-
పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు
-
‘ప్రైవేటు’ చుక్చుక్కి.. చకచకా ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త కూత వినిపించనుంది. రెండేళ్లలో ప్రైవేట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. 2023 మార్చి.. రైల్వే చరిత్రలో విప్లవాత్మక మార్పు అమలు కానుంది. తేజస్ లాంటి స్పెషల్ కేటగిరీ రైలును ప్రైవేటు సంస్థల ఆధ్వర్యం లో నడిపించనున్నారు. తొలిసారి ప్యాసింజర్ రైళ్లు ప్రైవేటు సర్వీసులుగా పట్టాలెక్కబోతున్నాయి. దేశ వ్యాప్తంగా 151 రైళ్లు ప్రైవేటుపరం కానున్నాయి. సికింద్రాబాద్ క్లస్టర్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో రైళ్లను ప్రైవేటు సంస్థలు నడపనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా ఊపి, దశలవారీగా మిగతా రూట్లలో అనుమతి ఇవ్వనుంది. 16 సంస్థలు.. 120 దరఖాస్తులు జూలైలో ప్రైవేటీకరణ తొలిదశగా రిక్వెస్ట్ ఫర్ క్వా లిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానించగా దేశవ్యాప్తం గా 16 సంస్థలు వివిధ రూట్లకు సంబంధించి 120 దరఖాస్తులు సమర్పించాయి. తాజాగా వాటిని పరిశీలించిన రైల్వే అందులో 102 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించింది. సికింద్రాబాద్ క్లస్టర్లో 9 సంస్థలు అర్హత సాధించినట్టు ప్రకటించింది. తదుపరి ఫైనాన్షియల్ బిడ్లకు దరఖాస్తులు ఆహ్వా నించనుంది. దేశవ్యాప్తంగా రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఈ రూపంలో సమకూర్చుకోవా లని రైల్వే భావిస్తోంది. ఏ సంస్థ ఎంతమేర ఆదా యాన్ని రైల్వేకు ఇచ్చేందుకు ముందుకొస్తుందన్న విషయం ఫైనాన్షియల్ బిడ్ల ద్వారా తేలుతుంది. అందులో ఎక్కువ మొత్తం కోట్ చేసిన సంస్థలను ప్రైవేటు రైళ్లు నిర్వహించేందుకు గుర్తిస్తూ రైల్వే చివరి నోటిఫికేషన్ జారీ చేయనుంది. (చదవండి: ‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ) సికింద్రాబాద్ క్లస్టర్ పరిధిలో ప్రైవేటు రైళ్లివే.. సికింద్రాబాద్– శ్రీకాకుళం వయా విశాఖపట్నం సికింద్రాబాద్–తిరుపతి, గుంటూరు–సికింద్రా బాద్, గుంటూరు–కర్నూలు సిటీ, తిరుపతి–వార ణాసి వయా సికింద్రాబాద్ సికింద్రాబాద్–ముంబై, ముంబై–ఔరంగాబాద్ విశాఖపట్టణం–విజయ వాడ, విశాఖపట్టణం–బెంగళూరు వయా రేణి గుంట, హౌరా–సికింద్రాబాద్, సికింద్రాబాద్– పాండిచ్చేరి వయా చెన్నై అర్హత టెండర్లలో ఎంపికైన సంస్థలు ఇవే.. 1. క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి., 2. గేట్వే రైల్ ప్రై.లి., గేట్వే డిస్ట్రిపార్క్స్ లిమిటెడ్ల కన్సార్షియం, 3. జీఎమ్మార్ హైవేస్ లి., 4. ఐఆర్సీటీసీ, 5.ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లి., 6.ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లి., 7.మాలెంపాటి పవర్ ప్రై.లి., టెక్నో ఇన్ఫ్రా డెవెలపర్స్ ప్రై.లిమిటెడ్ల కన్సార్షియం, 8. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లి., 9 వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ప్రస్తుతం రైల్వే నడుపుతున్న సర్వీసుల్లోంచే వీటిని ప్రైవేటు సంస్థ లకు కేటాయించనుంది. ప్రైవేటు సంస్థలు సొంతం గా రైల్ రేక్స్ సమకూర్చుకుని వీటిని తిప్పుతాయి. సొంత చార్జీలు.. తాము నడిపే రైళ్లకు ఆయా సంస్థలు సొంతం గా చార్జీలు ఏర్పాటు చేసుకోనున్నాయి. రైల్వే అ నుమతించిన మేర వాటిని పెంచుకుని వసూలు చేసుకుంటాయి. ఆధునిక బోగీలు, వసతులు, వేగం, పరిశుభ్రత, భోజనం నాణ్య త... తదితరాల ఆధారంగా చార్జీలు నిర్ణయిం చనున్నారు. ఇవి ప్రస్తుత రైలు చార్జీల కంటే ఎక్కువగా ఉండనున్నాయి. విదేశాల నుంచి కూడా లోకోమోటివ్ ఇంజిన్లు, బోగీలు దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా ఉండటంతో కొత్త తరహా రైళ్లు పట్టాలపై పరుగుపెట్టే అవకా శముంది. స్టేషన్లు, సిగ్నళ్లు అన్నీ రైల్వే అధీనంలోనే ఉంటాయి. వాటిని, విద్యుత్తును వినియోగించు కున్నందుకు ఆయా సంస్థలు రైల్వేకు ప్రత్యేక చార్జీలను చెల్లించనున్నాయి. (చదవండి: భారత్ బయోటెక్ మరో గుడ్న్యూస్) -
‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రైవేటు రైలు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రైవేటు రైళ్ల నిర్వహణకు తమకు తగిన అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకు (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్) దరఖాస్తులను ఆహ్వానించగా.. 12 క్లస్టర్లకు 15 కంపెనీల నుంచి మొత్తం 120 దరఖాస్తులు దాఖలైనట్టు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ భారతీయ కంపెనీలే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కూడా పాల్గొన్నది. పీపీపీ విధానంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దేశవ్యాప్తంగా 12కు పైగా క్లస్టర్లలో 140 మార్గాల్లో (రానుపోను) 151 అధునాతన రైళ్లను ఎంపికైన సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నెట్వర్క్పై ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ) అన్నది మొదటి దశ. ఈ దశలో తగిన అర్హతలు కలిగిన సంస్థలను రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది. వీటి నుంచి రెండో దశలో.. ప్రతిపాదనలను (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్/ఆర్ఎఫ్పీ) ఆహ్వానిస్తుంది. ‘‘దరఖాస్తుల మదింపు ప్రక్రియను రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తుంది. అర్హత సాధించిన కంపెనీలకు ఆర్ఎఫ్పీ పత్రాలు 2020 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటాయి. 2021 ఫిబ్రవరి నాటికి అన్ని క్లస్టర్ల కేటాయింపును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాము’’ అని రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ క్లస్టర్కు 10 దరఖాస్తులు సికింద్రాబాద్ క్లస్టర్కు 10 దరఖాస్తులు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తోపాటు.. జీఎంఆర్ హైవేస్ లిమిటెడ్, ఐఆర్సీటీసీ, అరవింద్ ఏవియేషన్, బీహెచ్ఈఎల్, కన్స్ట్రక్షన్స్ వై ఆక్సిలర్ డీ ఫెర్రోక్యారైల్స్, ఎస్ఏ, క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3, గేట్వే రైల్ ఫ్రయిట్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మాలెంపాటి పవర్ ప్రైవేటు లిమిటెడ్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, సాయినాథ్ సేల్స్ అండ్ సర్వీసెస్, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు ఆర్ఎఫ్క్యూలు సమర్పించాయి. -
ప్రైవేట్ రైళ్లలో చార్జీలపై పరిమితి లేదు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రంగంలో త్వరలో ప్రవేశపెట్టబోయే రైళ్లలో ప్రయాణ చార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. చార్జీలపై నిర్ణయం ప్రైవేట్ సంస్థలదేనని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేట్ రైళ్లను 35 ఏళ్లపాటు నడిపేందుకు అనుమతిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చార్జీల విషయంలో ప్రైవేట్ బిడ్డర్లు పలు సందేహాలు లేవనెత్తారు. మార్కెట్ డిమాండ్ను బట్టి ప్రైవేట్ సంస్థలే చార్జీలను నిర్ధారించవచ్చని తాజాగా రైల్వే శాఖ తెలియజేసింది. రైల్వేస్ యాక్ట్ ప్రకారం దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం లేదా పార్లమెంట్ అంగీకారంతో చట్టబద్ధత కల్పించాల్సి ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. సాధారణంగా రైలు చార్జీలను రైల్వే శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తాయి. ప్రైవేట్ రైళ్లలో అత్యాధునిక వసతులు ఉంటాయి కాబట్టి ప్రయాణ చార్జీలు అధికంగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థలు సొంతంగానే తమ వెబ్సైట్ల ద్వారా రైల్ టికెట్లు అమ్ముకోవచ్చు. కానీ, ఈ వెబ్సైట్లను రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్తో అనుసంధానించాల్సి ఉంటుంది. రైల్వే శాఖలో ఈ–ఆఫీస్ జోరు కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ 4 నెలలుగా ఈ–ఆఫీస్కు పెద్దపీట వేస్తోంది. పత్రాలు, ఫైళ్లను డిజిటల్ రూపంలోకి మార్చేసి, ఆన్లైన్లోనే పంపించింది. లేఖలు, బిల్లులు, ఆఫీస్ ఆర్డర్లు వంటి 12 లక్షలకు పైగా డాక్యుమెంట్లను, మరో 4 లక్షల ఫైళ్లకు డిజిటల్ రూపం కల్పించారు. దీంతో నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గింది. 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు రైల్వే శాఖ ఆన్లైన్లో 4.5 లక్షల ఈ–రసీదులు జారీ చేయగా, 2020లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 16.5 లక్షల ఈ–రసీదులను జారీ చేసింది. ఈ–ఫైళ్ల సంఖ్య 1.3 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగింది. -
2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రైళ్ల ఆగమనంలో భాగంలో మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 2023–24లో మరో 45 రైళ్లు, 2026–27 నాటికి 151 ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఇటీవలే ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. 2023 మార్చి నుంచి ప్రైవేట్ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. 151 ప్రైవేట్ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, జనసంద్రంగా మారిన ప్రధాన రహదారి (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
కూల్ లుక్తో కేక పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ (ఫొటోలు)
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement