-
15 నుంచి పార్లమెంట్!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల 15 నుంచి సమావేశాలు ప్రారంభం కావొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 5 వరకు శీతాకాల సమావేశాలు కొనసాగుతాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. బ్యాంకుల్లో అప్పులకు సంబంధించిన దివాలా చట్టంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తోంది. దానిపై రాష్ట్రపతి సంతకం చేయగానే ప్రభుత్వం సమావేశాల తేదీలను లాంఛనంగా ప్రకటించనుంది. బుధవారం మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి జైట్లీ తదితరులు భేటీ అయ్యి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం సమావేశాలు ప్రారంభమవడానికి 15 రోజుల ముందే తేదీలు ప్రకటించాల్సి ఉన్నందున నెలాఖరుకల్లా అధికారికంగా తేదీలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జనవరి తొలి వారం వరకు శీతాకాల సమావేశాలు కొనసాగినా, అదే నెల చివరి వారంలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయనీ, ఫిబ్రవరి 1నే బడ్జెట్ను ప్రవేశపెడతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
నవంబర్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నవంబర్ నెలాఖరు కల్లా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో తప్పక ఆమోదం పొందగలదని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు భరోసాతో ఉన్నారు. మంగళవారం పార్టీ నేతలు కే కేశవరావు, వినోద్కుమార్, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి సహా పలువురు నేతలు కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతల వద్ద తెలంగాణ బిల్లు విషయం ప్రస్తావించారు. నవంబర్ 17వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావచ్చని, సమావేశాలు ప్రారంభమైన వారం రోజుల్లోపే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వారితో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ప్రక్రియ ఆగిపోయినట్లు పైకి కనిపిస్తున్నా.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కేంద్రంలో వేగంగానే సాగుతోందని కేసీఆర్ చెప్పారు. బిల్లుకు సంబంధించిన మొత్తం పనులు చాపకింద నీరులా పూర్తవుతున్నాయన్నారు. బుధవారం నాటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని, ఏదో ప్రత్యేక అంశంపై చర్చిం చేందుకు ఆ భేటీ జరుగుతోందన్నారు. బుధవారం తరువాత ఏ రోజు కేంద్ర మంత్రివర్గం సమావేశం జరిగినా తెలంగాణ బిల్లు ప్రస్తావనకు వస్తుందన్నారు. ఏది ఏమైనా అక్టోబర్ నెలలో ఈ బిల్లు ప్రక్రియకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. మరోపక్క రాష్ట్రంలో రాష్టప్రతి పాలన వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన వెంటనే రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ... ఉద్యోగులు, నీళ్ల వాటా, ఆదాయపంపిణీ వంటి అంశాలు రాష్ట్ర విభజన తరువాతే మొదలవుతాయని, ఆ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement