breaking news
pragathi maidhan
-
ఆటో ఎక్స్పో 2020: కంపెనీలు డుమ్మా
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దీర్ఘకాలిక మందగమనం రానున్న ఆటో ఎక్స్పోపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో అట్టహాసంగా జరగనున్న ఈ ఎక్స్పోలో దేశీయ కంపెనీలతోపాటు, డజనుకుపైగా కంపెనీలు పాలు పంచుకోవడం లేదు. మరోవైపు ఆటో ఎక్స్పో 2020 లో పాల్గొనకపోడానికి ఆయా కంపెనీలకు వారి వారి సొంత కారణాలున్నప్పటికీ, ఈవెంట్ విజయవంతమవుతుందని పరిశ్రమల బాడీ సియామ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టీవీఎస్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ లిమిటెడ్, ఆడి, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, నిస్సాన్, అశోక్ లేలాండ్ వంటి తోపాటు సహా డజనుకు పైగా వాహన తయారీదారులు ఆటోఎక్స్పో-2020 కు దూరంగా ఉండనున్నాయి. వీటితోపాటు రాయల్ ఎన్ఫీల్డ్, హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్ మోటార్ సైకిల్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, భారత్ బెంజ్, వోల్వో కార్స్ ఇండియా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఈవెంట్కు గతంలో కూడా డుమ్మాకొట్టాయి. మరోవైపు ఈ లోటును తొలిసారిగా ఈ ఎక్స్పోలో పాలుపంచుకుంటున్నఎంజీ మోటార్, గ్రేట్ హవల్ మోటార్స్తో పాటు ఫోర్స్ మోటార్స్, అథర్ ఎనర్జీతోపాటు అనేక ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్లు భర్తీ చేయనున్నాయి. అయితే ఆటో ఎక్స్పోతో ఆటోమొబైల్ రంగం మందగమనం నుంచి గట్టెక్కుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఆశాభావం వ్యక్తం చేసింది. దేశీయంగా కొన్ని కంపెనీలు పాల్గొనకపోవచ్చు, దీనికి వారి సొంత కారణాలు వుండవచ్చు కానీ కొత్తగా వచ్చిన వారి ప్రభావం వుంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆటో షోల సంఖ్య కూడా తగ్గుతోందనీ, ఫ్రాంక్ఫర్ట్, టోక్యో వంటి దేశాల్లో కూడా కంపెనీల భాగస్వామ్యం తగ్గిందనీ, దీంతో పాటు మందగమనం, ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకొని ఒకదశలో ఈవెంట్ను ఒక సంవత్సరం వాయిదా వేయాలని కూడా ఆలోచించామనీ ఈవెంట్ నిర్వాహకుడు సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా చెప్పారు. ఏప్రిల్ 2020 నుంచి అమలుకానున్న బీఎస్-6 కొత్త ఉద్గార నిబంధనలు కూడా ప్రభావం చూపనున్నాయని తెలిపారు. 15వ ఎడిషన్గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 12 వరకూ జరగనున్న ఈ ఎక్స్పో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్పోలలో ఒకటిగా నిలవనుందని అంచనా. దేశ రాజధాని ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోఉన్న గ్రేటర్ నోయిడా వద్ద 235,000 చదరపు మీటర్ల స్థలంతో 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్నారు. సుమారు 60కి పైగా కొత్త వాహనాలు విడుదల అవుతాయని, రోజుకు లక్ష మంది సందర్శకులు రావచ్చని సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగాటో సేన్ భావిస్తున్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు వరుసగా 9 మాసాల్లో క్షీణతను నమోదు చేశాయి. దీంతో మారుతి సుజుకి, ఆశోక్ లేలాండ్ కంపెనీలు ఉత్పత్తిలో కోత పెట్టాయి. తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేసాయి. అలాగే వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ప్రభావం ఆటో పరిశ్రమల విడిభాగాల కంపెనీలపై కూడా తీవ్రంగా పడింది. దీంతో లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు పరిశ్రమల వాల్యూమ్ దాదాపు 16 శాతం క్షీణించింది. ప్రయాణీకుల వాహనాలు 18 శాతం, వాణిజ్య వాహనాలు 22 శాతం, ద్విచక్ర వాహనాల 15.7 శాతం క్షీణించడం ఆటో పరిశ్రమలో సంక్షోభానికి ప్రధాన కారణం. ఆటో ఎక్స్ పో-2018( ఫైల్ ఫోటో) -
‘ప్రగతి’ మైదాన్..
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య మేళాకు నగరం సిద్ధమవుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ మేళా కోసం ప్రగతిమైదాన్లో ప్రత్యేకంగా పార్కింగ్, మెట్రో టోకెన్ కౌం టర్లు, భద్రత తదితర సన్నాహాలు చేస్తున్నారు. మేళాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. దేశ విదేశాలకు చెందిన ఆరు వేల మంది ఎగ్జిబిటర్లు మేళాలో పాల్గొననున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ తమ రంగాలలో సాధించిన ప్రగతిని ఇందులో ప్రదర్శిస్తాయి. భాగ స్వామ్య దేశ హోదాలో జపాన్, భాగస్వామ్య రాష్ట్ర హోదాలో బీహార్ ఈ మేళాలో పాల్గొం టున్నాయి. దక్షిణాఫ్రికా వరుసగా ఫోకస్ కంట్రీ హోదాతో మేళాలో పాల్గొననుంది. మేళా మొదటి ఐదు రోజులు వాణిజ్య సందర్శకులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. నవంబర్ 19 నుంచి సామాన్యులకు కూడా మేళాలో ప్రవేశం ఉంటుంది. భాగస్వామ్య రాష్ట్రంగా మేళాలో కీలక స్థానాన్ని ఆక్రమించిన బీహార్ పెవిలియన్ ముందుభాగాన్ని సబో ర్ చారిత్రాత్మక వ్యవసాయ విశ్వవిద్యాలయం నమూనాలో తీర్చిదిద్దుతారు. బీహార్ వంటకాల రుచులను అందించేందుకు ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటుచేస్తున్నారు. నవంబర్ 22న బీహార్ డే గా పాటిస్తారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ సంవత్సరం మేళాలో పాల్గొనే విదేశీ ఎగ్జిబిటర్ల సంఖ్య తగ్గిందని మేళాను నిర్వహించే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) చైర్పర్సన్ రీటా మీనన్ తెలిపారు. ఈ ఏడాది 21 దేశాలకు చెందిన 260 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని ఆమె చెప్పారు. గత ఏడాది మేళాలో 427 మంది విదేశీ ఎగ్జిబిటర్లు పాల్గొన్నారని ఆమె వివరించారు. యూఎస్, శ్రీలంక, బ ంగ్లాదేశ్ మేళాలో పాల్గొనడం లేదు, దేశీ ఎగ్జిబిటర్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎగ్జిబిషన్ కంపెనీలు, 30 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు వాటి ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సుమారు 5,700 స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నాయని ఆమె వివరించారు. గ్రామీణాభివద్ధి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసే కాపార్ట్ పెవిలియన్ దేశం నలుమూలల నుంచి వచ్చిన 800 గ్రామీణ వృత్తి నిపుణులకు వేదిక కానుంది. మేళా సందర్శనకు వచ్చే వారినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు పెద్దలకు రూ.50 , పిల్లలకు రూ. 30 వసూలు చేస్తారు. శని, ఆదివారాలు,సెలవు దినాల్లో మాత్రం పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.50 ప్రవేశరుసుముగా వసూలు చేయనున్నారు. ఉద యం 9.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మేళాలో ప్రవేశించవచ్చు.