breaking news
raises usd
-
ముంబై ఎయిర్పోర్ట్ కోసం అదానీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,600 కోట్లు) సమీకరించింది. నిధులను ముంబై ఎయిర్పోర్ట్ రుణాల రీఫైనాన్సింగ్కు వినియోగించనుంది. న్యూయార్క్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అధ్యక్షతన మెట్లైఫ్ ఇంక్, బ్లాక్రాక్ ఇంక్, ఎఫ్డబ్ల్యూడీ ఇన్సూరెన్స్ నిధులు సమకూర్చాయి.ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) కోసం 2022లో సమీకరించిన రుణాల రీఫైనాన్స్కు నిధులు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఎంఐఏఎల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ వాటా 74 శాతంకాగా.. భారత ఎయిర్పోర్ట్స్ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. దేశీయంగా రెండో పెద్ద ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న కంపెనీ 2029 జులైలో గడువుతీరే 75 కోట్ల డాలర్ల విలువైన నోట్లను జారీ చేసింది. వీటికి అదనంగా 25 కోట్ల డాలర్ల నోట్లను జారీ చేసే వీలుతో నిధుల సమీకరణ చేపట్టింది.తద్వారా బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. దీంతో ఎంఐఏఎల్ అభివృద్ధి, ఆధునీకరణ, సామర్థ్య విస్తరణకు ఆర్థిక వెసులుబాటు లభించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. తాజాగా జారీ చేసిన బాండ్లు 6.9 శాతం కూపన్రేటుతో నాలుగేళ్ల కాలానికి గడువు తీరనున్నాయి. ఎయిర్పోర్ట్ మౌలికసదుపాయాల రంగంలో తొలి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ప్రయివేట్ బాండ్ల జారీని చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. -
జాక్ పాట్ కొట్టేసిన పేటీఎం
ముంబై: దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న పేటీఎంలోకి జపాన్ కేంద్రంగా కార్యకలాపాలునిర్వహిస్తున్న సాఫ్ట్ బ్యాంక్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. పేటీఎంకు పేరెంట్ కంపెనీగా ఉన్న సాఫ్ట్బ్యాంక్ నుంచి జాక్ పాట్ కొట్టేసింది. 1.4 బిలియన్ల (10వేల కోట్లు) డాలర్ల పెట్టుబడులను తాజాగా ప్రకటించింది. రాబోయే రెండు, మూడు సం.రాల్లో వీటిని పేమెంట్ బ్యాంక్ లో వీటిని వినియోగించనుంది. దీంతో పేటీఎం నికర విలువ ఎనిమిది బిలియన్ డాలర్లను మించిపోనుంది. ఈ పెట్టుబడుల విషయాన్ని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. భారత ప్రభుత్వ డిజిటల్ సేవల ప్రోత్సాహం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ చెల్లింపులు సహా విస్తృత శ్రేణి ఆర్థిక సేవలకు డిజిటల్ సదుపాయం కల్పించడం ద్వారా వందల మిలియన్ల మంది భారతీయ వినియోగదారులు మరియు వ్యాపారుల జీవితాలను మార్చడం కోసం తాము కట్టుబడి ఉన్నామని సాఫ్ట్ సాఫ్ట్ గ్రూప్ ఛైర్మన్ , సీఈవో మసాయోసి సన్ చెప్పారు.తమ జట్టు విజన్ కు సాఫ్ట్బ్యాంక్ తాజా పెట్టుబడి, అద్భుతమైన పారిశ్రామికవేత్త మసాయోసి సన్ మద్దతు అపూర్వమని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటికే మొబైల్ వ్యాలెట్, ఈ-కామర్స్ రంగాల్లో దూసుకుపోతున్న పేటీఎం తాజా పెట్టుబడులను త్వరలో ప్రారంభించనున్న పేటీఎం బ్యాంకు విస్తరణకు వినియోగించనునుంది. ఎనలిస్టులు ఊహించినదానికంటే ఎక్కువగా భారీ మొత్తంలో సింగిల్ ఇన్వెస్టర్నుంచి పెట్టుబడులను అందుకుని పేటీఎం భారీ ఆఫర్ కొట్టేసిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మే నెల 23 నుంచి పేమెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు పేటీఎం ప్రకటించింది. దీనికి సంబంధించి రిజర్వు బ్యాంక్ నుంచి అనుమతిపొందినట్టు తెలిపింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్) పేరుతో సేవలను ఆరంభించబోతున్నది. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఈ-వ్యాలెట్ కింద ఉన్న 21.8 కోట్ల మంది వినియోగదారులు బ్యాంకింగ్ సేవల పరిధిలోకి రానున్నట్లు కంపెనీ పబ్లిక్ నోటీస్లో పేర్కొంది. వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు పేమెంట్ బ్యాంక్ సేవలు అందించడానికి ఆర్బీఐ లైసెన్స్ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. From an inspiring meeting in Delhi to announcing large investment by @softbank today. Proud to partner @MasaSon in @Paytm journey ! #GoBig pic.twitter.com/ETc9jiQpy3 — Vijay Shekhar (@vijayshekhar) May 18, 2017