breaking news
The prevention of road traffic accidents
-
జాతీయ రహదారులపై మద్యం షాపులు వద్దు
హెల్మెట్ధారణ తప్పనిసరి 15 రోజుల్లో కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించండి 108 వాహనం వచ్చే సమయాన్ని తగ్గించాలి రోడ్డు భద్రతా సమావేశంలో కలెక్టర్ కీలక నిర్ణయాలు విజయవాడ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను కొనసాగించరాదని ఎక్సైజ్ అధికారులను కోరుతూ జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం తీర్మానించింది. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని ముఖ్య అధికారుల బృందం ఎట్టి పరిస్థితిలోనూ జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు మూసి వేయించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. కీలక నిర్ణయాలివే.. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ టోల్గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ల ద్వారా డ్రైవర్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదం సంభవించిన సందర్భంలో 108 వాహనం ప్రమాద స్థలాన్ని చేరుకునే సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని, తద్వారా మరణాలను తగ్గించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ధారణ తప్పనిసరని ఆదేశించారు. నీటిపారుదల శాఖ కాలువలు, కరకట్టలపై ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. సంబంధిత వ్యక్తులకు ముందుగా నోటీసులు జారీచేసి 15 రోజుల వ్యవధిలో వాటిని తొలగించాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతకు సంబంధించి 18 అంశాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి పంపించామన్నారు. వాహనాదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు అతిక్రమించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. నగరంలో 62 ముఖ్య కూడళ్లను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉప రవాణా కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆటో, స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లకు ఈ నెల, వచ్చే నెలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్కుమార్, అడిషనల్ ఎస్పీ సాగర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శేషుకుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రామకృష్ణ, రవాణా అధికారులు పాల్గొన్నారు. -
క్రైం.. కలవరం
అభివృద్ధితో పాటే కొత్తూరులో పెరుగుతున్న నేరాలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోని చర్యలు గతంతో పోలిస్తే రెట్టింపు కేసులు కొత్తూరు: రాజధానికి అతిచేరువలో అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు మండలం అభివృద్ధితో పాటు క్రైం రికార్డులో కూడా ముందంజలో ఉంది. నేరాలు, ప్రమాదాలు, దొంగతనాలు పెరిగిపోతున్నా యి. వీటి నివారణ కోసం పోలీసులు ఎంతకృషిచేస్తున్నా తగ్గడం లేదు. గతేడాది వివిధ సంఘటనలకు సంబంధించి 247 కేసులు నమోదవగా, ఈ ఏడాది 350 కేసులు నమోదైనట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నారు. మండల పరిధిలో హత్యల పరంపర కొనసాగుతోంది. ఒకప్పుడు గొడవలు పడితే పెద్దల సమక్షంలో పంచాయతీల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే వారు. కాగా, రియల్భూమ్ కారణంగా జల్సాలకు అలవాటుపడి కక్షలు పెంచుకుంటున్నారు. గతేడాది జరిగిన నాలుగు హత్యలను పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది జరిగిన ఏడు హత్యకేసుల్లో ఆరింటిని ఛేదించారు. కాగా, ఈ హత్యలు చిన్న చిన్న కారణాలతోనే జరుగుతున్నట్లు క్రైం రికార్డు చెబుతోంది. మండలంలో ఇటీవల కాలంలో హైదరాబాద్ తరహాలో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. దుకాణాల ముందు, ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలను కొట్టేస్తున్నారు. ఈ ఏడాది జవనరి నుండి ఇప్పటివరకు 34 దొంగతనాలు జరిగాయి. సుమారు రూ.15.46లక్షల వస్తువులు, నగలను దోచుకెళ్లారు. పోలీసుల దర్యాప్తులో సుమారు రూ.11.40లక్షలను రికవరీ చేసి దొంగలను రిమాండ్కు తరలించారు. రోడ్డు ప్రమాదాలూ ఎక్కువే కొత్తూరు మండల కేంద్రం నుండి షాద్నగర్ సమీపంలోని సోలీపూర్ గేటు వరకు సుమారు 18 కి.మీ మేర బైపాస్రోడ్డును ఏర్పాటుచేశారు. ఈ రోడ్డు విశాలంగా ఉండడంతో వాహనాలు గంటకు 100 నుండి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటాయి. కాగా పలు కూడళ్ల వద్ద అండర్పాస్లను నిర్మించడం మాత్రం మరి చారు. ఈ కూడళ్ల వద్ద రెప్పపాటులో ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోవ డం పరిపాటిగా మారింది. గతేడాది జనవరి నుండి డిసెంబర్ వరకు జరిగిన 67 ప్రమాదాల్లో 44 మంది వాహనదారులు మృతిచెందగా, 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుండి డిసెంబర్ వరకు కేవలం కొత్తూరు మండలం పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డుపై 84 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 56 మంది మృతిచెందగా, 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీటితో పాటు చిన్నచిన్న ఘటనలు మరెన్నో ఉన్నాయి. పెరిగిన ఆత్మహత్యలు ఆత్మహత్యల సంఖ్య చాలా కూడా ఆందోళనకరంగా ఉంది. అమ్మానాన్నలు తిట్టారని, భార్య కాపురానికి రాలేదని, భర్త కొట్టాడనే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 53 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రజల్లో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించడానికి ఇటీవల మండల కేంద్రంలో ఎస్పీ విశ్వప్రసాద్ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది ఎంతమేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అదుపునకు చర్యలు నియోజకవర్గ జనాభా రోజురోజుకు పెరుగుతోంది. దానికి తోడు పట్టణం కూడా విస్తరించింది. దీంతో నేరాలు సైతం పెరుగుతున్నాయి. వాటిని అదుపు చయడానికి రాత్రిళ్ళు గస్తీ పెంచడంతో పాటు సిబ్బందిని కూడా పెంచాం. - ద్రోణాచార్యులు, డీఎస్పీ