breaking news
payakarao pet
-
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
సాక్షి,పాయకరావుపేట: టీడీపీ మినీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన మిని మహానాడు పాయకరావు పేట నియోజకవర్గంలో జనం లేక వెలవెలబోయింది.గురువారం పాయకరావుపేటలో టీడీపీ మినీ మహానాడును నిర్వహించింది. ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఇతర ముఖ్యనేతలు సైతం హాజరయ్యారు.అయితే, మినీమహానాడు ప్రారంభమైన అరగంటకే సభకు వచ్చిన శ్రేణులు మధ్యలోనే వెళ్లిపోవడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ నేతలు మాట్లాడుతుండగా.. కార్యకర్తలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. సభను వదిలి వెళుతున్న జనాలకు నచ్చచెప్పి కూర్చేబెట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. పోలీసుల మాటల్ని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోవడంతో అక్కడున్న నేతలు కంగుతిన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనితపై కేసు నమోదు
విశాఖ : విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అనితపై పాయకరావు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అనితతోపాటు పీఏ ప్రసాద్, ఎంపీటీసీ కాశీ విశ్వనాథ్ లపై రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనితను అరెస్ట్ చేయాలని బాధితుని బంధువులు పాయరావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అనిత వ్యవహార శైలిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.