breaking news
Parental Concerns
-
ఇన్స్ట్రాగామ్లో కొత్త ఫీచర్: చూశారా మీరు?
న్యూఢిల్లీ: ఫొటో షేరింగ్ ప్లాట్ఫాం ఇన్స్ట్రాగామ్ తాజాగా భారత్లో పేరెంటల్ పర్యవేక్షణ సాధనాలను ప్రవేశపెట్టింది. తమ టీనేజీ పిల్లల ఇన్స్ట్రా ఖాతాలను తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు ఇవి సహాయపడగలవని సంస్థ తెలిపింది. అలాగే ఈ విషయంలో సహాయం కోసం నిపుణులు అందించే వనరులతో ఫ్యామిలీ సెంటర్ ఫీచర్ను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఇన్స్ట్రాగామ్ పేర్కొంది. (ఇది చదవండి: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట) టీనేజీ పిల్లలను ఆన్లైన్లో సురక్షితంగా ఉంచేందుకు, తల్లిదండ్రులకు మరింతగా పర్యవేక్షణా అధికారాలను ఇచ్చేందుకు ఈ సాధనాలు, వనరులు ఉపయోగపడగలవని వివరించింది. (iPhone14: గుడ్ న్యూస్.. భారీ ఆఫర్ ఎక్కడంటే?) -
మరింత దోచుకోమని సిఫారసులా?
హైదరాబాద్లో నివాసం ఉంటున్న నవీన్ ఓ ప్రైవేటు కంపెనీలో సాధారణ ఉద్యోగి. ఆయన కొడుకు యూకేజీ ఫీజు ఏడాదికి రూ.42 వేలు. ఆటో ఫీజు కోసం మరో రూ.15 వేలు చెల్లిస్తున్నారు. మరో ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ ప్లే స్కూల్లో తన కూతురుకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు. వరంగల్లో ప్రైవేటు ఉద్యోగి గోపాల్ ఓ సాధారణ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న తన మూడో తరగతి కూతురికి ఏటా రూ.20 వేలు చెల్లిస్తున్నారు. అదే తన మూడేళ్ల చిన్న కూతురు ప్లే స్కూల్కు మాత్రం రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఖమ్మంలోని ఓ సాధారణ స్కూల్లో ఐదో తరగతి చదివే తన కూతురుకు ఏటా రూ.30 వేలు ఫీజు కడుతున్నారు. చిన్నవాడైన తన కొడుకుకు నర్సరీకి రూ.20 వేలు చెల్లిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్ ..ఇలా 31 లక్షల మంది సాధారణ, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలు ఏటా భారీ మొత్తంలో ఫీజులను పెంచుతుండటంతో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో తల్లిదండ్రుల కమిటీలు ఆందోళన చేశాయి. అయితే ఏడేళ్లుగా ఫీజుల తగ్గింపు కోసం తల్లిదండ్రుల కమిటీలు ఆందోళనలు చేయడం.. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని కోర్టుల్లో యాజమాన్యాలు సవాలు చేయడం.. చివరకు జీవోలు కొట్టివేయండం.. సర్వసాధారణంగా జరుగుతుండటంతో ఫీజుల నియంత్రణ అటకెక్కింది. యాజమాన్యాల అనుకూలతపైనే దృష్టి యాజమాన్యాల అనుకూల విధానాలపైనే ప్రధాన కమిటీ దృష్టి సారించిందని, అందుకే ఈ సిఫారసులు చేసిందంటూ తల్లిదండ్రుల కమిటీలు ఆరోపిస్తున్నాయి. ఒక్క సిఫారసు కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను కలసి విన్నవించాయి. ఆ నివేదికను ఆమోదించవద్దని కోరాయి. ఫీజులు మరింత పెంచేలా.. పట్టణ ప్రాంతాల్లో కనీసంగా రూ.12 వేల నుంచి టాప్ స్కూళ్లలో 2.5 లక్షల వరకు ఫీజులను యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను చదివిస్తున్న 31 లక్షల మంది తల్లిదండ్రుల్లో సాధారణ, మధ్య తరగతి వారే 80 శాతం వరకు ఉన్నారు. వారు చదివిస్తున్న పాఠశాలల్లో కనీస ఫీజు రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంది. ఈ మేరకు ఉన్న ఫీజులను తగ్గించేలా కమిటీ శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తుందని భావించినా.. అందుకు భిన్నంగా సిఫారసు చేయడంతో ఉసూరుమంటున్నారు. ఏఎఫ్ఆర్సీ తరహాలో చేయలేరట రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఖరారు చేస్తోంది. ఉన్నంతలో శాస్త్రీయ విధానమూ ఇదే. కాని అది సాధ్యం కాదని తిరుపతిరావు కమిటీ తేల్చేసింది. పైగా ఫీజుల పెంపునకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుపుతూ యాజమాన్య అనుకూల విధానాన్ని సిఫారసు చేసింది. ఏటా పెంపు.. ఇదేం విధానం? కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఏఎఫ్ఆర్సీ మూడేళ్లకోసారి ఫీజులను ఖరారు చేస్తోంది. మరి అలాంటపుడు పాఠశాలల్లో ఏటా ఫీజుల పెంపునకు సిఫార్సు చేయడంపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గుజరాత్లో మూడేళ్లకోసారి స్కూల్ ఫీజులను పెంచే విధానం ఉంది. మహారాష్ట్ర రెండేళ్లకోసారి 15 శాతం వరకు ఫీజులను పెంచే విధానం ఉంది. కానీ రాష్ట్రంలో ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన సరికాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని తల్లిదండ్రుల కమిటీల నేతలు నారాయణ, ఆశిశ్ హెచ్చరించారు. 9 నెలల అధ్యయనం.. ఫీజు పెంచుకునేందుకు సిఫారసులు ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం 2017 మార్చిలో మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసి, సిఫారసులు చేయాలని సూచించింది. దాదాపు 9 నెలలపాటు అధ్యయనం చేసిన కమిటీ.. తన నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అప్పగించింది. ఫీజుల తగ్గింపు సంగతి దేవుడెరుగు.. ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే ఏటా 10 శాతం వరకు ఫీజుల పెంపునకు కమిటీ సిఫారసు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జోనల్ ఫీజుల నియంత్రణ కమిటీల ఆమోదం తీసుకొని ఇష్టమొచ్చిన తీరులో ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
మా బిడ్డ చావుకు కారణమైన వారిపై చర్యల్లేవా!
తల్లిదండ్రుల ఆవేదన వెల్దుర్తి : ప్రేమించి తమ కుమార్తె గర్భవతిని చేసి, ఆమె చావుకు కారణమైన వ్యక్తి పై ఇటు పోలీసులు అటు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండలంలోని హస్తాల్పూర్ పంచాయతీ శంశిరెడ్డిపల్లి తండాకుచెందిన బాధిత తల్లిదండ్రులు సర్మాన్, మంగ్లీలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు తమ గోడును సాక్షితో పంచుకున్నారు. వివరాలు వారి మాట ల్లోనే.. ‘మా ఒక్కగానొక్క కుమార్తె రేణుక స్థానిక కస్తూర్బా పాఠశాలలో 2013 సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న సమయంలో దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. మా తండాకే చెందిన దేవసత్ ఉమ్లా, లక్ష్మిల కుమారుడు (రేణుకాకు వరుసకు బావ) శంకర్ (21) మా కుమార్తెను ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. 2013 ఏప్రిల్ 19న కడుపునొప్పి వస్తోందని మా కుమార్తె చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఆరునెలల గర్భవతి అని చెప్పారు. ఇదే ఈ విషయాన్ని నిలదీస్తే తనకేమి తెలియదని శంకర్ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు శంకర్ను, అతడి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా వారం రోజుల్లో తండాలోనే గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారు. ఈ క్రమంలో తమ బిడ్డ 2013, జూలై 24న ఓ మగ బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించింది. మరుసటి రోజు మగ శిశువును స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ శైలజ శిశు విహార్కు తరలించారు. బాబు ఆరోగ్యం క్షీణించి 2013, అక్టోబర్ 30న నిలోఫర్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు 2013, నవంబర్ 22న ఉత్తరం ద్వారా తమకు కబురు పంపారు. అప్పట్లో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయినా తమ బిడ్డ చావుకు కారణమైన శంకర్కు ఎటువంటి శిక్షా పడలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలుస్తాం మైనర్ బాలికకు గర్భం చేసి, ఆమె చావుకు కారణమైన శంకర్ను కఠినంగా శిక్షిం చాలని అప్పట్లో అన్ని శాఖల అధికారులను కలిసి విన్నవించాం. అయి నా లాభం లేకుండా పోయింది. జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ కలిసి ఫిర్యాదు చేస్తాం. - జిల్లా జండర్ కమిటీ సభ్యురాలు ముక్తాబాయి