breaking news
Plan India
-
రూ.250 కోట్లతో సర్కారీ బడుల్లో వసతులు
బషీరాబాద్(తాండూరు) : తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 500 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని రూ.2.50 కోట్లతో వసతులు కల్పించనుందని సాధన స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర డైరెక్టర్ మురళీ మోహన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని 30 స్కూళ్లలో రూ.12 లక్షలతో లైబ్రరీలు, రూ.3 లక్షలతో సైన్స్ ఎడ్యుకేషన్ కిట్స్ అందజేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో పది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1.20 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్లు, మరుగుదొడ్లు నిర్మించామని స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి మండలంలో 25 మంది విద్యావలంటీర్లను నియమించి నెలనెలా వేతనం ఇస్తున్నామని వెల్లడించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రూ.15 లక్షలతో బాలికల విద్య, బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లాన్ ఇండియా ద్వారా ప్రముఖ ఐటీ కంపెనీలు ఒరాకిల్, క్యాబ్ జెమినిల ఆర్థిక వనరులతో మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాల్లోని స్కూళ్లకు క్రీడా సామగ్రి అందించడం, మైదానాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం, గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వంటిæ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, విద్యాహక్కు చట్టంపై ఆయా గ్రామాల్లో కళాజాత బృందాలతో ప్రజలను చైతన్యం చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవర్చేందుకు అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒరాకిల్ ఐటీ కంపనీల మేనేజర్ శాంతి, బెంగళూరు స్నైడర్ కం పనీ ప్రతినిధి సుగంధ, ప్లాన్ ఇండి యా అధికారులు చందన్, అభిలాష్, స్థానిక విద్యాధికారి నర్సింగ్రావు పాల్గొన్నారు. -
‘సెడ్స్’ సేవలు అభినందనీయం
►జిల్లా విద్యాధికారి లింగయ్య ►ఘనంగా స్పోర్ట్స్ మీట్ ►పాల్గొన్న విదేశీయులు గుడిహత్నూర్ : సెడ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా విద్యాధికారి లింగయ్య అన్నారు. మండలంలోని కొల్హారీ ప్రాథమికోన్నత పాఠశాలలో సెడ్స్ ఆధ్వర్యంలో ప్లాన్ ఇండియా, పర్ఫాం సంస్థల సహకారంతో మంగళవారం నిర్వహించిన వార్షిక క్రీడా సంబరాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, పిల్లల అభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్రీడాలతో విద్యార్థులను ఆకర్షించి మరింత ప్రోత్సాహాన్ని అందించే దిశగా తాము కృషి చేస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ ఆర్.సురేందర్ తెలిపారు. స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న వృధ్ధుల ఆశ్రమం, యువజనులకు స్వయం ఉపాధి శిక్షణలు, బాల కార్మికుల నిర్మూలన, క్రీడల్లో ప్రోత్సాహం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి లండన్కు చెందిన ప్లాన్ ఇండియా, పర్ఫాం ప్రతినిధులు మైఖేల్ రాబర్ట్, ఫ్లోరియన్ డెడైరిసన్, ల్యూక్లాక్, జోసీ పార్మీ, జెసీ జోయ్లతో పాటు ప్లాన్ ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రోగ్రాం అధికారి కె.అభిలాష్ పాల్గొని సంస్థ సేవలు పరిశీలించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనపర్చిన జట్లకు బహుమతులు అందజేశారు. స్థానిక సర్పంచ్ బా లాజీ సోంటక్కే, ఎస్ఎంసీ చైర్మన్ తగ్రే ప్రకాశ్, ఎంఈవో నారాయణ, సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి, వివిధ గ్రామాల వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.