-
ఇదో కొత్త శత్రువు.. జాగ్రత్తే మందు!
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వైరస్ మానవాళి పాలిట కొత్త శత్రువు. ఇది మళ్లీ మళ్లీ దాడిచేసే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటూ అది సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారం. దీని నుంచి రక్షణకు ఎలాంటి వ్యాక్సిన్లు, మందులు సిద్ధంగా లేవు. అందరిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడిది కొంత తగ్గుముఖం పట్టినా, ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుని విజృంభించే వైరస్ కాబట్టి మళ్లీ చలికాలంలో పెరిగే అవకాశాలున్నాయి. గతంలో స్వైన్ఫ్లూ కేసులు కూడా కొంతమేర తగ్గి చలికాలంలో విజృంభించిన విషయం అందరూ గుర్తుంచుకోవాలి’ అని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డైరెక్టర్ ఆఫ్ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ విశ్వనాథ్ గెల్లా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలపై ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. జీవనశైలి మారాల్సిందే.. కరోనా వైరస్ వ్యాప్తి ఎవరిలో ఎలా మారుతుంది? ఏ పరిస్థితుల్లో ఎలా పరివర్తనం చెందుతుంది? మళ్లీ ఏ రూపాన్ని సంతరించుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. కాబట్టి కచ్చితమైన శుభ్రతా చర్యలు, ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం ద్వారానే ›ప్రస్తుత స్థితిని ఎదుర్కోగలం. ప్రస్తుతం లాక్డౌన్ పటిష్టంగా అమలవుతూ మంచి ఫలితాలే వచ్చాయి. క్లస్టర్ కేసులు పెరగకపోవడం, కమ్యూనిటీ స్ప్రెడ్ లేకపోవడం వంటివి కలిసొచ్చే అంశాలు. మరో మూడు వారాల పాటు లాక్డౌన్ను కచ్చితంగా అమలుచేస్తే కొత్త కేసుల నియంత్రణతో పాటు వైరస్ విస్తరించకుండా చూడొచ్చు. లాక్డౌన్ ఎత్తేశాక కూడా వ్యక్తిగత శుభ్రత, ముందు జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా పాటించాల్సిందే. ముఖ్య ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, ఆఫీసుల్లో సిక్రూమ్ల ఏర్పాటు వంటివి తప్పనిసరి. ప్రజారవాణా వ్యవస్థలో, ప్రజలు ఎక్కువగా తిరిగేచోట్ల ఆరోగ్య చర్యలు అమలు చేయాలి. దగ్గు, జలుబు ఇతర లక్షణాలున్న వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలి. ఆఫీసులు, స్కూళ్లు, మాల్స్ ఇతర చోట్ల శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాలి. డిఫెన్సివ్గా ఉండటమే మార్గం శత్రువెవరో తెలిస్తే యుద్ధం చేయడం, ఎదుర్కోవడం సులువవుతుంది. కరోనా వైరస్ మన పాలిట కొత్త శత్రువు. ఎలా వ్యాపిస్తుందో? ఎలా విస్తరిస్తుందో? ఇంకా తెలియదు. కాబట్టి మన ఆరోగ్యానికిది శక్తివంతమైన ప్రత్యర్థి. జాగ్రత్తలు పాటించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు పాటిస్తూ డిఫెన్సివ్గా వ్యవహరించడం ఒక్కటే మార్గం. ఆ దేశాల్లో ఎందుకంత ప్రభావం? అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు, ఆధునిక సౌకర్యాలున్న చోటే ఎక్కువ పాజిటివ్ కేసులు, అధిక మరణాలు నమోదు అవుతున్నాయి. కొత్త రూపంలో వచ్చిన కరోనా వైరస్ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఎవరికీ లేకపోవడం ఒక కారణం. జాగ్రత్తలు తీసుకోకపోవడం, లాక్డౌన్ను సరిగా అమలు చేయకపోవడం, ఏమీ కాదనే నిర్లక్ష్యంతో పార్టీయింగ్, హాలిడేయింగ్ చేయడం ఆ దేశాల్లో వ్యాప్తికి ముఖ్య కారణం. 1918లోనూ లాక్డౌన్తో మంచి ఫలితాలు వందేళ్ల క్రితం ప్రపంచాన్ని స్పానిష్ మహమ్మారి కుదిపేసింది. ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా, సెయింట్ లూయిస్..ఇలా ఒక్కో రాష్ట్రంపై ఒక్కోలా ప్రభావం చూపింది. అప్పుడు కూడా 20 రోజుల ఆలస్యంగా లాక్డౌన్ ప్రకటించిన సెయింట్ లూయిస్లోని ప్రజలపై ఎక్కువ ప్రభావం పడి అధికసంఖ్యలో మరణించారు. ముందుగా లాక్డౌన్ ప్రకటించిన ఫిలడెల్ఫియాలో మంచి ఫలితాలొచ్చాయి. వైరస్కు చావు లేదు! కొన్ని కేసుల్లో వైరస్ పూర్తిగా నిర్మూలన అవుతున్న దాఖలాల్లేవు. 14 రోజుల తర్వాత రెస్పిరేటరీకి సంబంధించిన శాంపిల్స్ తీసుకున్నాక, ఆ పేషంట్లలో 30–35 రోజుల తర్వాత మోషన్లో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి శరీరంలో వైరస్ పూర్తిగా నిర్మూలన కాలేదని తేలుతోంది. అందువల్ల ఈ వైరస్ మళ్లీ మరోరూపంలో మ్యుటేట్ కావడం, జంతువుల ద్వారా ఇతరత్రా రూపాల్లో పరిభ్రమిస్తున్నందున మళ్లీ ఎప్పుడో అప్పుడు వెలుగుచూసే అవకాశాలే ఎక్కువ. వైరస్ అనేది వందేళ్లకోసారి కొత్తరూపం తీసుకోవడం, మ్యుటేట్ కావడం జరుగుతోంది. మనకేం కాదనుకోవద్దు! ⇒ కరోనా వైరస్ నుంచి రక్షణకు మందమైన బట్టతో కుట్టిన క్లాత్ మాస్క్లు ఉత్తమం. ఒక్కొక్కరు 3–4 కుట్టించుకుని, వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. కొన్నిరోజుల వరకే కాకుండా దీర్ఘకాలం పాటు వైరస్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. క్లాథ్ మాస్కులు అందుబాటులో లేకపోతే పెద్ద కర్చీఫ్ను 3–4 మడతలు చేసి నోటికి అడ్డంగా కట్టుకోవాలి. ⇒ మద్యపానం, పొగతాగే అలవాటున్న వారు వెంటనే మానేయడం మంచిది. అందుకిదే సరైన సమయం. వీరిపై కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ⇒ వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. తక్కువలో తక్కువ అరగంట చేయాలి. ఇంట్లోనే నడక, యోగా, ప్రాణాయామం, బ్రీథింగ్ ఎక్సర్సైజులు, ఏరోబిక్స్, రెస్పిరేటరీ ఇమ్యూనిటీ వచ్చేవి చేయాలి. వాకింగ్, స్లోజాగింగ్, ఇతర వ్యాయామాలు దినచర్యలో భాగం కావాలి. ⇒ ‘మనకేం కాదు. ఆరోగ్యంగా ఉన్నామ’నే భావన వీడాలి. యువత, మధ్యవయస్కులకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండి వైరస్ను తట్టుకున్నా.. వారిళ్లలోని పెద్దలు, ఇతరులకు దీనిని అంటిస్తే, హృద్రోగులు, డయాబెటిస్, ఇతర వ్యాధులున్న వారికి ప్రాణాంతకంగా మారుతుంది. ⇒ డాక్టర్లకే పరిమితం కాకుండా నర్సులు, పారామెడికల్, ఇతర సిబ్బంది మొదలు అందరికీ కరోనాపై జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి వరకు మరింత అవగాహన కలిగించాలి. -
కరెంటు ‘కాటే’స్తోంది!
ప్రమాదాల బారిన రైతన్నలు, మూగజీవాలు పట్టించుకోని ట్రాన్స్కో అధికారులు వానకాలంలో మరింత ప్రమాదం జిల్లాలో ఏటా పెరుగుతున్న దుర్ఘటనలు సిద్దిపేట రూరల్: వర్షాకాలంలో ఇళ్లు, పొలాలు, బావుల వద్ద విద్యుత్తు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. జిల్లాలో ఏడాదిన్నరలో విద్యుదాఘాతాలతో రైతులు, సామాన్యులతో పాటు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వర్షకాలంలో దాదాపు అన్ని నేలలు తేమతో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా, ట్రాన్స్ఫార్మర్లు ఇతర పరికరాల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాప్రాయం తప్పదు. విద్యుత్ విషయంలో అధికారుల తప్పిదంతో కొన్ని సంఘటనలు జరిగితే మరికొన్ని అవగాహన లేకపోవడం వల్ల చేసుకుంటున్నాయి. నష్టపరిహారం కొంతే.. జిల్లాలో 2015 సంవత్సరంలో 123 మంది విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఇందులో ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, ఇందులో సగానికి పైగా రైతులు ఉన్నారు. అదేవిధంగా 41 పశువులు మృత్యువాత పడ్డాయి. 2016 జూలై 30 వరకు 32 మంది రైతులతో పాటు సామాన్యులు మృతి చెందారు. 70 పశువులు మృత్యువాత పడ్డాయి. వీటిలో గత ఏడాది 47 మందికి ఎక్స్గ్రేషియా కింద రూ.2 లక్షల చొప్పున, 35 పశువులకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం అందించారు. ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నస్టపరిహారం పెంచడంతో ఏడుగురికి రూ.4 లక్షల చొప్పున, 32 పశువులకు రూ.40 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా కరెంట్షాక్కు ఎక్కువగా రైతులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వారికి ఎలాంటి సూచనలు, సలహాలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రైతన్న తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు పెద్దశంకరంపేట మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎర్ర సాయిలు ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్లు సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మెదక్ మండలం రాజ్పల్లిలో బుచ్చ దయాకర్ అనే రైతు పొలం వద్ద విద్యుత్తు తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కౌడిపల్లి మండలం చిలిప్చెడ్ గ్రామ రైతు కలాలి దశరథ్గౌడ్ వ్యవసాయ బోరు మోటార్ బాగు చేస్తూ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. జిన్నారం మండలం జంగంపేటలో గుండా శంకరయ్య రైతుకు చెందిన రెండు పాడి గేదెలు కరెంట్ షాక్తో మృత్యువాత పడ్డాయి. శివ్వంపేట మండలం లింగోజి తండాకు చెందిన నెనావత్ బిక్యా కాడెడ్లు మేత మేస్తూ విద్యుత్తు షాక్తో మృతి చెందాయి. ఎర్తింగ్ లేకపోవడంతో... విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్ లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటిని ఏర్పాటు చేసినప్పుడు కాంట్రాక్టర్లు అవసరమైనంత లోతుగా గుంతలు తీయకపోవడం, నాణ్యమైన పైపులు వేయకపోవడం, ఉప్పు, బొగ్గు లాంటి ముడిపదార్ధాలు సరైన మోతాదులో వేయకపోవడంతో ఎర్తింగ్ వస్తుంటుంది. అంతేకాకుండా నాణ్యత లేకుండా ఎర్తింగ్ చేయడంతో భూమిలో తేమశాతం ఉన్నంత మాత్రమే అది పనిచేస్తుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి రైతులు ఐఎస్ఐ మోటార్లు మాత్రమే వాడాలి మోటార్ పనిచేయకపోతే చేత్తో పట్టుకోకుండా జాగ్రత్త పడాలి టెస్టర్ సహాయంతో మోటార్ను పరీక్షించాలి ప్రధానంగా మోటార్లకు కప్పులు ఉంచడం మంచింది ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలి. మోటార్కు మరమ్మతులు చేయాల్సి ఉంటే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి ప్యూజ్ బ్యాక్స్లు, స్టార్టర్లు అన్ చేసే చోట నీరు, బురద లేకుండా చూసుకోవాలి స్టార్టర్ను పంప్సెట్ దగ్గరలో పొడిగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. స్టార్టర్కు రక్షణ కవచాలు ఉండాలి ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేయాల్సినప్పడు విద్యుత్తు సిబ్బందికి తెలియజేయాలి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ పోయినప్పడు, తీగలు తెగినప్పడు రిపేర్ల కోసం ఎయిర్ బ్రేక్(ఏబీ) స్విచ్ ద్వారా సరఫరా నిలిపివేయాలి అప్రమత్తంగా ఉండాలి వర్షాకాలంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టర్ డబ్బాలు నాణ్యమైనవి వాడాలి. వాటిని తెరిచే ముందు జాగ్రత్తలు పాటించాలి. రైతులు విద్యుత్తు పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా లైన్మన్లకు సమాచారం ఇవ్వాలి. - పండరి నాయక్, ఏడీఈ, ట్రాన్స్కో సిద్దిపేట
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement