-
రైలు లేటైతే ప్రమోషన్పై వేటే
న్యూఢిల్లీ: ఇకపై రైళ్లు ఆలస్యమైతే అధికారులను బాధ్యులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు పదోన్నతులు నిలిపేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. నిర్వహణ పనుల వల్ల రైళ్లు ఆలస్యమవుతున్నాయనే కారణానికి చరమగీతం పాడాలని, రైళ్లు ఆలస్యమవకుండా దృష్టి పెట్టి నెలలోపు మార్పు చూపాలని ఆదేశించారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులు, జోనల్ జనరల్ మేనేజర్లతో ఇటీవల జరిగిన సమావేశంలో రైళ్ల ఆలస్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎంపీహెచ్ఎస్ పదోన్నతులకు బ్రేక్
లక్షలు చేతులు మారాయనడంలో వాస్తవం లేదు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం ఆర్డీ షాలినీదేవి కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : వైద్య ఆరోగ్య శాఖ జో¯ŒS–2 పరిధిలో జరగాల్సిన ఎంపీహెచ్ఎస్ పదోన్నతుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘పదోన్నతుల్లో మాయాజాలం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన పదోన్నతుల పక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత పదోన్నతులు నిర్వహిస్తామని ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ షాలినీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీహెచ్ఎస్ పదోన్నతులకు సంబంధించి లక్షలాది రూపాయలు చేతులు మారినట్టుగా వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. పదోన్నతులకు సంబం«ధించి ఎవరు చెప్పినా ఏ ఒక్కరికీ డబ్బులు ఇవ్వవద్దని ఉద్యోగులందరికీ పదేపదే చెప్పామన్నారు. ఆయా జో¯ŒSల పరిధుల్లోని యూనియన్ల నుంచి ఈ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలూ కూడా రాలేదని తెలిపారు. పదోన్నతులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జీవో నంబర్–68 ప్రకారం కులధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉందన్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం ఉద్యోగులను మూడుసార్లు అడిగామని వివరించారు. వారు దాఖలు చేయకపోవడంతో పదోన్నతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. దీంతో మిగిలినచోట్ల భర్తీపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే పదోన్నతుల ప్యానల్ ఆమోదం మేరకు ఎంపీహెచ్ఎస్ పదోన్నతులను చేపట్టామని తెలిపారు. పీహెచ్సీల్లో సమర్థవంతమైన సేవలందించే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ పదోన్నతులు చేపట్టామని వివరణ ఇచ్చారు. పదోన్నతులకు సంబంధించి ఏ దశలోనూ ఎవ్వరికీ సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్డీ షాలినీదేవి పేర్కొన్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలు సృష్టిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement