-
డిండికి నీటిని తరలించొద్దు
నాగర్కర్నూల్: పాలమూరు పథకంలో ఎత్తిపోసే నీటిని నల్గొండ జిల్లా పరిధిలోని డిండికి నీటిని తరలించే ప్రయత్న చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక ఉద్యమాల ద్వారా 2013లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 72 జీఓ సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ వాళ్లు తొందరపడి జీఓ ఇచ్చారని మంత్రి నిరంజన్రెడ్డి వాఖ్యానించడం చూస్తే ఈ జీఓ రావడం ఇష్టం లేనట్లుందన్నారు. అయితే ముందుగా అనుకున్న విధంగా ఎగువ ప్రాంతమైన జూరాల నుంచి కాకుండా దిగువ ప్రాంతమైన శ్రీశైలం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఒకప్పుడు జూరాల నుంచి పాకాలకు నీరు తరలిద్దామని మాట్లాడిన సీఎం కేసీఆర్ పాలమూరు పథకానికి జూరాలలో నీరుదొరకదని మాట్లాడడం కేవల వివక్ష మాత్రమే అన్నారు. దీనివల్ల నార్లాపూర్, ఏదుల, వట్టెం, రిజర్వయర్లలో భూములు, ఇళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఎదుల నుంచి డిండికి నీటిని తరలించేందుకు పాలమూరు–డిండి పథకాన్ని ప్రారంభించారని దీని వల్ల ఉల్పర, సింగరాజు పల్లి, ఎర్రవల్లి, ఇర్విన్ రిజర్వాయర్లకు వేలాది ఎకరాల కల్వకుర్తి ఆయకట్టు మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి నల్గొండ జిల్లా శివన్నగూడెం ప్రాంతానికి నీరు తలించే ప్రక్రియను కృష్ణ నీటితో కాకుండా కాళేశ్వరం నీటితో చేయాలన్నారు. శివన్న గూడెం 385 మీటర్ల ఎత్తులో ఉండగా కాళేశ్వరం పథకం పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్ 490 మీటర్ల ఎత్తులో ఉన్నందున గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం సులభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు నుంచి డిండికి నీళ్లు తీసుకెళ్లం అని ప్రకటించినా పనులు మాత్రం వేగవంతంగా జరగుతున్నాయని అన్నారు. గోదావరి నీటిని ఖమ్మం, నల్గొండ జిల్లాలతోపాటు రంగారెడ్డి జిల్లాదాకా తెచ్చే ప్రణాళికలను రూపొందించాలన్నారు. అదే విధంగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. మల్లన్న సాగర్లో ఇచ్చిన పరిహారం ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. అమెరికా లాంటి దేశాలే యురేనియం పై నిషేదం విధించాయన్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో ప్రొఫెసర్ హరగోపాల్తో కలిసి నల్లమలలో తిరుగుతున్నామని, యురేనియం వల్ల ఏం నష్టం జరగబోతుందో ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు శంకర్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్
భూత్పూర్ (మహబూబ్నగర్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న 'పాలమూరు-రంగారెడ్డి' ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం రానుండడంతో జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రూ.35 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ పనులకు చెందిన పైలాన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి నేరుగా మండలంలోని కరివెన గ్రామానికి చేరుకోనున్నారు. కరివెనలోనే పైలాన్ నిర్మించారు. అనంతరం జిల్లాలో పార్టీ ముఖ్యులు, అధికారులు, కరివెన గ్రామస్తులు దాదాపు 3 వేల మందితో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం భూత్పూర్లో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement