breaking news
Panchayat permissions
-
విన్నపాలు..కన్నీళ్లు
సమస్యలపై స్పందించని అధికారగణం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం నెలల తరబడి జెడ్పీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం అధికారులు స్వయంగా ప్రకటించిన పెండింగ్ ఫిర్యాదులు 16,741 గుంటూరు వెస్ట్ 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం 200 ఎకరాలు ఇచ్చింది. 2003లో 100 ఎ కరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చా రు. ఇప్పటివరకు టైటిల్ డీడ్లు ఇవ్వలేదు. ఫలితంగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కావడంలేదంటూ కారంపూడి మండ లం నరమాలపాడు గ్రామానికి చెందిన వై.లక్ష్మి అనే మహిళతోపాటు గ్రామస్తులు ఫిర్యాదు. గ్రామంలోని గంగాభవానీ వాటర్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వాహకులు. పంచాయతీ అనుమతులు లేకుం డా వాటర్ ఫిల్లింగ్ చేస్తున్నారు. మురుగుకాల్వల మధ్య ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి వాటర్ ఫిల్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారంటూ తెనాలి మండలం కొలకలూరు గ్రా మానికి చెందిన కాలిశెట్టి భావన్నారాయణ, కాలి శెట్టి రమేష్బాబు, బద్దుల చంద్రశేఖర్ ఫిర్యాదు. పూర్వార్జితంగా వచ్చిన పొలాన్ని నా తమ్ముడు కం చేటి రమేష్ ఆక్రమించుకుని పాస్ పుస్తకాలు పొం దాడు. 2012లో అప్పటి వీఆర్ఓ ద్వారా కంచేటి రమేష్ తన కుమారుడి పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు. న్యాయం చేయమని అధికారులను కో రుతున్నా ప్రయోజనం లేకుండాపోతుందంటూ క్రోసూరు మండలం పీసపాడు గ్రామానికి చెందిన కంచేటిసాంబశివరావు, కంచేటి రమ్యల ఫిర్యాదు. వీరంతా ఇప్పటివరకు ఐదుసార్లు పైబడి గ్రీవెన్స్సెల్లో దరఖాస్తులు అందజేసినవారే. ఇటువంటి ఉదాహరణలు చాలా...చాలా ఉన్నాయి. గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ‘మీ కోసం’ వేదికలో జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, వికలాంగులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలు భరించి తమ గోడును అధికారులకు మొరపెట్టుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. అయితే సమస్యలు పరిష్కారమవుతా యని ఇక్కడకు వచ్చేవారికి నిరాశే మిగులుతుంది. దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారుగానీ, వాటిని పరిష్కరించడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నెలలతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరించడంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారుల పిలుపునకు స్పందన కరువు ... జిల్లాలోని వివిధ విభాగాలలో 16,741 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్లు జిల్లా అధికారులు స్వయంగా ప్రకటించారు. 18,311 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు కేవలం 1570 ఫిర్యాదులను మాత్రమే పరిష్కరించారు. ఈ నెల 6వ తేదీ లోపు సగమైనా పూర్తిచేయాలని జిల్లా అధికారులు ఇచ్చిన పిలుపునకు స్పందన కరువైంది. జిల్లా పరిషత్ అధికారులు నెలవారీ జరిపే మండల పరిషత్ సూపరింటెండెంట్ల సమావేశాల్లో కూడా గ్రీవెన్స్సెల్ ఫిర్యాదులపై చర్చిస్తున్నా ఫలితం నామమాత్రమే. జిల్లా అధికారుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ... సర్వే, భూ రికార్డుల ఏడీ వద్ద..79, మీసేవ ఏవో వద్ద..62, డీపీఓ 49, ఎండోమెంట్ ఈవో 21, జెడ్పీ సీఈఓ 23, వికలాంగుల సంక్షేమశాఖ 20, జీజీహెచ్ 18, రిజి స్ట్రార్10, మైనర్ ఇరిగేషన్14, మైనింగ్ ఏడీ(గుం టూరు), ఆర్డబ్ల్యూఎస్ 9, మైనార్టీ వెల్ఫేర్ 8, ఎక్సైజ్, హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద 7 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని విభాగాలకు చెందిన జిల్లా అధికారుల వద్ద పెండింగ్లో ఉ న్న దరఖాస్తులు. ఇవికాక మండలాల్లోని ప్రభుత్వ కా ర్యాలయాల్లో వందలసంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. పరిష్కారానికి కృషి ఏదీ? గ్రీవెన్స్ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, వాటి పరిష్కారానికి కృషి జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, వాటిని పరిష్కరించాల్సిన అధికారుల తీరుపై ప్రజలు అసహ నం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ సమస్యలపై మానవతా దృక్పథంతోనైనా పరిష్కరించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. -
బాబోయ్.. పేలుళ్లు
బాంబు పేలుళ్లు.. గుండెలదిరేలా, చెవులు చిల్లులు పడేలా శబ్దాలు... చిన్నాపెద్ద అంతా ఉలిక్కిపడి లేచేలా అర్ధరాత్రి వేళ బ్లాస్టింగ్లు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. పేలుళ్లకు ఇళ్లు, ఒళ్లు గుల్లవ్వడమే కాదు శబ్ద, వాయు కాలుష్యాలతో గ్రామాలకు గ్రామాలే వణికిపోతున్నాయి. అనుమతులు లేకుండా కంకర క్రషర్ల యజమానులు ఈ బ్లాస్టింగ్స్ జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ⇒ అనుమతులు లేకుండానే క్రషర్లు? ⇒ కంకర పేలుళ్లతో జనం బెంబేలు ⇒ చంటి పిల్లలకు వినికిడి సమస్యలు ⇒ బీటలు వారుతున్న ఇళ్లు ⇒ నేతల అండతోనే పేలుళ్ల దందా! జిన్నారం: మండలంలోని ఖాజీపల్లి, బొల్లారం, రాళ్లకత్వ గ్రామాల పరిధిలో దాదాపు 10 కంకర క్రషర్లు ఉన్నాయి. ఖాజీపల్లి, బొల్లారం గ్రా మాల పరిధిలోని క్రషర్లకు అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. సోలక్పల్లి పంచాయతీ పరిధిలోని రాళ్లకత్వ శివారులోని క్రషర్ గ్రామానికి సమీపంలో ఉంది. ఇక్కడ బ్లాస్టింగ్లు జరి పితే చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో భూ కంపం సంభవించినట్టుగా భారీ శబ్దాలు వెలువడి, ఇళ్ల పునాదుల్లో కదలికలు వస్తున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ఈ క్రషర్లతో రాళ్లకత్వ, సోలక్పల్లి, దాదిగూడ, ఊట్ల తదితర గ్రామాల ప్రజలు కొంత కాలంగా అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ బ్లాస్టింగ్ లు జరుపుతుండడంతో ఇళ్లల్లో నిద్రించే వారం తా ఉలిక్కిపడుతున్నారు. శబ్దాల తీవ్రత అధికం గా ఉండడం వల్ల చిన్నారులకు చెవుడు సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. పెంకుటిళ్లలో పైనుంచి మట్టి, పెంకులు కింద పడుతున్నా యి. భవనాలకు పగుళ్లు రాగా, పెంకుటిళ్లు, పశువుల కొట్టాలు కూలిపోతున్నాయి. పెంకుటిళ్లు కూలిపోతే ఇదేమని ప్రశ్నించిన వారికి కొంత డబ్బు ముట్టజెప్పడం క్రషర్ యజమానులకు అలవాటైపోయింది. పేలుళ్లు జరిపినప్పు డు భారీగా పొగలు కమ్ముకుంటున్నాయి. ఆ పొగలు గ్రామాలను పూర్తిగా కమ్మేస్తున్నాయి. వాయు కాలుష్యంతో కూడా ఇక్కడి ప్రజలు పలు రోగాలపాలవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో కంకర క్రషర్ల యజ మానులు నిబంధనలను సైతం పక్కన పెడుతున్నారు. పంచాయతీ అనుమతు లు లేకుండానే భారీ ఎత్తున క్రషర్లను నడిపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అనుమతులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. అక్రమంగా నడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. పొగతో రోగాల పాలు.. పేలుళ్లు జరిపినప్పుడు పొగ గ్రామాన్ని చుట్టేస్తుంది. అరగంట సేపు ఏమి కనిపించదు. ఈ పొగను పీల్చుకోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు సైతం రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించండి. - లక్ష్మి, రాళ్లకత్వ గోడలకు బీటలు.. ఇల్లు నిర్మించి ఏడాది కూడా పూర్తికాలేదు. అప్పుడే గోడలకు పగుళ్లు వచ్చాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఒక్క కంకర క్రషర్ కోసం ఇన్ని గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. ఎమ్మెల్యే, ఇతర నాయకులు, అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి. - శ్రీనివాస్, రాళ్లకత్వ దెబ్బతిన్న దర్వాజాలు, చౌకోట్లు.. భారీ శబ్దాలకు ఇంటి దర్వాజాలు, చౌకోట్లు దెబ్బతిన్నాయి. నిరుపేదలమైన మేము మళ్లీ దర్వాజాలను ఏర్పాటు చేసుకోవడం కష్టంగా మారింది. ఇంటిపైకి వెళ్లే మెట్లు కూడా దెబ్బతిన్నాయి. గ్రామంలో బతకటం కష్టంగా మారింది. - యాదగిరి, రాళ్లకత్వ పంచాయతీ అనుమతులు లేవు.. రాళ్లకత్వ గ్రామంలోని కంకర క్రషర్కు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. క్రషర్ను అక్రమంగా నడుపుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కంకర క్రషర్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - రాములు యాదవ్,సర్పంచ్ సోలక్పల్లి