breaking news
Prices of seeds
-
భారీగా తగ్గిన ‘జీడి పప్పు’ ధర.. కారణం ఇదే..
మలికిపురం: జీడి గింజల ధర భారీగా పతనమైంది. జీడి పప్పు ధర కూడా కేజీకి రూ.100 వరకూ పడిపోయింది. దీంతో వ్యాపారులు, రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజోలు, నరసాపురం నియోజకవర్గాల్లోని సముద్ర తీరంలో జీడిమామిడి సాగు జరుగుతోంది. ఇక్కడ గింజల ఉత్పత్తి చాలా తక్కువే. అయినప్పటికీ.. మలికిపురం మండలం మోరి గ్రామంలో తయారయ్యే జీడి పప్పు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి జీడి పప్పు పరిశ్రమకు విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏజెన్సీ, తెలంగాణ నుంచి కూడా జీడి గింజల దిగుమతి అవుతాయి. దిగుబడి పెరగడమే కారణం ఈ ఏడాది జీడి గింజల ఉత్పత్తి అధికంగా ఉండటమే ధర పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. జీడి తోటలు కాపు మీద ఉన్న సమయంలో అదనంగా వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి పూత పూసి, జీడి గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా గత ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి కావాల్సిన జీడి గింజల ఉత్పత్తి జూన్లో కూడా కొనసాగుతోంది. దీంతో ధర పతనమైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతుల వద్ద 80 కేజీల జీడి గింజల బస్తాను వ్యాపారులు రూ.9,500కు కొనుగోలు చేశారు. ఈ ధర మే నాటికి రూ.7,500కు తగ్గింది. పంట చివరి దశ కావడంతో ధర తగ్గడం సాధారణమే అనుకున్నారు. కానీ.. జీడిచెట్లకు మరోసారి పూత రావడంతో మళ్లీ గింజలు ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం 80 కేజీల జీడి గింజల బస్తా రూ.5 వేలకే లభిస్తోంది. ఇందులో నాణ్యత తక్కువగా ఉండే చివరి రకం జీడి గింజలు రూ.3,500కు కూడా లభిస్తున్నాయి పేరుకుపోయిన నిల్వలు ఈ కారణంగా జీడి పప్పు ధర కూడా గణనీయంగా పడిపోయింది. గత ఏప్రిల్, మే నెలల్లో కేజీ జీడి పప్పు ధర రూ.650 ఉండగా.. ప్రస్తుతం రూ.550కి పడిపోయింది. సంప్రదాయ రీతిలో కాల్చి తయారు చేసిన జీడి పప్పు ధర ఇలా ఉండగా.. ఫ్యాక్టరీల్లో తయారవుతున్న బాయిల్డ్ జీడి పప్పు ధర మరింత దారుణంగా ఏకంగా రూ.450కి తగ్గిపోయింది. సీజన్ మొదలైనప్పుడు ఎక్కువ ధరకు గింజలు కొనుగోలు చేసిన వ్యాపారులు.. తక్కువ ధరకు జీడి పప్పు అమ్మాల్సి రావడంతో ఉత్పత్తి నిలిపివేశారు. ధర లేక, కొనుగోలు చేసి గింజల నుంచి పప్పు ఉత్పత్తి నిలిపివేయడంతో వ్యాపారుల వద్ద.. ఉత్పత్తి పెరిగి, అమ్మకాలు తగ్గడంతో రైతుల వద్ద భారీ స్థాయిలో గింజలు పేరుకుపోయాయి. దీనికితోడు ప్రస్తుతం ఆషాఢం, శూన్య మాసాలు కావడంతో శుభకార్యాలు లేక జీడి పప్పు వినియోగం కూడా తగ్గింది. అన్ సీజన్ మరో రెండు నెలలు కొనసాగనుంది. ఉత్పత్తి మానేశాం ధర పడిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. గత ఏప్రిల్లో 80 కేజీల జీడి గింజల బస్తా రూ.9,500కు కొన్నాం. అప్పట్లో చాలా సరకు నిల్వ చేశాం. ఇప్పుడు రూ.3,500కు కూడా లభిస్తోంది. దీంతో ఉత్పత్తి మానేశాం. – కొడవటి ప్రసాద్, వ్యాపారి, మోరిపోడు ధర నిలకడ లేదు వర్షాలు అధికంగా కురిసి మరోసారి పూత రావడంతో ఈ ఏడాది గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా ధర పడిపోయింది. ఈ సమయంలో పప్పు ఉత్పత్తి చేసి విక్రయించలేం. పైగా రెండు నెలలు శుభకార్యాలుండవు. దీంతో అమ్మకాలు కూడా ఉండవు. – ముప్పర్తి నాని, జీడి గింజల దిగుమతిదారు, మోరిపోడు -
సాగుకు ధరాఘాతం!
నవాబ్పేట్ , న్యూస్లైన్: రైతే దేశానికి వెన్నెముక అంటూ ఎన్నికల సమయంలో వేదికలపై నేతలు ఉపన్యాసాలు దంచేస్తుంటారు. అన్ని రంగాలకంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తామంటూ రైతన్నలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు. అధికారంలోకి రాగానే పాలకులు అన్నదాతలను విస్మరిస్తున్నారు. వారి వెతలను పట్టించుకోవడంలేదు. వ్యవసాయ పెట్టుబడి ఏటికేడు రెట్టింపు అవుతుండడంతో రైతు కుదేలవుతున్నాడు. ఎరువులు, విత్తనాల ధరలను అదుపులో ఉంచాలనే స్పహ ప్రభుత్వాలకు రావ డం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుతూ పోతు న్న ప్రైవేటు ఎరువుల సంస్థలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు దుకాణాల ఎదుట రాత్రీ పగలూ అనే తేడా లేకుండా క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏటా ఇదే తంతు జరుగుతున్నా పాలకులు మాత్రం సకాలంలో ఎరువులను సరఫరా చేయడంలో చిత్తశుద్ధి కనబర్చని దుస్థితి దాపురించింది. గిట్టుబాటు ధరలు లేక, ప్రక తి వైపరీత్యాలతో పం టలు నష్టపోయి అప్పుల బాధతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం సానుభూతి చూపని వారూ ఉన్నారు. పంటలకు నష్టపరిహారం, వృుతుల కుటుంబాలకు నయాపైస ఇప్పించరు. ఇదీ అన్నదాతపై పాలకులు చూపిస్తున్న అవ్యాజప్రేమ. ఎరువులు, విత్తనాల ధరలు పైపైకి... ఎరువులు, విత్తనాల ధరలు అదుపు చేయడంలో పాలకులు నిర్లక్షం వహించడంతో రైతన్నలపై ఆర్థిక భారం పెరిగింది. ఓవైపు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న రైతులకు పంటల ఉత్పత్తికి ప్రాణదాత లైన ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడం అదనపు భారంగా భరిస్తున్నారు. నాలుగేళు ్లగా నిత్యం పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు కంటతడిపెట్టిస్తున్నాయి. ఎరువులపై ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ తగ్గింపులో భాగంగా ఎరువుల కంపెనీలపై నియంత్రణ ఎత్తివేసింది. పరిస్థితులను బట్టి ధరలను పెంచుకునే వెసులుబాటును కంపెనీలకు కల్పించింది. దీంతో కంపెనీలు అడ్డు, అదుపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను సాకుగా చూపుతూ ప్రతిసారి భారీగా ఎరువుల ధరలను పెంచుతూ పోతున్నాయి. ఇక విత్తన కంపెనీలదీ ఇదే బాట.