breaking news
Parents concern
-
మన పెళ్లికి మా ఇంట్లో వారు ఒప్పుకున్నారు!
మన పెళ్లికి మా ఇంట్లో వారు ఒప్పుకున్నారు! -
నారాయణ..నారాయణ.!
♦ నారాయణ కళాశాలలో ♦ విద్యార్థులను చితకబాదిన వైనం ♦ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చింతకొమ్మదిన్నె : నారాయణ విద్యా సంస్థల్లో రోజురోజుకు విద్యార్థుల పట్ల దండన తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. వారి దండన ఫైబర్ లాఠీలతో మొదలై విద్యార్థుల చేతులు విరిగే స్థాయికి చేరుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. తల్లిదండ్రులు, విద్యార్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం కడప–పులివెందుల రహదారిలో కృష్ణాపురంలోని కేఎస్ఆర్ఎం కళాశాల ఎదురుగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి విడివిడిగా బాలురు, బాలికల హాస్టళ్లు ఉన్నాయి. అక్కడే విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంట్లకు చెందిన కృష్ణారెడ్డి కుమారుడు త్రినేత్రకుమార్రెడ్డితోపాటు సుమంత్ కుమార్రెడ్డి, మల్లికార్జునరెడ్డిలు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో చదువుతున్నారు. గత శుక్రవారం అనవసరంగా మాట్లాడుతున్నారని వీరిపై జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారనే నెపంతో ఓ అధ్యాపకుడు, డీజీఎం రామ్మోహన్రెడ్డిలు వీరిని కార్యాలయంలోకి పిలిచి ఒకసారి, మరోసారి విద్యార్థులందరి ముందు తమ దగ్గరున్న ఫైబర్ లాఠీలతో చితకబాదారు. ఈ సంఘటనలో త్రినేత్రకుమార్రెడ్డి ఎడమ చేయి కాస్త విరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో త్రినేత్రకుమార్రెడ్డి చికిత్స చేయించి కట్టు కట్టించారు. అంతేగాకుండా సుమంత్కుమార్రెడ్డి, మల్లికార్జునరెడ్డిల చేతులు, కాళ్లకు తీవ్ర స్థాయిలో వాతలు పడ్డాయి. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం రోజు వారి పిల్లలను చూసేందుకు వచ్చిన సమయంలో బయటపడింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో అధ్యాపకులను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే సంబంధిత అధ్యాపకులు కనీసం సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించేందుకు కూడా ముందుకు రాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను పోలీసుల మాదిరిగా ఫైబర్ లాఠీలతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సంబంధిత అధ్యాపకులపై, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఆవరణంలో ఆందోళన చేశారు. ఆందోళన సమయంలో హుటాహుటిన అక్కడికి వచ్చిన ఎస్ఐ హేమకుమార్, తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. బాధ్యులపై ఫిర్యాదు చేయాలని కేసు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కనుమరుగైన మనీష, నందినిల అనుమానాస్పద మృతి కేసు చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ పరిధిలోనే ఇదే క్యాంపస్లో 2015 ఆగస్టు 16వ తేదీన జూనియర్ ఇంటర్ విద్యార్థులు నందిని, మనీషాలు తమ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీబీసీఐడీతోపాటు మానవ హక్కుల కమిషన్, ఇతర అధికారులు హడావుడి చేసి అప్పట్లో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఆ కేసు వ్యవహారం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తానికి నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరుగుతున్న దాష్టీకంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
దోపిడీకి సిద్ధం
⇒ యథేచ్చగా ప్రవేశ పరీక్షలు ⇒ విచ్చలవిడిగా ఫీజుల వసూలు ⇒ పభుత్వ నిబంధనలు గాలికి ⇒ ప్రవేటు పాఠశాలల నిర్వాకం ⇒ పట్టించుకోని విద్యాధికారులు నిజామాబాద్ అర్బన్: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తల్లిదండ్రుల గుండె గుభేలుమంటోంది. ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోని ప్రవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 2015-16 సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను నెల రోజుల క్రితమే ప్రారంభించి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కాయి. మరోవైపు అధిక ఫీజులు, ప్రవేశ పరీక్షల పక్రియను చూచి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది కేడాది యాజమాన్యాలు ఫీజుల పట్టికను పెంచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. నియంత్రించాల్సిన విద్యాశాఖ కళ్లప్పగించి చూస్తోంది. ఇదీ పరిస్థితి జిల్లాలో 815వరకు ప్రవేటు పాఠశాలలు ఉన్నా యి. ఇందులో 615 వరకు ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఫిబ్రవరి నుంచే సుమారు 100 పాఠశాలలు అ డ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీని ఆధారంగా సీటును కేటాయిస్తూ, ఫీజును కూడా భారీ గా వడ్డిస్తున్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులోని మూడు ప్రయివేటు పాఠశాలలు వార్షిక పరీక్షలు కొనసాగుతుండగానే అడ్మిషన్లను నిర్వహించాయి. ఎల్కే జీ నుంచే ప్రవేశ పరీక్షలు జరుపుతున్నారు. ఈ పరీక్ష లు జరిగేటపుడు పాఠశాల సిబ్బందిని కాపాలాగా ఉంచుతున్నారు. ఇతరులు లోనికి రాకుండా ప్రవేశ మార్గాలను మూసివేస్తున్నారు. వినాయక్నగర్లోని ఓ ప్రయివేటు పాఠశాల శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించింది. దీనిని అడ్డుకున్న ఏబీవీపీ నాయకులతో పాఠశాల సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. అనంత రం ఏబీవీపీ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ రూ. 50 వేల వరకు డొనేష న్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరి కొన్ని పెద్ద పాఠశాలలు విచ్చలవిడిగా డబ్బులు వసూ లు చేస్తున్నాయి. ఎల్కేజీ ప్రవేశానికే రూ. 65 వేల వర కు వసూలు చేస్తున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థి ప్రతి భ కనబరచకపోతే మరో రూ.10 వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కదలని అధికారులు పాఠశాలల యజమాన్యాలు విచ్చలవిడిగా వసూలు కార్యక్రమం కొనసాగిస్తుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. ఎంఈఓలు తమ పరిధిలోని ప్రరుువేటు పాఠశాలలకు ముందస్తుగానే నియమ నిబంధనలను తెలియజేయూలి. వాటిని పా టించేలా చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పలుచోట్ల ఎంఈఓలే ప్రవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు న్నాయి. మరికొన్ని పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. విద్యార్థి సం ఘాలు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.