ప్రతి ఒక్కరినీ సవినయంగా వేడుకుంటున్నా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
’ఇచ్చిన హామీలఅమలు ఏమైంది బాబూ’