breaking news
private security sector
-
ఐదేళ్లలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు
ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో అపార అవకాశాలు: సీఏపీఎస్ఐ-క్యాప్సి న్యూఢిల్లీ: భారత్లో 2020 కల్లా ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. సెక్యూరిటీ గార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ స్థాయి ఉద్యోగాలు వస్తాయని ది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ(సీఏపీఎస్ఐ-క్యాప్సి) అంచనా వేస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులందజేసే కంపెనీల అత్యున్నత సంఘమైన క్యాప్సి చైర్మన్ కున్వర్ విక్రమ్ సింగ్ వెల్లడించిన వివరాలు.., * కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలు, మౌలిక రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, రహదారులు, విమానశ్రయాలు, ఓడరేవులపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో భారీ స్థాయిలో సెక్యూరిటీ గార్డులు అవసరం అవుతారు. * ప్రస్తుతం 15 వేల సెక్యూరిటీ సర్వీసుల కంపెనీలు భారత్లోని 600 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 70 లక్షలకు పైగా పురుష, మహిళ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. * సెక్యూరిటీ గార్డుల కోసం వ్యక్తులను వెదకడం, ఆ వ్యక్తులను అదే ఉద్యోగంలో కొనసాగించడం... ఈ రెండు అంశాలు ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమలో అతి పెద్ద సమస్యలు. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం. * ఈ రంగంలో డిమాండ్-సరఫరాల మధ్య అంతరం 30 శాతంగా ఉంది. * ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగవకాశాలపై గిరిజన ప్రాంతాల్లో క్యాప్సి, సెక్యూరిటీ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. -
ప్రైవేటు సెక్యూరిటీలోకి గిరిజనులు: క్యాప్సీ
హైదరాబాద్: ప్రైవేటు సెక్యూరిటీ రంగం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించింది. సెక్యూరిటీ గార్డులుగా గిరిజన యువతను నియమించుకుంటామని సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (కా్యిప్సీ) చైర్మన్ కున్వర్ విక్రమ్ సింగ్ తెలిపారు. గిరిజనుల్లో చక్కని పనితనం ఉందని అన్నారు. ప్రైవేటు గార్డులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మానవ వనరుల కొరతను అధిగమించొచ్చని తెలిపారు. క్యాప్సి పైలట్ ప్రాజెక్టు కింద వందలాది మంది జార్ఖండ్ యువతులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్టార్ పథకం కింద సుమారు 30,000 మంది గిరిజన యువత శిక్షణ పొందారని పేర్కొన్నారు.