-
ప్రసూతి సెలవుల దుర్వినియోగంపై విచారణ
కమలాపూర్ : మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పి.సునీత ప్రసూతి సెలవుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణాధికారి, హుజూరాబాద్ డెప్యూటీ ఈవో కట్ల ఆనందం శుక్రవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సునీతపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం జరిపిన విచారణలో ఆమెతో పాటు గతంలో ఇక్కడ ఎంఈవోలుగా పనిచేసిన ఏవీ రమణారెడ్డి్డ, పి.ఝాన్సీలక్ష్మి నుంచి వేర్వేరుగా రాత పూర్వక వివరణలు తీసుకున్నారు. సునిత 2012 నవంబర్ 23 నుంచి 2013 మే 21 వరకు ప్రసూతి సెలవులు వినియోగించుకున్నారు. అయితే ఆమె బోగస్ డెలివరీ సర్టిఫికెట్ సమర్పించి ప్రసూతి సెలవుల దుర్వినియోగానికి పాల్పడి 6 నెలల వేతనం పొందారని, అందుకు అప్పటి జిల్లా విద్యాధికారి లింగయ్య పూర్తిగా సహకరించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించిన నేపథ్యంలో గతేడాది జూన్ 6న జగిత్యాల డెప్యూటీ ఈవో జగన్మోహన్రెడ్డి కమలాపూర్లో విచారణ జరిపారు. సునీత అస్వస్థతకు గురవడంతో విచారణ మధ్యలోనే ఆగిపోయింది. డీఈవో ఆదేశాల మేరకు ప్రసూతి సెలవుల దుర్వినియోగంపై మరోసారి విచారణ జరిపామని, విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయనున్నట్లు విచారణాధికారి తెలిపారు. కార్యక్రమంలో సహాయ విచారణాధికారులు రాంరెడ్డి, భాగ్యవతి, ఎంఈవో రాంకిషన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
చదువుల భారం చేస్తాడట దూరం!
విద్య అనేది విజ్ఞానాన్ని పెంచాలి. కానీ నేటి విద్య... ఒత్తిడిని పెంచుతోంది. వీపు మీద పుస్తకాల బరువును పెంచుతోంది. టెక్స్ట్ బుక్స్ బట్టీ పట్టాలి. వర్క్బుక్కులతో కుస్తీ పట్టాలి. హోమ్వర్కులు, స్లిప్ టెస్టులు... ఉరుకులు, పరుగులు. ఇదీ నేటి విద్యావిధానం. ఒత్తిడి పెంచే ఈ తరహా చదువులు అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఏ ఒక్కరైనా దీనికి పరిష్కారాన్ని ఆలోచించారా? కమలేష్ జపాడియా ఆలోచించాడు. ఓ టీవీ కార్యక్రమం స్ఫూర్తితో మన దేశంలోని విద్యావిధానాన్నే మార్చేయాలని చూస్తున్నాడు. మార్చి తీరుతానని సవాల్ చేస్తున్నాడు. పొద్దున్న పది గంటలకు బడికెళ్లి, మూడింటి వరకూ పాఠాలు విని, ఆపైన ఓ గంట ఆటలాడి, నాలుగింటికి ఇంటికొచ్చేసేవాళ్లు ఒకప్పుడు విద్యార్థులు. కానీ ఇప్పుడు పొద్దున్న ఏడింటికల్లా బడిలో ఉండాలి. సాయంత్రం వరకూ పాఠాలు వింటూనే ఉండాలి. బడి అయ్యాక మళ్లీ అదనపు తరగతులు. ఆడుకోవడానికి ఓ అరగంట సమయం కూడా చిక్కదు. ఇది పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని బాధపడ్డాడు కమలేష్. ఈ పరిస్థితి కారణం వారికి ఏర్పరచిన సిలబస్. ముందు దాన్ని మార్చాలి అనుకున్నాడు. అందుకుగాను ఎవ్వరూ ఊహించని ఓ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. టీవీ షో స్ఫూర్తితో... గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన కమలేష్ జపాడియా (35) ప్రైమరీ స్కూల్ టీచర్. అందరు ఉపాధ్యాయుల్లాగే పిల్లలకు పాఠాలు బోధించినా... అందరిలాగా నేటి విద్యావిధానాన్ని అంగీకరించలేకపోయాడు కమలేష్. చదువుల పేరుతో పిల్లల అందమైన బాల్యాన్ని హరిస్తున్నామంటూ వేదన చెందేవాడు. ఓసారి ‘కౌన్ బనేగా కరోడ్పతి’ చూస్తుండగా ఓ ఆలోచన వచ్చింది. ‘పిల్లల పాఠాలన్నీ ఆ ప్రోగ్రామ్లోలాగా బిట్ ఫార్మేట్లోకి మార్చేస్తే’... అనుకున్నాడు. తన ఆలోచన తనకే గొప్పగా అనిపించింది. కానీ ఇతరులు మాత్రం నవ్వారు. ‘పాఠాలన్నీ బిట్స్లాగా ఎలా మారుస్తాం, అదేమైనా చిన్న పనా’ అంటూ ఎగతాళి చేశారు. కానీ కమలేష్ ఫీలవలేదు. అనుకున్నది చేసి తీరాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. కమలేష్ ఉండే చోట అందుబాటులో ఇంటర్నెట్ లేదు. దాంతో రోజూ ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి ఇంటర్నెట్ కేఫ్కు వెళ్లేవాడు. తన ఆలోచనను అమలు చేసే పనుల్లో మునిగిపోయేవాడు. ఎట్టకేలకు ‘ఎడ్యుసఫర్’ అనే వెబ్సైట్ను రూపొందించాడు. 1 నుంచి 10వ తరగతి వరకూ అన్ని సబ్జెక్టులనూ బిట్స్ రూపంలోకి మార్చేసి, తన వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. వాటిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాడు. త్వరలో ఒక ‘ఆప్’ని కూడా రూపొందించబోతున్నాడు. కమలేష్ పట్టుదల చూసి మొదట నవ్వినవారే ఇప్పుడు శభాష్ అంటున్నారు. అహ్మదాబాద్ ఐఐటీ కమలేష్ వెబ్సైట్ని చూసి ప్రశంసలు కురిపించింది. గుజరాత్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అతడిని సన్మానించింది. అయితే తనకు కావాల్సింది సన్మానాలు, ప్రశంసలు కాదంటాడు కమలేష్. ‘నా మెటీరియల్ని మన దేశంలోని అన్ని పాఠశాలలూ వినియోగించాలి. ఒత్తిడి లేని చదువుని పిల్లలకు అందించిననాడు నా శ్రమకు తగిన ఫలితం దక్కినట్టే’ అంటాడు కమలేష్.నిజమే. కమలేష్ ఆలోచన చాలా గొప్పది. దాన్ని అమలు చేసిన రోజున మన దేశంలోని విద్యా విధానం మారిపోతుంది. చదువుల భారం తగ్గి మన పిల్లల బాల్యమూ వికసిస్తుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement