breaking news
pinda pradhanam
-
‘కొండగట్టు’ వద్ద నారాయణ బలిహోమం
జగిత్యాల జోన్/కొండగట్టు: కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో బుధవారం నారాయణ బలిహోమం నిర్వహించారు. బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రీ, పులి సీతారామ శాస్త్రీ, శ్రీనివాసశర్మ తదితర వేద పండితుల బృందం రెండు గంటలపాటు హోమం నిర్వహించింది. యాగం నిర్వహిస్తున్న స్థలంలోని వేదికపై దాదాపు అరగంట పాటు స్వామిజీ ప్రత్యేక జపం చేస్తూ, మౌనంగా ఉండిపోయారు. ప్రమాద స్థలంలోనే 50 మందికిపైగా చనిపోయినందున సామూహికంగానే మృతులకు పిండ ప్రదానం చేశారు. యజ్ఞహోమం వద్ద పిండాలను ఏర్పాటు చేసి.. మృతుల కుటుం బాలతో పిండాలు ప్రదానం చేయించారు. అనం తరం ధర్మపురి గోదావరిలో కలిపేందుకు తీసుకెళ్లారు. కాగా, కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని గోదావరి నీటితోపాటు యజ్ఞ విభూతితో శుద్ధి చేశారు. ప్రత్యేక పూజలూ చేశారు. వస్త్రాల బహూకరణ: మృతుల కుటుంబాలకు పరిపూర్ణానంద స్వామి తన చేతుల మీదుగా వస్త్రాలను బహూకరించారు. ఆ సమయంలో బాధితులు తమవారిని తలుచుకుని స్వామివారి పాదాలపై పడి ఏడ్వడం చూసేవారికి సైతం కన్నీళ్లను తెప్పించింది. మృతుల కుటుంబీకులు సంతోషంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు. -
పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం
గొల్లపూడి, పుష్కరఘాట్, పిండప్రదానాలు gollapudi, pushkara ghat, pinda pradhanam గొల్లపూడి(విజయవాడరూరల్) : గొల్లపూడి పుష్కరఘాట్వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది. కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది. గురువారం షెడ్డునిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ నిర్వహిస్తోందని పంచాయతీరాజ్ ఏఈ సురేంద్ర తెలిపారు.