breaking news
pharma cluster
-
ఫార్మా క్లస్టర్స్కు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిచ్చే బాటలో ప్రభుత్వం రూ. 500 కోట్లతో పథకాన్ని ప్రారంభించింది. తద్వారా దేశవ్యాప్తంగా ఆయా సంస్థల ఉత్పత్తి మెరుగు, నిలకడకు మద్దతివ్వనుంది. ఫార్మాస్యూటికల్స్, ఎరువులు, రసాయనాల శాఖ ఈ పథకానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) నుంచి 2025–26వరకూ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ పటిష్టతకు వీలుగా రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలియజేసింది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన మద్దతిచ్చేందుకు పథకాన్ని ఉద్దేశించినట్లు పేర్కొంది. ఈ పథకం ప్రస్తుత ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్ఎంఈలు మెరుగైన ఉత్పత్తిని సాధించడం, నాణ్యత, నిలకడను అందిపుచ్చుకోవడం తదితరాలకు దన్నుగా నిలవనున్నట్లు వివరించింది. ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడం ద్వారా ఫార్మాస్యూటికల్ రంగంలో గ్లోబల్ లీడర్గా భారత్ను తీర్చిదిద్దేందుకు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలు జాతీయ, అంతర్జాతీయ నియంత్రణా ప్రమాణాలు అందుకునే బాటలో వెచ్చించే పెట్టుబడి రుణాలపై వడ్డీ రాయితీ లేదా సబ్సిడీ అందించనున్నట్లు తెలియజేసింది. చదవండి: బైజూస్ భారీగా నిధుల సమీకరణ -
న్యూట్రాస్యూటికల్స్ విప్లవం.. మస్తుగా కెరీర్ అవకాశాలు!!
Nutrify Today world's first launches nutraceuticals academy: కరోనా తర్వాత ఆరోగ్యరంగంతో పాటు అనుబంధ రంగాలన్నింటిలోనూ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా పోషకాహార రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఔషధాల రూపంలో పోషకాలను అందించే న్యూట్రాస్యూటికల్స్ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో భారత న్యూట్రాస్యూటికల్స్కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో మన స్వదేశీ సంస్థ న్యూట్రిఫై టుడే ఈ రంగాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక అకాడమీకి రూపకల్పన చేసింది. నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా.. ప్రపంచంలోనే ప్రప్రధమ న్యూట్రాస్యూటికల్స్ అకాడమీని న్యూట్రిఫై టుడే (https://academy.nutrifytoday.com/) ప్రారంభించింది. పరిశ్రమ వృద్ధితో పాటుగా న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్లకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. తొలి దశలో ముంబై, బెంగళూరులలో న్యూట్రిఫీ టుడే అకాడీమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత్, ఆసియా దేశాలే కాకుండా ఆన్లైన్ కరిక్యులమ్ ద్వారా ఇతర దేశాలకు విస్తరించనుంది. గీతం, సెంచురియన్ యూనివర్శిటీ, ఏఐసీసీసీఎంబీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ వంటి పలు యూనివర్శిటీలు న్యూట్రిఫీ టుడే అకాడమీతో ఒప్పందాలు ఏర్పరచుకున్నాయి. చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? 100బిలియన్ డాలర్ల పరిశ్రమగా... న్యూట్రిఫై టుడే చీఫ్ క్యాటలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘న్యూట్రాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఫార్ములేషన్లో కెరీర్ కోరుకుంటున్న, ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన అవకాశాలను న్యూట్రిఫీ టుడే అకాడమీ అందిస్తుంది. రానున్న 2024 నాటికి 5వేల మంది ప్రొఫెషనల్స్కు శిక్షణ అందించగలమని అంచనా వేస్తున్నాం. మరోవైపు ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించి భారత్ 8 మిలియన్డాలర్ల మార్కెట్గా ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎగుమతులు గణనీయంగా జరుగనున్నాయి.. ఈ రంగంలోని వాటాదారుల అంచనా ప్రకారం 2025 నాటికి ఈ పరిశ్రమ 40బిలియన్డాలర్లను, 2030 నాటికి 100 బిలియన్డాలర్ల విలువ కలిగి ఉంటుంది’’ అని చెప్పారు. ఈ ప్రపంచ ప్రప్రధమ న్యూట్రిఫై టుడే అకాడమీ రూపకల్పనలో డాక్టర్ బాల్కుమార్ మరాఠీ, పూర్వ ఆర్ అండ్ డీ హెడ్ ఆఫ్ యునిలీవర్; బ్రిజెష్ కపిల్, పూర్వ ప్రొక్టర్ అండ్ గాంబెల్ ఇండియా బోర్డ్ మెంబర్ ; నాజ్నిన్ హుస్సెన్, పూర్వ అధ్యక్షుడు ఇండియన్ డైటిటిక్స్ అసోసియేషన్ ఓపినియన్ లీడర్ బేకర్ డిల్లాన్ గ్రూప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షెల్డన్ బేకర్లు కీలకపాత్ర పోషించారు. చదవండి: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
ఏపీలో ఫార్మా రీసెర్చ్ సెంటర్!
హైదరాబాద్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు? బెంగళూరు: ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును ఆర్థిక శాఖకు ప్రతిపాదించామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. అలాగే హైదరాబాద్లోనూ 350 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన ఒకటి ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఫార్మా రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తామని చెప్పారు. ఆయన ఇక్కడ జరిగిన ‘ఇండియా ఫార్మా 2016’లో ప్రారంభోపన్యాసం చేశారు.