breaking news
Poochi Murugan
-
శరత్కుమార్పై ఫిర్యాదు
చెన్నై : శరత్కుమార్పై నడిగర్ సంఘం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. శరత్కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో సంఘం ట్రస్ట్లో భారీ అవినీతి జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.గురువారం ఉదయం సంఘ నిర్వాహకులు పూచ్చి మురుగన్ నేతృత్వంలో న్యాయవాది కృష్ణతో కలిసి నగరంలోని పోలీస్కమిషనర్ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నటుడు రాధారవిపై ఫిర్యాదు
తమిళసినమా: నటుడు రాధారవిపై మరో నటుడు పూచిమురుగన్ శనివారం మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అందులో ఆయన పేర్కొంటూ.. నటుడు రాధారవి శుక్రవారం ఒక కార్యక్రమంలో పురుగును నలిపినట్లు కాలితో నలిపేస్తానని అన్నారన్నారు. ఆ విధంగా తనను బెదిరించే విధంగా మాట్లాడిన నటుడు రాధారవి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాధారవి బెదిరింపు మాటల్ని చూస్తుంటే తన ప్రాణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి తనకూ, తన కుటుంబానికీ తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని పూచి మురుగన్ పత్రికల వారికి తెలుపుతూ మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన పత్రాన్ని కోడంబాక్కమ్ పోలీస్ స్టేషన్లోను అందించినట్లు చెప్పారు