-
‘రాక్షస కావ్యం’ మూవీ రివ్యూ
టైటిల్: రాక్షస కావ్యం నటీనటులు: అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైఖేల్, దయానంద్ రెడ్డి, పవాన్ రమేష్, రోహిణి ఆరెట్టి కుశాలిని తదితరులు నిర్మాతలు: దాము రెడ్డి, సింగనమల కల్యాణ్ దర్శకత్వం: శ్రీమాన్ కీర్తి సంగీతం: రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎమ్ సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం విడుదల తేది: అక్టోబర్ 13, 2023 ‘రాక్షస కావ్యం’ కథేంటంటే.. అజయ్ (అభయ్ బేతగంటి) ఓ కాంట్రాక్ట్ కిల్లర్. చదువుకున్న వాళ్లంటే అతనికి చాలా గౌరవం. చిన్నప్పుడే తల్లి చనిపోవడం.. తండ్రి తాగుబోతు కావడంతో చదవు మానేసి కాంట్రాక్ట్ కిల్లర్గా మారతాడు. మరోపక్క విజయ్(అన్వేష్ మైఖేల్)కి సినిమాల పిచ్చి. హీరోల కంటే విలన్లు అంటేనే ఎక్కువ ఇష్టం. విలన్లకు న్యాయం చేయడానికై తనే ఓ సినిమా తీయాలని ప్రయత్నిస్తాడు. మరోవైపు అజయ్ చంపేందుకై స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అసలు అజయ్, విజయ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజయ్ తల్లి ఎలా చనిపోయింది? హత్యలు, సెటిల్మెంట్స్ చేస్తూ సంపాదించిన డబ్బును అజయ్ ఏం చేశాడు? సొంత తండ్రిని ఎందుకు దూరం పెట్టాడు? అజయ్, విజయ్ల బ్యాక్ స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే రాక్షస కావ్యం చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమా ‘రాక్షస కావ్యం’. ఈ సినిమా కథ రా అండ్ రస్టిక్గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి. కామెడీ, ఎమోషన్స్, లవ్ సన్నివేశాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రాసుకున్నాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్పై క్రియేట్ చేసినంత ఇంట్రెస్ట్ని.. సెకండాఫ్పై చేయడంలో విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభమే చాలా విచిత్రంగా ఉంటుంది. సినిమాలోని ప్రధాన పాత్రలను పురాణాల నుంచి ప్రేరణగా తీసుకొని.. ప్రస్తుతం వాళ్లు భూమిపై ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్తో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్గా అజయ్ ఎంట్రీ వెరైటీగా అనిపిస్తుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థితో దగ్గరుండి మరీ హత్యలు చేయించడం.. ఈ నేపథ్యంలో సాగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అజయ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో కథంతా ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది. హీరో కాంట్రాక్ట్ కిల్లర్గా మారడం వెనుక ఉన్న కారణం కన్విన్సింగ్గా అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ సాగే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం కథనం ఆసక్తికరంగా సాగదు. విజయ్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే అతను అలా మారడానికి బలమైన కారణాన్ని చూపించలేకపోయాడు. మన సినిమాల్లో విలన్స్ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు, హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అజయ్ పాత్రకు కనెక్ట్ అయినట్లుగా ఆడియన్స్ విజయ్ పాత్రకు కనెక్ట్ కాలేరు. పైగా చాలా చోట్ల రిపీటెడ్ సీన్స్ చిరాకు కలిగిస్తాయి. క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్ కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. దర్శకుడు ఓ ప్రయోగం అయితే చేశాడు కానీ అందులో కొతమేర వరకే సక్సెష్ అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఈ మధ్య వరుస సినిమాతో దూసుకెళ్తున్న అభయ్ బేతగంటి.. ఈ చిత్రంలో మరో డిఫరెంట్ పాత్ర పోషించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ అజయ్ పాత్రలో అభయ్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. ఇక విజయ్గా ‘కొత్త పోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ తనదైన స్క్రీన్ ప్రెజన్స్తో ఆకట్టుకున్నాడు. సీనియర్ యాక్టర్ దయానంద్ రెడ్డి మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. చైతన్య అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ పాత్రకు పవన్ రమేష్ న్యాయం చేశాడు. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలీవరీ నవ్వులు పూయించాయి. యాదమ్మ రాజు, కోట సందీప్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాకొస్తే... ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం అని చెప్పాలి. రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎమ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
రాక్షస కావ్యం మూవీ ప్రీమియర్ షో రెస్పాన్స్
-
'రాక్షస కావ్యం'తో అలాంటి ఎక్స్పీరియెన్స్: నిర్మాత శింగనమల కల్యాణ్
విదేశంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నిర్మాత, ఫైనాన్షియర్గా శింగనమల కల్యాణ్ టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'భాగ్ సాలే' సినిమాని నిర్మించిన ఈయన లేటెస్ట్ మూవీ 'రాక్షస కావ్యం'. అభయ్, అన్వేష్ మైఖేల్, రోహిణి ప్రధాన పాత్రలు చేశారు. అక్టోబరు 13న థియేటర్లలోకి రానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. - చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్. ఉద్యోగం చేస్తున్నా..సినిమాల మీద ఇష్టం తగ్గలేదు. ఒకరోజు ప్రొడ్యూసర్ దామురెడ్డిని మధుర శ్రీధర్ రెడ్డి నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన కారణంగా 'రాక్షస కావ్య' సినిమాలో భాగమయ్యాను. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) - 'రాక్షస కావ్యం' కథ రా అండ్ రస్టిక్గా ఉంటుంది. రియల్ లైఫ్లో చూసిన దానికి దగ్గరగా ఉంటుంది. ఈ కథలో విలన్స్ గెలవాలి. ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి అనే కామెడీ పాయింట్ కూడా కొత్తగా ఉంటుంది. మన సినిమాల్లో విలన్స్ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు, హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సరదా సీన్స్ ఉంటాయి. - చిన్న సినిమాలకు ప్రొడక్షన్ ఎప్పుడూ రిస్కే. కొవిడ్ టైమ్లో ఓటీటీల వల్ల చిన్న సినిమాలకు లాభపడ్డాయి. కానీ ఇప్పుడు ఓటీటీలకు ఇవ్వాలంటే కష్టంగా ఉంది. కంటెంట్ బాగుండి, మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన 'బేబి' లాంటి మూవీస్ హిట్ అవుతున్నాయి. సినిమా బాగుంటే ఓపెనింగ్స్ రాకున్నా తర్వాత కలెక్షన్స్ బాగుంటాయి. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) -
అక్టోబర్ 6న ‘రాక్షస కావ్యం’
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 6న “రాక్షస కావ్యం” సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే “రాక్షస కావ్యం” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత వారం విడుదల చేసిన విలన్స్ ఆంథెమ్ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడాలనే క్రేజ్ సినీప్రియుల్లో ఏర్పడుతోంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
భారత్ పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
తప్పక చదవండి
- భారత్ పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement