petitioners
-
ఇదంతా వేధింపుల్లో భాగమే: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో పిటిషనర్లు
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో అరెస్టు నుంచి తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషన్లో పేర్కొన్న కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మద్యం కొనుగోళ్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వ్యవహారం అంతా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలోనిది. మేమేకుట్ర దారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఇలాంటి ఆధారాలు లేవు. ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించారు. . పైగా మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. .. మాపై ఆరోపణలు చేయడం వేధింపులో భాగమే. మద్యం కొనుగోళ్లలో మా పాత్ర ఉందనే ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఏసీబీ వద్దే ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆధారాలను తాము ఎలా తారుమారు చేయగలం. మా స్థాయిని తగ్గించి, అవమానించే ఉద్దేశంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని పిటిషన్లో ప్రస్తావించారు వాళ్లు. మరో పక్క ఈ వ్యవహారంలో మే 7వ తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఆలస్యం లేకుండా విచారణ జరపాలని ఆదేశించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణను మే 8వ తేదీకి వాయిదా వేసింది. -
ఇప్పటం కేసులో పిటిషనర్లకు మరోసారి ఎదురుదెబ్బ..
సాక్షి, అమరావతి: ఇప్పటం కేసులో పిటిషనర్లకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించింది సింగిల్ బెంచ్. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో రిట్ ఆప్పీల్ దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్ను ధర్మాసనం బుధవారం కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు అంతా రైతులేనని, వాళ్లకు తెలియక తప్పు చేశారని ధర్మాసానికి తెలియజేశారు పిటిషన్ తరపున న్యాయవాది. దీంతో వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా మీకు తెలియదా అని పిటిషన్ల తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేయటం మంచిది కాదని తెలిపింది. చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి? -
అమరావతికి ఎంత ఖర్చుచేశారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారు.. నిర్మాణాలన్నింటినీ ఆపేయడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం ఎంత.. తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టంచేసింది. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతోపాటు పలు ఇతర అభ్యర్థనలతో గతంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన త్రిసభ్య ధర్మాసనం, వాటిపై గురువారం మరోసారి విచారణ జరిపింది. నిర్మాణాలపై చేసిన వ్యయం ప్రజల డబ్బు అని.. అది దుర్వినియోగమైతే చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది. ఖజానాకు వాటిల్లిన నష్టానికి బాధ్యులెవరు.. దానిని ఎలా రాబట్టాలన్న విషయాలను తదుపరి విచారణల్లో తేలుస్తామని తేల్చిచెప్పి తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలను కూడా 14న విచారణకు రానున్న వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గతంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలూ విచారణకు రాగా, బిల్లులు చట్టాలుగా మారాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు నిరర్థకమని అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి తెలిపారు. అయితే, ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని 14న రానున్న వ్యాజ్యాలకు జతచేసింది. ఇలా మిగిలిన అన్ని వ్యాజ్యాలను కూడా 14వ తేదీ వ్యాజ్యాలకు జతచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, నవరత్నాల ఇళ్ల పట్టాల వ్యాజ్యాలను మాత్రం వాటితో జతచేయలేదు. -
క్రమ‘బద్ధకం’!
♦ క్రమబద్ధీకరణపై నీలి నీడలు ♦ గడువు మూడు రోజులే.. ఏకమొత్తంలో చెల్లించినా హక్కులు కల్పించని ప్రభుత్వం స్థలాల రెగ్యులరైజేషన్పై స్పష్టత ఇవ్వక, అర్జీదారుల అనుమానాల నివృత్తికి ప్రయత్నం చేయకపోవడంతో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఆక్రమణదారులు ముందుకు రావడంలేదు. భూక్రమబద్ధీకరణ గందరగోళంగా మారింది. విధి విధానాలపై గోప్యత పాటిస్తున్న సర్కారు.. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించే గడువు పెంచేదిలేదని స్పష్టం చేయడం దరఖాస్తుదారులను అయోమయంలో పడేసింది. చెల్లింపు కేటగిరీ కింద సర్కారు స్థలాల్లోని నిర్మాణాల రెగ్యులరైజ్కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. క్రమబద్ధీకరణలో బిల్టప్ ఏరియానే పరిగణనలోకి తీసు కోవాలా? ఆక్రమణకు గురైన స్థలాన్ని క్రమబద్ధీకరించాలా? అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతోపాటు యాజమాన్యహక్కులు (కన్వియెన్స్ డీడ్) కల్పించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31నాటికే క్రమబద్ధీకరణ గడువు ముగిసినప్పటికీ, ఈ నెలాఖరు వరకు పొడగించింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాలుగు వాయిదాల్లో నిర్దేశిత మొత్తం చెల్లిస్తే స్థలాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని, సంక్రాంతి కానుకగా వీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ప్రభుత్వంపై భరోసాతో జిల్లావ్యాప్తంగా 59 జీఓ కింద 20,203 దరఖాస్తులు వచ్చాయి. (వీటిలో 8,360 అర్జీలు ఉచిత కేటగిరీ (జీఓ 58) నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారాయి). వీటిలో ప్రాథమిక స్థాయిలోనే సగానికి పైగా తిరస్కరణకు గురికాగా, 15,139 దరఖాస్తులను ఆర్డీఓ కమిటీలు పరిశీలించాయి. దీంట్లో 10,452 మాత్రమే క్రమబద్ధీకరణ పరిధిలోకి వస్తాయని తేల్చాయి. క్రమబద్ధీకరణకు అర్హులుగా తేలిన వారందరికీ నిర్ధిష్ట రుసుము చెల్లించాలని నోటీసులు జారీచేశారు. అయితే, పూర్తి మొత్తాన్ని చెల్లించినా యాజమాన్య హక్కులు కల్పించకపోవడంతో మిగతా దరఖాస్తుదారులు డైలమాలో పడ్డారు. దాదాపు 628 మంది ఏకమొత్తంలో (రూ.7.02 కోట్లు) నిర్దేశిత రుసుము కట్టారు. అయినప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో నెలకొన్న సందిగ్ధత కారణంగా వీరికి ఇప్పటివరకు స్థలాలపై హక్కులు రాలేదు. దీంతో ఒకటి, రెండు, మూడు వాయిదాలు కట్టిన దరఖాస్తుదారులు కూడా మిగతా మొత్తం చెల్లించేందుకు వెనుకడుగు వేశారు. ఈ క్రమంలోనే 29వ తేదీలోపు క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయమని ప్రభుత్వం ఆదేశించడం అర్జీదారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు పరిశీలించిన దరఖాస్తుల్లో సుమారు 3వేల వరకు సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్నాయి. పొరపాటున తప్పుదొర్లితే సవరించేలా సాఫ్ట్వేర్లో ఆప్షన్ లేకపోవడం కూడా పెండింగ్కు కారణమైంది. ఈ వెసులుబాటు కల్పించాలనే డిమాండ్పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు వైబ్సైట్ను కూడా నిలిపివేయడంతో దరఖాస్తుల క్లియరెన్స్ నిలిచిపోయింది. దీంతో వీటి ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిర్దేశిత మొత్తం చెల్లించడానికి మూడు రోజులే గడువు మిగిలి ఉన్న సమయంలో వీటిపై స్పష్టత ప్రకటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికితోడు 29లోపు డబ్బులు చెల్లించమని చెబుతున్నారే తప్ప ఆలోపు రిజిస్ట్రేషన్ చేస్తామనే విషయంపై ఇప్పటికీ రెవె న్యూ యంత్రాంగం స్పష్టీకరించడంలేదు. ఇదిలావుండగా, ఎల్ఆర్ఎస్, బీపీఎస్కు ఈ నెలాఖరే ఆఖరు కావడంతో ఆలోపు వీటిపై నిర్ణయం వెలువడకపోతే బీపీఎస్కు దరఖాస్తు చేయడం సాధ్యపడదు. వీట న్నింటినీ పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.