breaking news
private driver
-
వీరు మారరా..?
ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ( Anti-Corruption Bureau) పేరు వినిపిస్తేనే అధికారులు హడలిపోయేవారు. ప్రస్తుతం లంచం తీసుకోవడం.. ఏసీబీకి చిక్కడం.. సాధారణమయింది. వారికి చిక్కినా మళ్లీ ఉద్యోగం ఉంటుందనే భరోసా లంచావతారులుగా మారుస్తోంది. నెల గడవక ముందే ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.వికారాబాద్/ధారూరు: ముఖ్యమంత్రి, శాసన సభాపతి సొంత ఇలాకాలో కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచావతారులుగా మారారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ధారూరు ఎస్ఐ, అతని డ్రైవర్ మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదితమే. ఓ మైనర్ను కేసు నుంచి తప్పించడంతో పాటు మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ డబ్బు తీసుకున్నట్లు సమాచారం. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అవినీతి నిరోధక శాఖ( Anti-Corruption Bureau) అధికారుల బృందం వేసిన వలలో ధారూరు ఠాణా ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న ఎస్ఐ, అతని డ్రైవర్ లంచం తీసుకుంటూ చిక్కారు. ఈ మేరకు వారిని బుధవారం రిమాండ్కు తరలించారు. గతేడాది డిసెంబర్లో తాండూరులో ఓ తహసీల్దార్, ఆర్ఐ క్యాడర్ అధికారులు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి రెండు నెలలు గడవకముందే ధారూరు ఘటన జరగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నేతల అండదండలు..? అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి పోస్టింగులు తీసుకుని వస్తున్న అధికారులు వసూళ్లకు తెగబబడుతున్నారు. పోస్టింగ్కు వెచ్చించిన సొమ్ము ఎలా పూడ్చుకోవాలని కొందరి ముందు అధికారులు మొహమాటం లేకుండా చెబుతున్నారట. దీంతో ఉన్నత స్థాయి పర్యవేక్షణాధికారులకు ఇది అడ్డంకిగా మారుతోంది. న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కితే ఎస్ఐ(Dharur SI ) జలగలా పీడిస్తున్నారని.. రాజీ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడతున్నారని వేణుగోపాల్ గౌడ్ వచి్చన నాటి ఇదే తంతు కొనసాగుతోందని ఆరోపణలున్నాయి. డిపార్ట్మెంట్ డ్రైవర్ను పెట్టుకోకుండా ప్రైవేట్ డ్రైవర్ను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్లు చేశారని పోలీసులే చెప్పడం గమనార్హం. డ్రైవర్ వసూలైన డబ్బులో చేతివాటం ప్రదర్శించడంతో కొత్త డ్రైవర్ను నియమించుకుని ఇసుక ట్రాక్టర్లు, లోడ్తో వెళుతున్న లారీల డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.వేలల్లో వసూలు చేయడం ధారూరు ఠాణాలో చూశామని బాధితులు వాపోతున్నారు. కేసు ఏదైనా డబ్బు ముట్టజెప్పాల్సిందేనని ఫిర్యాదుదారులు, నిందితులు బాహాటంగానే చెబుతున్నారు. రెవెన్యూ, హెల్త్, పోలీస్, మున్సిపల్ శాఖల్లో విధులు నిర్వహించే పలువురిపై ఏసీబీ అధికారుల నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం. ఏసీబీ వలలో జిల్లా యంత్రాంగం తాజాగా పోలీసు శాఖలో పనిచేసే ఎస్ఐ అతని డ్రైవర్ లంచం తీసుకుంటూ పట్టుబడగా.. ఇరవై రోజుల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టబడిన విషయం తెలిసిందే. ఇలా తరచూ బాధితులు లంచావతారుల బాధలు తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. గతంలో తాండూరులో ఓ సబ్ రిజిస్టార్, పరిగిలో ఎంపీడీఓ, ఈజీఎస్ ఉద్యోగులు, డిప్యూటీ తహసీల్దార్, వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఓ పోలీసు అధికారి, వికారాబాద్లో(Vikarabad) ఓ ఇంజనీర్ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. తాజాగా పట్టుబడిన వారు పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన వారు కాగా.. మిగిలిన శాఖల్లోనే ఇదే పరిస్థితి దాపురించిందని బాధితులు వాపోతున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, మైనింగ్, సబ్ రిజి్రస్టార్, ఎస్టీఓ, డీటీఓ, ఆర్టీఏ, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదయినా సరే పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీరు చేసిన వసూళ్లో నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులకు సైతం ముడుపులు అందుతాయని అందుకే వారు కూడా నోరుమెదపరని ఆరోపణలున్నాయి. జిల్లాలో మరి కొందరిపై నిఘా!తాజా ఘటన నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఘటనపై చర్చించి పునారవృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బు తీసుకుని రూ.కోట్లతో ఉడాయించిన కేసులో దీపక్ వైష్టవ్ అనే వ్యాపారి నుంచి రూ. 30లక్షల వరకు వసూలు చేసి కేసు నీరుగార్చారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదుకాగా అతన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు పెద్దమొత్తంలో లంచం తీసుకున్నారని సమాచారం. కేసు నమో దు చేసి 70 రోజులు గడిచినా నిందితుడిని అరె స్టు చేయకుండా తాత్సారం చేశారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఉన్నతాధికారులు ఆ కేసు సీసీఎస్ పోలీసులకు అప్పగించగా వారు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు. గత డిసెంబర్లో ఐదుగురు ఆర్ఎంపీ డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ సభ్యులు కేసు నమోదు చేయగా వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.1.10లక్షలు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. వికారాబాద్తో పాటు పరిగి, కొడంగల్, తాండూరు సర్కిళ్ల పరిధిలోనూ కొందరు ఎస్హెచ్ఓలతో పాటు పర్యవేక్షణాధికారులమీద ఆరోపనలు వస్తున్నాయి. పరిగి సబ్ డివిజన్ పరిధిలో ఓ బోరు బండిని పట్టుకుని వదిలేసిన కేసులో, రేసింగ్కు వినియోగించే పావురాలను పట్టుకున్న కేసులోనూ పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్టు ప్రచారం జరుగుతోంది. రోజు వారీగా కేసులు నమోదులో వచ్చే మామూళ్లతో పాటు కొందరు ఎస్హెచ్ఓలు నెలవారీ మామూళ్లు మాట్లాడుకుని వ్యవహారం నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి.రేషన్ బియ్యం, కిరోసిన్, అక్రమ ఇసుక, మట్టి, కలప రవాణా చేసే వ్యక్తులతో పాటు మద్యం దుకాణాల నుంచి నెలవారీ మా మూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపనలు ఉన్నా యి. కాగా వారం రోజుల క్రితమే ఎస్ఐ వద్ద డ్రైవర్గా చేరిన బీరప్పను బలిపశువు చేశారని కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టగా ఏసీబీ అధికారులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. -
ప్రైవేట్ కండక్టర్పై కేసు నమోదు
సాక్షి, మధిర(ఖమ్మం) : టీఎస్ ఆర్టీసీ మధిర డిపోలో ప్రైవేటు కండక్టర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బస్సు టికెట్లను విక్రయించగా వచ్చిన సొమ్మును స్వాహా చేశాడు. మండల పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన పిల్లి శేఖర్బాబు మధిర డిపోలో ప్రైవేటు కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన హైదరాబాద్ వెళ్లే బస్సులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 7న డిపోలో టికెట్ల విక్రయానికి సంబంధించిన డబ్బులను జమచేసి బయటకు వస్తుండగా పోలీసులు సాధారణ తనిఖీలు చేశారు. అయితే రూ.21,900 విలువచేసే టికెట్లు ఆయన వద్ద అక్రమంగా ఉన్నట్లు తేలింది. వాటిలో రూ.16,626 విలువచేసే టికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. రూ.50 వేల విలువచేసే టికెట్లు మూడు బ్లాకులు, రూ.24 విలువచేసే టికెట్లు రెండు బ్లాకులు, రూ.21 విలువచేసే టికెట్లు ఒక బ్లాకు శేఖర్బాబు వద్ద అక్రమంగా ఉంచుకున్నాడు. ఒక్కో బ్లాకులో 100 టికెట్లు ఉంటాయి. అక్టోబర్ 11నుంచి ప్రయాణికులకు టికెట్లు జారీ చేయాలని డిపో అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. దీంతో అప్పటినుంచి ప్రైవేటు కండక్టర్ల వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 7న శేఖర్బాబును తనిఖీచేయగా ఈ డబ్బులు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై శేఖర్బాబుపై మధిర టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మధిర డిపో ఆదాయం రోజుకు రూ.7.85లక్షలు లక్ష్యం కాగా కనీసం రూ.4లక్షల ఆదాయంకూడా రావడంలేదు. ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతోపాటు కొంతమంది ప్రైవేటు కండక్టర్ల చేతివాటంతో డిపోకు రావాలి్సన ఆదాయం తగ్గుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఒకరిద్దరి కండక్టర్ల వద్ద డబ్బులు ఎక్కువగా ఉండటాన్ని గమనించి వారిని హెచ్చరించి వదిలేసినట్లు తెలిసింది. దీనిపై డిపో మేనేజర్ జీవీఎస్ నారాయణను వివరణ కోరగా.. డిపోలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వేర్వేరు శాఖలకు సంబంధించినవారు కావడంతో గందరగోళం నెలకొంటోందని అన్నారు. కండక్టర్లకు టికెట్లు బ్లాకులు ఇచ్చేటప్పుడు మర్చిపోవడంకానీ లేదా ఈ టికెట్ బ్లాకులను అతను చోరీ చేయడంకానీ జరిగి ఉండవచ్చని తెలిపారు. -
గుండెపోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి
అఫ్జల్గంజ్: బస్సు నడుపుతూ గుండె పోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి చెందిన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవరకొండకు చెందిన యాదయ్య (45) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అతను హైదరాబాద్ డిపో1లో తాత్కాలిక డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీలో ఉన్న అతను చాదర్ఘాట్ సాయిబాబా గుడి ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. దీనిని గుర్తించి కండక్టర్ 108కి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
బండ్లగూడ డిపో వద్ద ఉద్రిక్తత
-
క్షణమొక యుగంగా..!
స్టేషన్ మహబూబ్నగర్, న్యూస్లైన్: ఎదిగివచ్చిన కూతురు తన కళ్లముందే అంతుచిక్కని వ్యాధితో ని త్యం నరకం అనుభవిస్తుంటే ఆ తండ్రి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కూతురును బతికించుకునేందుకు ప డరాని కష్టాలు పడుతున్నాడు. వనపర్తి పట్టణం బం డారునగర్కు చెందిన మఖ్బూల్అలీ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉంది. రెండేళ్ల క్రితం కూతురు సమీనాబేగం(13) ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడిపోయింది. మొదట వైద్యులకు చూపించగా..ఆమె ఆరోగ్యం సా ధారణంగానే ఉంది. ఆ తరువాత కూతురు ఆరోగ్యం క్షీణించడం ఆరంభమై కదల్లేక మంచానికే పరి మితమైంది. వైద్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరి గారు. చివరికి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆ స్పత్రి వైద్యులు సమీనాకు వైద్యపరీక్షలు ని ర్వహించి చాలా అరుదుగా వచ్చే ఎస్ఎస్పీఈ వ్యాధి బారిన పడిందని నిర్ధారించా రు. ఏడేళ్లపాటు మందులు వాడితే వ్యాధి కొంతన యం కావచ్చని, లేకపోతే జీవితాంతం ఇలాగే పడిఉండాల్సి వస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. వ్యా ధికి సరైన చికిత్స లేదని, మందులతోనే జీవితకాలా న్ని పొడగించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు మఖ్బూల్అలీ తెలిపాడు. వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు తన కూతురు వైద్యం కోసం నాలుగులక్షలు ఖ ర్చుచేశానని, ప్రతినెలా మందులకు ఏడువేలు ఖర్చుచేయాలని వస్తుందని వాపోయాడు. తానే బతలేని పరిస్థితుల్లో కూతురు బతికించడం కష్టంగా మారిం దని కన్నీటిపర్యంతమయ్యాడు. రెండు రోజుల క్రితం కూతురును అతికష్టం మీద జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి ఆర్థికసహాయం చేయాలని కలెక్టర్కు వి జ్ఞప్తి చేయగా, ఆయన తక్షణమే స్పందించి వీల్చైర్ సమకూర్చారని తెలిపాడు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏ ర్పాటుచేసి తన ధీనగాథను వివరించాడు. దాతలు ముందుకొచ్చి తన కూతురు ప్రాణాలను కాపాడాల ని ఆయన వేడుకుంటున్నాడు. ఆర్థికసహాయం చేయదలచిన వారు సెల్: 99639 79747, 94413 67086ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.