breaking news
raids on hotels
-
కేపీహెచ్బీలో ఓయో రూమ్లపై పోలీసుల దాడులు..
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్దార్ పటేల్ నగర్లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్పై ఎస్వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. వెస్ట్ బెంగాల్కి చెందిన 8 మంది మహిళలను పోలీసులు కాపాడి రెస్క్యూ హోమ్కి తరలించారు. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న(సోమవారం) కూడా కేపీహెచ్బీలోని పలు ఓయో రూమ్లపై బాలానగర్ ఎస్వోటి పోలీసులు దాడులు చేశారు. 9 మంది యువతులను రక్షించారు. చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి -
సికింద్రాబాద్: హోటల్లో అశ్లీల నృత్యాలు.. 8 మంది యువతులు..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలోని బసేరా హోటల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రైడ్స్లో భాగంగా 8 మంది యువతులు, 25 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని గోపాలపురం పోలీసు స్టేషన్కు తరలించారు. ఇది కూడా చదవండి: లగ్గానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.. కానీ, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. -
మాదాపూర్: ఓయో రూంలో వ్యభిచారం చేస్తూ..
మాదాపూర్(హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్న హైటెక్ టవర్ హోటల్ 4వ ఫ్లోర్ గది నంబర్ 401లో ఇద్దరు వ్యక్తుల సాయంతో దాడి చేశారు. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు అందులో ఓ మహిళ ఇతరులతో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బిహార్కు చెందిన అజిత్భగత్(25), ఓ కంపెనీలో హౌస్కీపింగ్ పనిచేస్తున్నాడు. అమీన్పూర్ బీరంగూడకు చెందిన పట్లోళ్ల రాహూల్రెడ్డి (24), ప్రైవేటు ఉద్యోగి. పశ్చిమ బెంగాల్కి చెందిన నున్నిహర్ ఖాతున్ ఫలెజ్ అలీ(34)కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వీరితో కలసి అర్జున్ అలియాస్ కమలాకర్రెడ్డి హైదరాబాద్ నుంచి పలువురిని పిలిపించుకుని అజిత్ భగవత్ సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ సంఘటనలో అర్జున్ పరారీలో ఉండగా పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సోదాలో రూ.1010 నగదు, తదితర సామగ్రితో పాటు రెండు సెల్పోన్లు, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు -
డ్రగ్స్ కేసు నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు ముమ్మరం
-
పబ్స్పై డ్రగ్స్ పడగ
Pudding And Mink Pub Raid, సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: గంజాయి నుంచి కొకైన్ దాకా.. రోడ్లపైనే డ్రగ్స్ అమ్మకాలు.. గోవాల్లో పార్టీలు.. యూట్యూబ్లో చూసి తయారుచేసి విక్రయాలు.. మితిమీరి వాడిన యువకుడు చనిపోవడం.. ఇలా కొద్దిరోజులుగా మాదకద్రవ్యాల వ్యవహారం ఆందోళన రేపుతుంటే.. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పబ్బులో డ్రగ్స్ గబ్బు బయటపడింది. అర్ధరాత్రి దాటినా యువతీ యువకులు ‘మత్తు’లో చిందేస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం, అక్కడ పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది. హైదరాబాద్లోని బంజా రాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూప్లాజా హోటల్కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో ఆదివారం తెల్లవారుజామున నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. 24 గంటల లిక్కర్ అనుమతి పేరిట.. ర్యాడిసన్ బ్లూప్లాజా స్టార్ హోటల్ కావడంతో దానిలోని బార్ అండ్ రెస్టారెంట్కు 24 గంటలూ మద్యం సరఫరా చేసే అనుమతి ఉంది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు గత నెల 16న కాసిబట్ట అశోక్ పేరుతో రెన్యువల్ అనుమతి పత్రం జారీ చేశారు. ఇక్కడ ఏ సమయంలోనైనా మద్యం లభిస్తుంటుంది. ఈ క్రమంలోనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వీఐపీలు, ప్రముఖులు, వారి సంతానం ఈ హోటల్కు క్యూ కడుతుంటారు. ఈ అనుమతిని అడ్డం పెట్టుకున్న హోటల్ నిర్వాహకులు.. అందులోని పబ్ను సైతం ఇష్టానుసారం నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసు, ఎక్సైజ్ అధికారులెవరైనా తనిఖీలకు వస్తే.. తమకు 24 గంటలు లిక్కర్ సరఫరా చేసే అనుమతి ఉందంటూ చూపిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ పబ్లో ఈ దందా నడుస్తోంది. మెంబర్షిప్ ద్వారా వచ్చే యాక్సెస్ కార్డుతో మాత్రమే పబ్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తుంటారు. దీనిని తమకు అనువుగా మార్చుకున్న కొందరు పెద్దలు, వారి పిల్లలు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ను వారాంతాల్లో రేవ్ పార్టీలకు అడ్డాగా వాడుకుంటున్నారు. కోడ్ చెప్పిన వారికే ఎంట్రీ.. ఈ పబ్లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు రెండు, మూడు రోజుల ముందే ‘వీఐపీ సర్కిల్’కు సమాచారం వెళ్లింది. పబ్కు సంబంధించిన ప్రత్యేక యాప్ ద్వారా, ఎంపిక చేసుకున్న వాట్సాప్ గ్రూపుల ద్వారా.. ఓ బర్త్డే పార్టీ పేరిట ‘డ్రగ్ ఈవెంట్’ నిర్వాహకులు ‘కస్టమర్ల’కు ఆహ్వానం పంపారు, వారికి ప్రత్యేకంగా కోడ్వర్డ్స్ ఇచ్చారు. ఆ కోడ్ చెప్పినవారిని మాదకద్రవ్యాలతో వచ్చినా తనిఖీలు లేకుండా లోనికి పంపేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఎల్ఎస్డీ, కొకైన్, గంజాయి పెద్ద ఎత్తున పబ్లోకి చేరింది. రాత్రి 9 గంటలకు మొదలైన హడావుడి అర్ధరాత్రి 12 గంటలకు జోరందుకుంది. అప్పటికే హోటల్లో బసచేసిన కొందరు బడాబాబులు పబ్లోకి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. శనివారం సాయంత్రం నుంచే నిఘా పెట్టారు. రేవ్ పార్టీ సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. నార్త్, సెంట్రల్, వెస్ట్జోన్లకు చెందిన టాస్క్ఫోర్స్ బృందాలు.. దాదాపు 40 మంది సివిల్ పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్పై దాడి చేశాయి. ఎక్కడిక్కడ డ్రగ్స్ను విసిరేసి.. పబ్లో పోలీసులు ప్రవేశించగానే.. నిర్వాహకులు, డ్రగ్స్ వాడుతున్నవారు అవాక్కయ్యారు. తమ వద్ద ఉన్న డ్రగ్స్ను పూలకుండీల్లో, స్ట్రాలు ఉంచే డబ్బాల్లో దాచేశారు. కొందరు బాత్రూమ్ల్లో పడేశారు. కిటికీల్లోంచి కొకైన్ షాట్స్, ఎల్ఎస్డీ బోల్ట్స్ను బయటికి విసిరేశారు. పోలీసులు ఆ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లా సిద్ధార్థ్, రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల సహా మొత్తం 148 మందిని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. పబ్ లీజుకు తీసుకొని నడిపిస్తున్న అభిషేక్ ఉప్పాల (39)తోపాటు మేనేజర్ మాదారం అనిల్కుమార్ (35)ను అరెస్టు చేశారు. ఈ పార్టీ నిర్వాహకుడిగా అనుమానిస్తున్న అర్జున్ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు. ఈవెంట్ మేనేజర్గా ఉన్న కునాల్, డీజే శశిధర్రావులు రేవ్పార్టీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో పాల్గొన్నవారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. సొంత పూచీకత్తు ఆదివారం ఉదయం విడుదల చేశారు. కాగా.. దాడి సందర్భంగా క్లూస్టీమ్లు పబ్లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించాయి. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపి విశ్లేషించనున్నారు. కోడ్వర్డ్స్తో సరఫరా.. పబ్లో జరిగిన పార్టీలో యువతీయువకులు కోడ్వర్డ్స్తో డ్రగ్స్ను పిలుచుకున్నట్టు పోలీసువర్గాలు గుర్తించాయి. మేనేజర్ అనిల్కుమార్ స్ట్రాలు ఉంచే డబ్బాల్లో కొకైన్ పెట్టి.. వినియోగదారులకు అందజేశాడని తెలిసింది. పోలీసులు దాడి చేసినప్పుడు అదేమిటని అడిగితే.. మాక్టైల్లో కలిపే షుగర్ అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సమాచారం. డ్రగ్స్ తీసుకున్నది ఎవరెవరు? ఇటీవల డ్రగ్స్పై పోలీసుల నిఘా పెరగడంతో.. ఫుడింగ్ అండ్ మిక్ పబ్ డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతలకు సేఫ్జోన్గా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తరచూ డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తేల్చేందుకు పబ్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని నిర్ణయించారు. ఆదివారం తెల్లవారుజామున దాడి సందర్భంగా సీసీ ఫుటేజీ ఉన్న డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వీడియోల ఆధారంగా డ్రగ్స్ను ఎవరెవరు తీసుకొచ్చారు. ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? సరఫరా చేసింది ఎవరన్నది తేలిపోతుందని పోలీసులు చెప్తున్నారు. సీఐ సస్పెండ్.. ఏసీపీకి మెమో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కనిపెట్టలేకపోయారా? లేక సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు తక్షణ చర్య కింద బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ బాధ్యతలను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు అప్పగించారు. పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. నిహారికకు సంబంధం లేదు: నాగబాబు సాక్షి, హైదరాబాద్: పబ్లో డ్రగ్స్ కేసుతో తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నేత, సినీనటుడు నాగబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘గత రాత్రి రాడిసన్ అండ్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ వేళల పరిమితికి మించి నడపడం వల్ల పబ్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు అంతా క్లియర్.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకూడదని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’.. అని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు. అనుమానితుల శాంపిల్స్ ఫోరెన్సిక్కు..! ► డ్రగ్స్ ఎవరెవరు వాడారనేది తేల్చడంపై పోలీసుల దృష్టి పబ్లో నిర్వాహకులు సహా మొత్తం 148 మంది పోలీసులకు చిక్కారు. పబ్ లోపల, బయట ప్రాంగణంలో తప్ప ఎవరి వద్దా నేరుగా డ్రగ్స్ లభించలేదు. సాధారణంగా మాదకద్రవ్యాల కేసులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తారు. దాని ప్రకారం డ్రగ్స్ కలిగి ఉన్న వారిని మాత్రమే అప్పటికప్పుడు అరెస్టు చేయవచ్చు. పబ్లో డ్రగ్స్ దొరికినా వాటిని ఎవరు వాడారన్నది ఇప్పుడే తేల్చలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పబ్లో పట్టుబడినవారి నుంచి రక్తం, వెంట్రుకలు, ఇతర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కోర్టు అనుమతి అవసరంకావడంతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. డ్రగ్స్ వినియోగించినవారి తల వెంట్రుకల్లో దాదాపు ఆరు నెలల పాటు ఆనవాళ్లు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. ఐదు ప్యాకెట్ల కొకైన్ లభించింది సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ ‘హెచ్–న్యూ’విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానితో పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టి, కొన్నిసార్లు డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నాం. ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో దాడి చేసి, 148 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఐదు ప్యాకెట్ల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. ఈ పబ్ వాళ్లు తమకు 24 గంటలు కార్యకలాపాలు నిర్వహించే అనుమతి ఉందంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. విచారణ చేసి ఎవరెవరు డ్రగ్స్ వాడారో తేలుస్తాం. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి విచారిస్తాం. – జోయల్ డెవిస్, వెస్ట్జోన్ డీసీపీ పోలీసులే కస్టమర్లలా మారి.. ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్, రేవ్ పార్టీలు చాలాకాలంగా సాగుతున్నట్టు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీనితో నిఘా పెట్టారు. ఈ పబ్ సభ్యత్వం కోసం ఏడాదికి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా పామ్ (ఫుడింగ్ అండ్ మింక్) పేరుతో ఓ యాప్ నిర్వహిస్తున్నారు. పార్టీలకు రావాలని భావించే వారంతా దాన్ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకోవాలి. పబ్లోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని చెప్పాల్సి ఉంటుంది. పబ్ వ్యవహారం ఇంత పకడ్బందీగా సాగుతుండటంపై టాస్క్ఫోర్స్ పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిని ఛేదించడానికి పది రోజుల కింద పక్కాగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. కొందరు పోలీసులు కస్టమర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. శనివారం రాత్రి యాప్, ఓటీపీల తతంగం పూర్తి చేసుకుని పబ్లోకి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో డ్రగ్స్ వినియోగం మొదలవడాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే కాపుకాసిన ప్రత్యేక బృందాలు పబ్పై దాడి చేసి.. రేవ్ పార్టీ గుట్టురట్టుచేశారు. -
నగదుకు నకిలీ గౌరవ డాక్టరేట్
మైసూరు: అదో పెద్ద హోటల్. సమావేశ గదిలో కోలాహలం. కొందరు స్నాతకోత్సవ గౌన్లు ధరించి.. డాక్టరేట్లు అందుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇంతలో పోలీసులొచ్చారు. ముగ్గురిని అరెస్ట్చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అనే నకిలీ వర్సిటీ పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మైసూర్లో ఓ హోటల్పై దాడిచేశారు. ఔత్సాహికుల నుంచి భారీగా డబ్బు తీసుకుని నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు నంబియార్, శ్రీనివాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్చేశారు. ఆ సమయంలో హోటల్లో సుమారు 142 మందికి గౌరవ డాక్టరేట్ పట్టాలిస్తున్నారు. -
వ్యభిచారం గుట్టు రట్టు
కర్నూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న రమా లాడ్జీలో జోరుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టయింది. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు దాడి చేసి విటులతో పాటు లాడ్జీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాళ్లకు విముక్తి కల్పించారు. రమా లాడ్జీలోని రూం నెంబర్ 108, 109లో జోరుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో మూడో పట్టణ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐలు శ్రీనివాసులు, రహ్మతుల్లా తమ సిబ్బందితో శనివారం లాడ్జీలోని ఆయా గదుల్లో తనిఖీలు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతుండగా కొంతమందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కర్నూలులోని బళ్లారి చౌరస్తా సమీపంలోని గోపినగర్లో నివాసముంటున్న కమ్మరి సాయి కిరణ్, గార్గేయపురం గ్రామానికి చెందిన ఆర్యకటిక అంజీశ్వర్లను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కౌలుబజార్ ప్రాంతానికి చెందిన దూసకంటి స్వప్న అలియాస్ జ్యోతి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చిన్న నల్గొండ ప్రాంతంలో నివాసముండేది. వ్యభిచార వృత్తిలోకి దిగి కొంత కాలంగా డోన్లో నివాసముంటోంది. ఈమెను రమా లాడ్జి నిర్వాహకుడు చిన్నకొండ మల్లికార్జునరెడ్డి పిలిపించుకొని వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. దీంతో మల్లికార్జునరెడ్డితో పాటు లాడ్జీలో పనిచేస్తున్న గోవిందరెడ్డి, పోతుగంటి నాగరాజు తదితరుల పై కేసు నమోదు చేసి బాధితురాలికి విముక్తి కల్పించినట్లు సీఐ హనుమంతనాయక్ తెలిపారు. -
హోటళ్లపై దాడులు..బాలలకు విముక్తి
హైదరాబాద్: నాంపల్లిలోని రెండు హోటళ్లపై బుధవారం బాలల హక్కుల కమిషన్ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా పలువురు బాలలకు విముక్తి కల్పించారు. ఈ దాడిలో కరాచీ బేకరీలో నలుగురు, న్యూ పారడైజ్ లాడ్జిలో 8మంది మైనర్లు పట్టుబడ్డారు. వీరిని బొమ్మలు విక్రయించే పనిలో వాడుకుంటున్నట్లు తేలిందని చైల్డ్ కమిషన్ అధికారి ఇంతియాజ్ చెప్పారు. వీరికి కనీస వేతనంతో పాటు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని కమిషనర్ అచ్యుతరావు తెలిపారు. పట్టుబడిన 12 మంది బాలలను బాలసదన్కు తరలించామన్నారు. ఈ మేరకు సంబంధిత హోటల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
ప్రేమికులకు ఇక గడ్డుకాలం!
వాళ్లంతా ప్రేమికులు లేదా కాబోయే భార్యాభర్తలు. ముంబై నగరంలోని వేర్వేరు హోటళ్లకు జంటలుగా వెళ్లారు. అక్కడ ఉన్న వాళ్లను మాల్వానీ పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వాళ్లపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఈ అంశం ముంబై మహానగరంలో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. తామంతా మైనారిటీ తీరినవాళ్లమేనని, తమకు నచ్చిన వ్యక్తితో ఎక్కడో హోటల్ గదిలో తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటే దానికి పోలీసులకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అదేమీ బహిరంగ ప్రదేశం కాదుకదా అని మండిపడుతున్నారు. పోలీసులు దాదాపు 40 వరకు జంటలను అరెస్టు చేయగా, వాళ్లలో చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్లు వెళ్లాయి. ఒక్కొక్కరికి దాదాపు రూ. 1200 జరిమానా విధించారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన 19 ఏళ్ల అమ్మాయి దాదాపు ఆత్మహత్య చేసుకున్నంత పని చేసింది. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగినందుకు మరో 21 ఏళ్ల అమ్మాయిని లేడీ కానిస్టేబుల్ చెంపమీద కొట్టింది. తాను తన అసలు పేరు, గుర్తింపు ధ్రువపత్రాలు కూడా హోటల్లో ఇచ్చానని, అలాంటప్పుడు వాళ్లు తమను వ్యభిచారిణులుగా ఎందుకు చిత్రీకరించాలని ఆమె ప్రశ్నించింది. ముంబైలోని పలు హోటళ్లు, లాడ్జిలు, రిసార్టులు, రెండు స్టార్ హోటళ్లలో ఈ రైడ్లు జరిగాయి. పోలీసులు తమను అందరిముందు అవమానించారని, బలవంతంగా తమతో తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయించారని మరొకరు చెప్పారు.