-
అడవి శేష్.. ‘ఎవరు’?
గూఢచారి సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు అడవి శేష్. హీరోగానే కాకుండా కథకుడిగానూ మెప్పించిన ఈ హీరో గూఢచారికి సీక్వెల్ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఇదే కాకుండా 2స్టేట్స్ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. తాజాగా ఈ హీరో మరో చిత్రాన్ని ప్రకటించాడు. అడివి శేష్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావల్సివస్తుంది. నేడు ఈ మూవీ పోస్టర్, టైటిల్ను ప్రకటించాడు. ‘ఎవరు’గా రాబోతోన్న ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్లో తెరకెక్కిస్తుండగా.. వెంటక్ రామ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానున్నట్లు ప్రకటించాడు. -
ఒకే సినిమాలో పదిమంది హీరోయిన్లు
టాలీవుడ్ స్క్రీన్ మీద మరో ఆసక్తికరమైన సినిమా సందడి చేయనుంది. భారీ చిత్రాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన బడా నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటి వరకు ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలను మాత్రమే మల్టీ స్టారర్ సినిమా అనేవారు. కానీ తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా మల్టీ స్టారర్ చేయవచ్చని ప్రూవ్ చేయడానికి రెడీ అవుతోంది పివిపి సంస్థ. అది కూడా ఒకరిద్దరు హీరోయిన్స్తో కాదు, ఏకంగా పది మంది హీరోయిన్స్తో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, అనుష్క లాంటి టాప్ హీరోయిన్స్తో పాటు అనసూయ, రష్మీ లాంటి స్మాల్ స్క్రీన్ సెన్సేషన్లు కూడా నటించే అవకాశం ఉంది. గతంలో నాగార్జున నటించిన కింగ్ సినిమాలో ఒక్కపాటలో ఎనిమిది మంది హీరోయిన్లు సందడి చేయగా, ఇప్పుడు ఈ సినిమాలో పది మంది హీరోయిన్లు ఫుల్లెంగ్త్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబందించిన కథ కూడా రెడీగా ఉందంటున్న పివిపి సంస్థ, ఎవరు దర్శకత్వం వహిస్తారు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది లాంటి అంశాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే సైజ్ జీరో, క్షణం లాంటి సినిమాలతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ప్రమోట్ చేస్తున్న పివిపి సంస్థ, ఒకే సినిమాలను పది మంది హీరోయిన్లు ఉంటే ఇంకే స్థాయిలో తెరకెక్కిస్తుందో చూడాలి. -
బంగారం లాంటి అవకాశం!
‘‘అనుష్కతో స్పెషల్గా చాట్ చేయాలనుకుంటున్నారా? కేజీ బంగారం గెలవాలనుకుంటున్నారా?... అయితే మా ‘సైజ్ జీరో’ చిత్రాన్ని మిస్ కావొద్దు’’ అని ప్రసాద్ వి. పొట్లూరి అంటున్నారు. అనుష్క, ఆర్య జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చితం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర ్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం కోసం అనుష్క చాలా కష్టపడింది. ఆమె కష్టం వృథా కాకూడదని బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే కార్వీ సహకారంతో ‘కేజీ బంగారం గెలవండి’ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ప్రేక్షకులకు సినిమా టిక్కెట్తో పాటు ఒక కూపన్ని ఇస్తారు. అందులోని 11 డిజిట్స్ కోడ్ను ‘పివిపి సినిమా.కామ్’ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాకాకున్నా కూపన్లో ఇచ్చిన సెల్ నంబర్కు వివరాలు మెసేజ్ పంపాలి. వీరిలో 20మంది ప్రేక్షకులను ఎంపిక చేస్తాం. వారితో అనుష్క స్పెషల్ చాటింగ్ ఉంటుంది. ఆ 20 మందిలో ఒక లక్కీ విన్నర్కు కేజీ బంగారం ఇస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడాలనే సంకల్పంతో ఈ కాంటెస్ట్ పెడుతున్నాం’’ అని తెలిపారు. అనుష్క, దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నాగ్-కార్తీ కాంబినేషన్లో సినిమా స్టార్ట్
నాగార్జునకు తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గీతాంజలి, శివ, రక్షకుడు తదితర చిత్రాలు తమిళంలోనూ విడుదలై, విజయం సాధించాయి. అలాగే తమిళ హీరో కార్తీ నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో విడుదలవుతుంటాయి. ఆ విధంగా కార్తీకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలా రెండు భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం బుధవారం హైదరాబాద్లో మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి చిత్రనిర్మాత సతీమణి ఝాన్సీ సురెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నాగ్ సతీమణి అక్కినేని అమల క్లాప్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి సతీమణి మాలిని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఇది చాలా మంచి కథ. కచ్చితంగా విభిన్న తరహా మల్టీస్టారర్ అవుతుంది’’ అని తెలిపారు. తెలుగులో తన తొలి స్ట్రయిట్ చిత్రం నాగార్జునతో కలిసి చేయడం ఆనందంగా ఉందని కార్తీ చెప్పారు. ఈ చిత్రంలో నటించడానికి నాగార్జున, కార్తీ అంగీకరించడం సగం విజయం సాధించినట్లుగా ఉందనీ, ఈ చిత్రం ద్వారా దర్శకునిగా తనను తమిళంలో పరిచయం చేస్తున్న పీవీపీకి ధన్యవాదాలని దర్శకుడు అన్నారు. వచ్చే నెల 16న రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడి పల్లి-హరి-సాల్మన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: గోపీసుందర్, కెమెరా: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్బాబు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement