breaking news
pipeline blast
-
చిత్రం చెప్పేకథ : రైతే కాడెద్దు, బెంబేలెత్తించిన పైపు నీరు
బెంబేలెత్తించిన పైపు నీరు: స్థానిక జయదేవ భవన్ పరిసరాల్లో నీటి పైపు చిట్లడంతో భయానక పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఈ పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా తాగు నీరు సరఫరా చేసే ప్రధాన అనుసంధాన పైపు కావడంతో నీటి ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది. ఈ పైపు చిల్లుబడి సుమారు 50 అడుగుల ఎత్తుకు నీరు చిమ్మడంతో చేరువలో 30 అడుగుల ఎత్తున 30 కేవీ విద్యుత్ సరఫరా అనుసంధాన వ్యవస్థని అధిగమించి నీరు నింగికి ఎగసింది. – భువనేశ్వర్ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాడెద్దులు లేకున్నా.. ఉన్న పొలం పోయింది. కాడెద్దులు దూరమయ్యాయి. అప్పులు బతుకు మీదకు వచ్చాయి. కానీ ఆయనకు తెలిసింది ఒక్కటే. వ్యవసాయం. భూమి ఉన్నా లేకపోయినా, కాడెద్దుల సాయం ఉన్నా లేకున్నా.. ఆయన చేయగలిగింది ఒక్కటే వ్యవసాయం. జయపూర్ పట్టణ సమీపంలో బంకబిజ గ్రామ వద్ద రోడ్డు పక్కన పొలంలో ఎద్దుల సాయం లేకుండా దుక్కి దున్నుతున్న ఇతని పేరు రామ పరిజ. సాగు తప్ప ఇంకేమీ తెలియని ఈ మనిషి సొంత పొలం పోయాక కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ట్రాక్టర్ అద్దె కట్టలేక ఇలా దున్నే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. – కొరాపుట్ ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి! -
జోధ్పూర్లో నడిరోడ్డుపై పగిలిన పైప్లైన్
-
అసోంలోని దిబ్రుగఢ్లో ఆయిల్ పైప్లన్ లీక్
-
మెక్సికోలో ఘోర ప్రమాదం
-
జాతీయ రహదారిపై పగిలిన పైప్
-
లెదర్ ఫ్యాక్టరీలో పేలిన పైప్లైన్
-
తమిళనాడులో ఘోర ప్రమాదం
వేలూరు: తమిళనాడు రాష్ట్రంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వేలూరు జిల్లాలోని రాణిపేట లెదర్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్ పైప్లైన్ పేలింది. ఈ ధాటికి అక్కడున్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ఎన్టీపీసీలో పేలిన పైప్లైన్, కార్మికుడి మృతి
విశాఖ : విశాఖ జిల్లా పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు కామేష్ మృతి చెందాడు. ఎన్టీపీసీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైప్లైన్ పేలటంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాతికేళ్ల నాటి పైపులైను.. పదేపదే లీకేజిలు
కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీ కార్యకలాపాలు దాదాపు రెండున్నర దశాబ్దాలకు ముందునుంచే ఉన్నాయి. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికి తీయడానికి సుమారు 25 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పైపులైన్లు వేశారు. సాధారణంగా ప్రమాణాల ప్రకారం చూస్తే ఈ పైపులైన్ల జీవితకాలం దాదాపు 50 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ అసలు సమస్య అంతా జంక్షన్ల వద్దే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఈ జంక్షన్ల వద్ద నుంచి గ్యాస్ లీకై, దానికి సంబంధించిన వాసన వచ్చేదని స్థానికులు కూడా పలుమార్లు తెలిపారు. కానీ, అధికారులు మాత్రం గతంలో జరిగిన కొన్ని చిన్న చిన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వారి హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు, దాని తీవ్రతను గుర్తించలేదు. ఓఎన్జీసీ వెలికితీసిన గ్యాస్ను తాటిపాకలోని గ్యాస్ కలెక్షన్ సెంటర్కు పంపుతారు. అక్కడి నుంచి గెయిల్ పైప్లైన్ల ద్వారా ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో తదితర సంస్థలకు గ్యాస్ సరఫరా అవుతుంది. ఇలా సరఫరా అయ్యే గ్యాస్ పలుమార్లు లీకవ్వడం, ఆ విషయాన్ని స్థానికులు గెయిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాళ్లు వచ్చి చూసేసరికి అంతా సర్దుమణగడం లాంటివి జరగడంతో, లీకేజి గురించి ఈ ప్రాంత వాసులు ఏం చెప్పినా దాన్ని తేలిగ్గా తీసుకోవడం అధికారులకు అలవాటైపోయింది. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ పైపులైన్ లీకై.. భారీ ప్రమాదం సంభవించినా, ఆ విషయం తెలియజేయడానికి గెయిల్ అధికారుల కోసం ప్రయత్నిస్తే ఎవరూ స్పందించలేదని స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో మెలకువ వచ్చి, ఇంట్లో ఉన్న పిల్లలను భుజాన వేసుకుని పరుగులు తీసిన తల్లులు.. తమ పిల్లలు బతికే ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే, వాళ్లు బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఇళ్లు పూర్తిగా కాలిపోయి.. కనీసం అక్కడో ఇల్లు ఉందనే విషయాన్ని కూడా గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. పూరిళ్లు మొత్తం మాయమైపోయాయి. పెంకుటిళ్లు కూడా కాలిపోయాయి. వాటిలో ఉన్నవారు మొత్తం మరణించారు. పక్కా డాబా ఇళ్లకు ఉన్న తలుపులు, కిటికీలు కూడా కాలిపోయాయి. 20 అంగుళాల మందం ఉన్న పైపులైన్ పగిలిపోయింది. జాయింట్ వద్ద తుక్కుతుక్కుగా మారిపోయింది. ఎట్టకేలకు ఉదయం 6.45 గంటలకు మంటలు చల్లారాయి. అయినా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సంఘటన జరగదన్న నమ్మకం మాత్రం ఇక్కడివారికి లేదు. -
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం