breaking news
posts bharti
-
యువతకు భరోసా
నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న జగన్ వయో పరిమితి ఒకసారి 40 ఏళ్లకు పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీ గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకమే కారణం సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయని వైనం రోశయ్య, కిరణ్ ఇద్దరి హయాంలోనూ అంతే అర్హతలున్నా పోటీ పడలేకపోయిన వారందరో వారికి న్యాయమైన అవకాశం దక్కాలంటున్న జగన్ వయసే అడ్డంకి కారాదన్నదే ఆయన ఉద్దేశం మూడుసార్లు వయో పరిమితిని పెంచిన వైఎస్ రెండుసార్లు నాలుగేళ్ల చొప్పున, ఒకసారి ఐదేళ్లు బాబు హయాంలో నోటిఫికేషన్లే అరకొర దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకు ముందు, తరవాత ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో అక్షరాలా ఆటలాడుకున్నాయి. ఉద్యోగులను నిరంతరం చెండుకు తిన్న చంద్రబాబు, తన పాలనలో ఎప్పుడూ గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల భర్తీని పట్టించుకున్న పాపాన పోలేదు! తొమ్మిదేళ్లు పాలించి కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా కనీసం 100 ఉద్యోగాలైనా భర్తీ చేయని ఘనుడు బాబు! ఇక వైఎస్ అనంతరం సీఎంగిరీ చేసిన రోశయ్యదీ అదే తీరు. ప్రభుత్వపరంగా బోలెడన్ని ఖాళీలున్నా భర్తీ మాటే తలపెట్టకుండా మీనమేషాలు లెక్కింపుతోనే కాలం గడిపి గద్దె దిగారాయన. తర్వాత వచ్చిన కిరణ్కుమార్రెడ్డి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితిని కేవలం రెండేళ్లు పెంచడంతో సరిపట్టారు. ఇలా వారిద్దరూ బాబుకు తీసిపోని తీరుతో లక్షలాది మంది ఆశావహ యువతీ యువకుల ఉసురు పోసుకున్నారు. అందుకే... వైఎస్ స్వర్ణయుగాన్ని తిరిగి తీసకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల ఆవేదనను తండ్రి మాదిరిగానే పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. వైఎస్ తదనంతరం గడచిన ఐదేళ్లలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భావించారు. అధికారంలోకి వచ్చాక ఒకసారి వయో పరిమితిని 40 ఏళ్లకు పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చారు. నిరుద్యోగుల ఆవేదనను దివంగత వైఎస్ సానుభూతితో అర్థం చేసుకున్నారు. అందుకే మూడుసార్లు గరిష్ట వయోపరిమితిని నాలుగేళ్లు, ఐదేళ్లు పెంచారు. బాబు 2003లో కేవలం ఎన్నికలపై దృష్టితో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇచ్చినా గరిష్ట వయో పరిమితిని మాత్రం పెంచలేదు. కాని వైఎస్ అలా కాదు. 2004లో అధికారంలోకి రాగానే దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటిదాకా పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాని వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని గరిష్ట వయోపరిమితిని నాలుగేళ్లు సడలించి మరీ పోస్టులను భర్తీ చేశారు. తరవాత 2007లో మరోసారి నాలుగేళ్లు, ఇక 2008లో ఏకంగా ఐదేళ్ల పాటు గరిష్ట వయో పరిమితిని సడలించిన ఘనత వైఎస్దే. చంద్రబాబు పాలనలో... 1. ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లు పెద్దగా లేవు 2. {Vూపు-1, గ్రూపు-2 వంటి నోటిఫకేషన్లు అంతంతే 3. 9 ఏళ్ల పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు తక్కువే. ఏపీసీఎస్సీ ద్వారా కనీసం ఏటా 100 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు 4. నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి పెంపును ఏనాడూ పట్టించుకోలేదు 5. 2003లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చినా ఆ పోస్టులను భర్తీ చేయలేదు వైఎస్ పాలనలో... 1.2004లో అధికారంలోకి రాగానే బాబు ఇచ్చిన నోటిఫికేషన్కు మరిన్ని ఖాళీలను కలిపి మరో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు 2. అప్పటిదాకా పెద్దగా నోటిఫికేషన్లు జారీ కాని దృష్ట్యా వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు కోరారు గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన స్తంభించి ఏటా రిక్రూట్మెంట్ జరగనందున, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు (వన్టైమ్) పెంచుతాం. మిగతా వర్గాలకు కూడా తదనుగుణంగా వయోపరిమితిని (వన్టైమ్) పెంచుతాం. ఏపీపీఎస్సీని సమూలంగా తీర్చిదిద్దుతాం. క్యాలెండర్ రూపొందించి ఏటా ఉద్యోగ నియామకాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేపడతాం. వయోపరిమితి పెంపు ఎందుకంటే... 1. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతి 100 ఖాళీల్లో 66 శాతం పోస్టులను యూపీఎస్సీ, ఎస్ఎస్సీల ద్వారా... 33 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. పైగా ఖాళీలను ఎప్పటికప్పుడు ఏటా భర్తీ చేస్తున్నారు 2. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధం. ఇక్కడ ఏకంగా 66 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా, కేవలం 33 శాతాన్ని మాత్రమే డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అది కూడా అరకొరగా, నాలుగైదేళ్లకోసారి మాత్రమే. అందుకే వయో పరిమితి సమస్య తలెత్తుతోంది 3. ఇక యూనిఫామ్ పోస్టులై న ఐపీఎస్కు జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 30 ఏళ్లుగా, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లుగా కేంద్రం నిర్ణయించింది 4. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీఎస్పీ (సివిల్, జైల్స్) పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్ల వయో పరిమితిని నిర్ధారించింది 5.అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, ఎక్సైజ్ ఎస్ఐల కైతే జనరల్కు 26 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 31 ఏళ్లుగా నిర్దేశించింది. -
వెక్కిరిస్తున్న ‘రెవెన్యూ’ ఖాళీలు
=పదోన్నతుల జాబితా సిద్ధంగా ఉన్నా పట్టని ఉన్నతాధికారులు =డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు =నత్తనడకన పంటల పరిహారం, ఓటర్ల జాబితా సవరణ కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లా రెవెన్యూ శాఖలోని కీలక విభాగాల్లో కొంత కాలంగా పైళ్ల కదలిక మందగించింది. వివిధ కార్యాలయాలు, విభాగాల నుంచి ఉన్నతాధికారుల ఆమోదం కోసం కలెక్టరేట్కు వెళ్లిన ఫైల్ ఎన్నాళ్లకు తిరిగొస్తుందో తెలియని అయోమయస్థితి నెలకొంది. ఉద్యోగులకు సంబందించిన విషయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బంది అధికారులకు సరైన సమాచారం ఇవ్వడం లేదా... నిర్ణయం తీసుకునే విషయంలో అధికారులు ఆలోచిస్తున్నారా అనేది తెలియరావడం లేదు. ఏది ఏమైనప్పటికీ ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే పలు నిర్ణయాల వల్ల ఫైళ్ల కదలికలో ఏర్పడుతున్న జాప్యం పరిపాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లా అధికారుల చేతుల్లోనే ఉన్నా... జిల్లాలో సుమారు 20 మంది తహసీల్దార్లకు ఇటీవల స్థానచలనం కల్పించారు. వీరిలో సుమారు ఎనిమిది వరకు అఫీషియోటింగ్ ద్వారా తహసీల్దార్లుగా వెళ్లారు. అంటే ఒకచోట డిప్యూటీ తహసీల్దార్ హోదాలో పనిచేస్తున్న వారిని అవసరాలు, ఉద్యోగుల సామర్థ్యాన్ని బట్టి తహసీల్దార్లుగా అవకాశం కల్పించారు. ఇలా డీటీలు తహసీల్దార్లుగా వెళ్లడంతో దాదాపు 12 వరకు డీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈక్రమంలో సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించి డీటీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సీసీఎల్ఏ నుంచి వచ్చే ప్రో డీటీలతో కొన్ని భర్తీ చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండో దానికి ఎలాగూ ఇప్పట్లో అవకాశం లేదు కనక.. అర్హులైన సీనియర్లకు డీటీలుగా పదోన్నతి ఇవ్వడం మాత్రమే చేయాల్సి ఉంటుంది. పరిపాలనాపరంగా సమస్యలు తీరాలంటే చేయాల్సిన ఈ పని జిల్లా అధికారుల పరిధిలోనే ఉంటుంది. అధికారులు తలుచుకుంటే సిద్ధంగానే ఉన్న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు పరిశీలించడం, ఆ తర్వాత తుది జాబితాకు ఆమోదం తెలిపి పోస్టింగ్ ఇవ్వడం... ఒకదాని వెంట ఒకటి జరిపోగాయి. కానీ జిల్లాలో మాత్రం నెలల తరబడి ఇందుకు సంబంధించి ఫైళ్లు పెండింగ్లో ఉండడం వల్ల సహజంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికప్పుడు అధికారులు పదోన్నతుల ఫైల్ కదిపితే కనీసం ఎనిమిది నుంచి పది మంది సీనియర్ సహాయకులకు డీటీలుగా పదోన్నతి వచ్చే అవకాశముం డగా, ఆ వెంటనే ఖాళీలు కూడా భర్తీ అవుతాయి. కానీ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో డీటీల ఖాళీలు డీటీల పదోన్నతులు, తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక ఆత్మకూరు, ధర్మసాగర్, గీసుకొండ, పరకాల, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడ, ఏటూరునాగారం(సీఎస్), వరంగల్(సీఎస్) వంటి చోట్ల సూపరింటెండెంట్, ఎన్నికల డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్సారెస్పీ, తాడ్వాయిలో కూడా డీటీ పోస్టులు ఖాళీగా ఉండగా, ఎస్డీసీ ఏటూరునాగారం వంటి చోట్ల డీటీలు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. అయితే, ఇందులో తాడ్వాయి డీటీగా చెన్నయ్యను ఇటీవలే నియమించారు. మేడారం జాతర ముంచుకొస్తున్న సమయంలో విమర్శలు వస్తాయనే ఈ పోస్టును భర్తీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, మరికొందరు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి ఆర్జీలను పరిగణనలోకి తీసుకుంటారా, లేదా అన్నది ఉన్నతాధికారుల విస్తృత అధికారాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ పరిపాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డీటీ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కీలక సమయంలో... ప్రస్తుతం ఒకవైపు రైతులు పంట నష్టానికి సంబంధించి పరిహారం ఖరారు, చెల్లింపుతో పాటు ధాన్యం సేకరణ పనులు జరుగుతుండగా, ఓటర్ల జాబితా సవరణ కీలక దశకు చేరింది. ఈ పనులన్నీ చూడాల్సిన రెవెన్యూ శాఖలో.. అందునా నియోజకవర్గ కేంద్రాలైన పరకాల, జనగామ వంటి చోట్ల కూడా పోస్టులు భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తహసీల్దార్ల బదిలీలకు మూడుసార్లు ఉత్తర్వులు ఒకవైపు జిల్లాలో డీటీల బదిలీలు, సీనియర్ సహాయకుల పదోన్నతులకు సంబంధించి ఫైల్ ఉన్నతాధికారుల వద్ద మూలుగుతుండగా.. తహసీల్దార్లకు సంబంధించి నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వులు అందుకున్న వారు విధుల్లో చేరి పాతబడిపోయారు. మరో రెండు నెలల్లో ఎన్నికల నిబంధనల వల్ల తహసీల్దార్లు పక్క జిల్లాలకు బదిలీ వెళ్లే అవకాశముంది. దీన్ని గుర్తించి డీటీల పోస్టుల భర్తీపై వెంటనే దృష్టి సారించకపోతే.. రెవెన్యూ కార్యాలయాల్లో దిక్కు లేనివిగా మారే ప్రమాదముంది.