breaking news
planings
-
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గొచ్చు
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాదిలో 20 శాతం క్షీణించి 40 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితం కావొచ్చని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. స్థూలంగా ఆఫీస్ స్పేస్ లీజు 2023లో 40–45 మిలియన్ ఎస్ఎఫ్టీ మధ్య ఉండొచ్చని, క్రితం ఏడాదిలో ఇది 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. కాకపోతే ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉంటున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్ వరకు) 24.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్ వరకు) మరో 15.3–20.3 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది. స్థూల లీజు పరిమాణంలో రెన్యువల్స్ను కలపలేదు. వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఆఫీస్ స్పేస్ లీజు ఈ మాత్రం మెరుగ్గా ఉండడానికి మద్దతుగా నిలిచినట్టు వివరించింది. ‘‘జనవరి–మార్చి మధ్య 10.1 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర కార్యాలయ స్థలాలు భర్తీ అయ్యాయి. తర్వాతి మూడు నెలల కాలంలో ఇది మరింత పుంజుకున్నది. ఏప్రిల్–జూన్ మధ్య 14.6 మిలియన్ చదరపు అడుగులు మేర లీజు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 46 శాతం పుంజుకున్నది’’అని కొలియర్స్ ఇండియా వివరించింది. పట్టణాల వారీగా.. బెంగళూరులో అత్యధికంగా 12–14 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ స్థలాల లీజు నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 9–11 మిలియన్ ఎస్ఎఫ్టీ, చెన్నైలో 7–9 మిలియన్ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4–6 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ మృదువుగా ఉన్నప్పటికీ, ఫ్లెక్సిబుల్ వర్క్స్పేసెస్కు డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ విభాగంలో సేవలు అందించే అర్బన్వోల్ట్ సహ వ్యవస్థాపకుడు అమల్ మిశ్రా తెలిపారు. -
ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక
రాజమహేంద్రవరం సిటీ : రాష్ట్రంలో రెలిజియస్ టూరిజం (ఆధ్యాత్మిక పర్యాటకం)ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అన్ని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు రెలిజియస్ టూరిజం (దేవాదాయశాఖ) డైరెక్టర్ రత్నకుమార్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం దేవాదాయశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశామన్నారు. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాల సందర్శన, పూజలు సహా అన్ని ఏర్పాట్లతో ఆర్టీసీ బస్సులను సమకూరుస్తున్నామని, పంచారామ యాత్రకు దేశవ్యాపంగా ప్రాచుర్యం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ కనకదుర్గమ్మ, కొల్లేరుకోట పెద్దింట్లమ్మ, భీమవరం మావుళ్లమ్మ, పెద్దాపురం మరిడమ్మ, అనకాపల్లి నూకాంబిక, విశాఖపట్నం కనకమహాలక్ష్మి, విజయనగరం పైడితల్లి అమ్మవార్ల దేవస్థానాలకు కలుపుతూ ప్యాకేజీ, చేశామన్నారు. త్రిలింగ యాత్రగా శ్రీ«శైలం, శ్రీకాళహస్తి, దాక్షారామం, పిఠాపురం, ఒంటిమిట్ట, అమరావతి, మహానంది, అహోబిలం, తిరుపతి, మొదలగు ప్రాంతాలను సందర్శి«ంచేలా మరో ప్యాకేజీ సిద్దం చేశామన్నారు. విశాఖపట్నం నుంచి పూరి కళింగ కారిడార్ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ పాల్గొన్నారు. -
భవితకు పునాది.. తొలి ఏడాదే
ఆదిలో ఎదురయ్యే అవరోధాల్ని అధిగమిస్తేనే పురోగతి లక్ష్యసాధనకు కృషి, ప్రణాళికలే కీలకం వెలుగుబంద (రాజానగరం) : ఇంజనీరింగ్ చదువును మంచి ఉపాధికి మార్గంగా ఎంచుకుని ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఆ కోర్సులో చేరుతున్నారు. అయితే ఎంచుకున్న చదువుతో లక్ష్యాలను చేరుకోవాలంటే అంతకు మించిన సాధన ఉండాలంటున్నారు అధ్యాపకులు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో మొదటి సంవత్సరం ఎంతో కీలకమని, దానిని నిర్లక్ష్యం చేస్తే భవిషత్తు అంత ఆశాజనకంగా ఉండదని హెచ్చరిస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇంటర్లో 90 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ పరీక్షల్లో తప్పుతున్నారంటున్నారు. మొదటి సంవత్సరంలోనే కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడం వలన క్యాంపస్ రిక్రూట్మెంట్లో అవకాశం వచ్చినా∙ఉద్యోగాలు పొందలేకపోతున్నారంటున్నారు. ఇందుకుగల కారణాలను పరిశీలిస్తే.. కళాశాలలో చేరినప్పటి నుంచి విద్యార్థి ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కూడా లక్ష్య సాధనకు అవరోధాలుగా పరిగణిస్తున్నాయంటున్నారు. సీనియర్స్ ర్యాగింగ్ ఇంజనీరింగ్లో చేరిన వెంటనే విద్యార్థులు ఎదుర్కొనే సమస్య సీనియర్ల నుంచి ర్యాగింగ్. విద్యాభ్యాసంలో ఆదర్శంగా ఉంటూ జూనియర్లకు మెళకువలు, సూచనలు ఇవ్వవలసిన సీనియర్లు ర్యాగింగ్తో ఇంజనీరింగ్ విద్యపై భయాన్ని కలిగిస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ఇటువంటి వాతావరణానికి జూనియర్లు దూరంగా ఉండాలి. ‘బట్టీపట్టుడు’ కాదు..పట్టు ముఖ్యం ఇంజనీరింగ్ విద్యలో ప్రతి విద్యార్థికీ సబ్జెక్టుపై పట్టు ఉండాలి. అందుకు బట్టీ పట్టే విధానం సరైంది కాదు. ఆయా సబ్జెక్టులపై విశ్లేషణ, అవగాహన ఉండేలా తరగతుల్లో అధ్యాపకులు చెప్పే విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుంటూనే పుస్తక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సమయ పాలనా కీలకం.. రోజుకు ఎన్ని గంటలు, ఏఏ సమయంలో చదువుకు కేటాయించాలి, ఏ సమయంలో ఆటవిడుపుగా గడపాలి అనే విషయమై విద్యార్థికి ప్రణాళిక అవసరం. సమయ పాలన (టైమ్ మేనేజ్మెంట్) ఎవరికైనా మంచి ఫలితాలను అందిస్తుంది. మెుబైల్, టీవీ, చిట్చాట్ వంటి వాటితో సమయాన్ని వృథా చేసుకోకుండా నిర్ణీత సమయాన్ని చదువుకు కేటాయిస్తే సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి వీలుంటుంది. లక్ష్యం ఉండాలి.. లక్ష్యం నిర్ణయించుకుంటేనే దానిని సాధించేందుకు తపనతో కృషి చేస్తుంటాం. అలాగే విద్యార్థి చదువులో కూడా లక్ష్యం నిర్ణయించుకుంటేనే సెమిస్టర్ నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్ వరకూ అనుకున్న విజయాలను సాధించడం సుసాధ్యం అవుతుంది. లక్షా్యనికి అనుగుణంగా తనలో ఉన్న లోపాలను సరిచేసుకోవడంతోపాటు ఉన్న నైపుణ్యాలను మరింతగా వృద్ధి చేసుకునేందుకు దృష్టిని సారిస్తాడు. తద్వారా ప్లేస్మెంట్లో కూడా లక్షా్యన్ని చేరుకుంటాడు. భాషా పరిజ్ఞానాన్నిపెంపొందించుకోవాలి.. విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, భావప్రకటనకు సంబంధించిన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయని అనేక సాఫ్ట్వేర్ సంస్థలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తరుణంలో తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరిన నాటి నుంచి భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆంగ్ల దినపత్రికలు, మేగజైన్లు చదవడానికి, వార్తలను వినడానికి రోజూ కొంత సమయం కేటాయించాలి. – బాసిరెడ్డి రాంబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీవీసీ కళాశాల, పాలచర్ల తల్లిదండ్రుల బాధ్యత.. ‘ఇంజనీరింగ్లో చేర్పించాం, మన బాధ్యత అయిపోయిం’దని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. అది సరికాదు.. కళాశాలకు వెళ్లిన విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటోంది అనే విషయాలను తరచూ తెలుసుకోవాలి. కనీసం నెలకోసారైనా సంబంధిత అధ్యాపకుని కలిసి, ఆ విద్యార్థి తీరును తెలుసుకోవాలి. అలాగే సెమిస్టర్ పరీక్షలో ప్రగతిని కూడా పరిశీలిస్తుండాలి. కొత్త ఆలోచనలతోనేరాణింపు.. ఇంటర్ వరకూ ఏవిధంగా చదివినా.. ఇంజనీరింగ్లో చేరిన నాటి నుంచీ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆంగ్లభాషపై మంచి పట్టును సాధించే దిశగా ప్రతి విద్యార్థీ కసరత్తు చేయాలి. అలాగే సబ్జెక్టుపై పరిజ్ఞానంతోపాటు కొత్త ఆలోచనలతో నూతనావిష్కరణల వైపు పయనించే వారికే రాణింపు ఉంటుంది. – డాక్టర్ ఎస్.సూర్యనారాయణరాజు, ప్రిన్సిపాల్, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ఫస్ట్ ఇయర్ పునాది వంటిది.. ఇంజనీరింగ్ విద్యలో మొదటి సంవత్సరం ఎంతో కీలకమైనది. నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో ఫస్ట్ ఇయర్ ఒక రకంగా పునాది వంటిది. ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా దారుణమైన ఫలితాలను చవిచూడవలసి వస్తుంది. పట్టుదలతో ఫస్ట్ ఇయర్ని పూర్తి చేస్తే సెకండ్ ఇయర్ నుంచి వారు ఎంచుకున్న కోర్ సబ్జెక్టులపై దృష్టిని సారించడానికి అవకాశం ఉంటుంది. – ప్రొఫెసర్ టి.చంద్రశేఖర్,హెచ్ఓడీ, ఈసీఈ, గైట్ కళాశాల